India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు హెలికాఫ్టర్లో కౌతాళంలోని జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్కు చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు బస్టాండ్ సెంటర్లో ప్రసంగిస్తారు. సాయంత్రం 6.10 గంటలకు గూడూరుకు చేరుకుని బస్టాండ్ సర్కిల్లో 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు సభలో మాట్లాడతారు. రాత్రికి గూడూరులోనే బస చేస్తారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బంది కి సంబంధించి రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఆన్లైన్ సాఫ్ట్వేర్లో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జనరల్ అబ్జర్వర్లు జాఫర్, మీర్ తారిఖ్ ఆలీ సమక్షంలో పోలింగ్ సిబ్బందికి సంబంధించిన రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.
కర్నూలు: విశ్వవిద్యాలయాలతో పాటు డిగ్రీ కళాశాల అధ్యాపకుల అర్హత పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు పరీక్షల కన్వీనర్ శనివారం ప్రకటనలో వెల్లడించారు. కర్నూలులోని 9 పరీక్ష కేంద్రాల్లో దాదాపు 3,883 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఉదయం 9:30 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
పతకాలు సాధించే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. శనివారం స్థానిక జొహరాపురంలోని టెన్నిస్ కోర్టులో నిర్వహించిన రెండు రోజుల గ్రేటర్ రాయలసీమ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీ, ప్రశంసా పత్రాలను అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంటానన్నారు.
చాగలమర్రి మండల పరిధిలోని జాతీయ రహదారి నగళ్లపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర నంద్యాల నుంచి కడపకు వెళ్లే దారిలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి మధ్యలో కారు పడింది. ప్రమాద స్థలంలోనే కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డ్రైవర్ గండికోట చక్రపాణి మృతిచెందాడు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంతు నాయక్, చాగలమర్రి ఎస్సై అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
నంద్యాల జిల్లా న్యాయవాదుల సంఘానికి ఎన్నికలు ముగిశాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన రావినూతల దుర్గాప్రసాద్ తన ప్రత్యర్థి నందీశ్వర్ రెడ్డిపై 99 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన వెంకటేశ్వర్లు ప్రత్యర్థి శ్రీనివాసులుపై 141 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్పోర్ట్స్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన భూమా వెంకటరెడ్డి తన ప్రత్యర్థి చిన్న లింగమయ్యపై 105 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధికి కన్నడ, తెలుగు నటుడు సుదీప్ కుటుంబ సమేతంగా వచ్చారు. వీరికి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు గ్రామ దేవత శ్రీ మంచాలమ్మ దేవిని, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. హీరో సుదీప్కు శ్రీ మఠం అర్చకులు ఫల మంత్రాక్షితలు అందజేశారు.
రాష్ట్రంలో ఉన్న 175 సీట్లలో 150 సీట్లు కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి పేర్కొన్నారు. నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు సాగు, తాగు నీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో 150 సీట్లతో టీడీపీ కూటమి గెలుస్తుందన్నారు.
బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. కోడుమూరులోని కర్నూలు రహదారిలో బొలేరొ వాహనం వేగంగా దూసుకొచ్చి రెండు బైక్లు ఢీకొని బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి పోతుగల్ వీఆర్వో వెంకటేశ్గా స్థానికులు గుర్తించారు.
బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లెకు చెందిన శ్రీవాణి తన భర్త కృష్ణారెడ్డితో కలిసి ఆళ్లగడ్డలో శుభాకార్యానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ సమీపంలోని ఏవీ గోడౌన్స్ వద్ద వెళుతన్న బైక్ను ప్రైవేట్ బస్సు వెనుకనుంచి ఢీ కొంది. ఈ ప్రమాదంలో శ్రీవాణి అక్కడికక్కడే మృతిచెందింది.
Sorry, no posts matched your criteria.