India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మే 1 నుంచి 4 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి గురువయ్య శెట్టి సోమవారం తెలిపారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రభుత్వ జూనియర్ కళాశాల (టౌన్), అదేవిధంగా ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు (CP&M కోర్సు) ఎమ్మిగనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర), మిగతా ఒకేషనల్ కోర్సులను బి.క్యాంప్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కర్నూల్ దేవా నగర్కు చెందిన వడ్డే శివ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం మృతుడికి గద్వాల జిల్లా ఐజ మండలం బింగిదొడ్డికి చెందిన నాగేశ్వరి పల్లవితో వివాహం జరిగింది. కొంతకాలంగా వీరి మధ్య తరచూ గొడవలు జరగడందో నాగేశ్వరి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శివ మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్ననట్లు చెబుతున్నారు. కర్నూల్ మూడో పట్టణం పోలీసులు కేసు నమోదు చేశారు.
చంద్రబాబు ఆదివారం కౌతాళపురంలో ప్రజాగళం సభను నిర్వహించారు. అందులో మంత్రాలయం, ఆదోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై ఇసుక దోపిడీదారులని, ప్రజల రక్తాన్ని పీల్చే వ్యక్తులని, రోడ్డు, నీరు, అభివృద్ధి చేయలేని అసమర్ధులని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పనులను, కౌతాళంలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై మీ అభిప్రాయం?
నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. పీజీలో సీటు రాలేదని మనస్తాపానికి గురైన డా.షేక్ గని అతావుల్లా(25) ఆదివారం నంద్యాల శివారులోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇతను దేవనకొండ మాండలం తెర్నేకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మర్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చంద్రబాబు మాయ మాటలు నమ్మవద్దని, TDP భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని బాలనాగిరెడ్డి అన్నారు. ఆదివారం కామన్ దొడ్డిలో ప్రచార యాత్ర నిర్వహించారు. కూటమిగా వచ్చినా వ్యక్తిగతంగా వచ్చిన ఈసారి గెలుపు YCPదేనని ధీమా వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలతో పరిపాలనను బ్రష్టు పట్టించింది చంద్రబాబు అని ఎద్దేవ చేశారు. ఇంటి వద్దకు పాలన అందించే విశ్వసనీయత గల ప్రభుత్వం YCP ప్రభుత్వం అని, ఓటు వేసి గెలిపించాలన్నారు.
కర్నూలులో జిల్లాలో ఈ సారి క్లీన్ స్వీప్ చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. మంత్రాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మీకు తాగడానికి నీళ్లు ఇవ్వలేదుగాని, ఇసుకను దొంగిలించాడని ఆరోపించారు. ఆయన ఉద్యోగం, నీళ్లు, రోడ్డు పనులు ఏమైనా చేశాడా అని ప్రశ్నించారు. ఆయన బడుగు బలహీన వర్గాల రక్తాలు తాగే వ్యక్తని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి స్టేట్ సిలబస్లో 500 మార్కులు, సెంట్రల్ సిలబస్లో 420 మార్కులు సాధించిన విద్యార్థులు ఆర్డీటీ సెట్ 2024కు దరఖాస్తు చేసుకోవాలని ఏరియా టీం లీడర్ రెహనా తెలిపారు. అర్హులైన విద్యార్థులు మే 4వ తేదీ నుంచి 10 వరకు దరఖాస్తులను ఆర్డీటీ కార్యాలయంలో అందజేయాలని, మే 19న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు యశోద గార్డెన్లోని ఆర్డీటీ ఆఫీసును సంప్రదించాలన్నారు.
ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 5,777 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా.. 1,445 మంది ఉత్తీర్ణత సాధించారు. 1,404 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. 209 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం అధికార వెబ్సైట్ను సందర్శించాలని ఆయన తెలపారు.
కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ 2023 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో సెమిస్టర్ ఫలితాలను శనివారం వైస్ ఛాన్స్లర్ సుధీర్ ప్రేమ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షకు 2,828 మంది విద్యార్థులకు హాజరు కాగా.. 2,591 మంది పాసయ్యారని పేర్కొన్నారు. సప్లమెంటరీ పరీక్షకు 528 మంది విద్యార్థులకు గాను 440 మంది విద్యార్థులు పాసయ్యారన్నారు.
రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదోని ఆర్ఎస్ యార్డు కిమీ 494/3-1 వద్ద శనివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ కే.గోపాల్ తెలిపిన వివరాల మేరకు.. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. ఎడమ చేతిపై మామ్, డాడ్ అని పచ్చబోట్లు ఉన్నాయని, మెడలో శ్రీఆంజనేయ స్వామి డాలర్ చైన్ ఉందని తెలపారు. ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.