Kurnool

News September 28, 2024

రాష్ట్ర హైకోర్టు జడ్జిని కలిసిన కర్నూలు ఎస్పీ

image

కర్నూలుకు విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు జడ్జి డాక్టర్ జస్టిస్ కే.మన్మథ రావును ఎస్పీ జీ.బిందు మాధవ్ శనివారం ఉదయం కర్నూలులోని ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్‌లో కలిశారు. పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News September 28, 2024

వచ్చే నెల 1న పత్తికొండకు సీఎం రాక

image

పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామానికి అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి పర్యటన వివరాలను వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు పుచ్చకాయలమాడకు చేరుకుని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

News September 28, 2024

‘రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీలలో పథకాలు సాధించండి’

image

తూర్పుగోదావరి జిల్లాలో త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి అండర్-14, 17 బాల బాలికల రైఫిల్ షూటింగ్ పోటీలలో జిల్లా షూటర్లు పథకాలు సాధించాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి గిడ్డయ్య కోరారు. శుక్రవారం రైఫిల్ షూటింగ్ అకాడమీలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. గెలుపొందిన క్రీడాకారులకు రైఫిల్ షూటింగ్ కార్యదర్శి ఎంఎండీ బాషా బహుమతులు అందజేశారు.

News September 28, 2024

మాదక ద్రవ్యాల దుష్ర్పభావాలపై యువతకు అవగాహన తప్పనిసరి: ఎస్పీ

image

జిల్లాలో మాదక ద్రవ్యాల దుష్ర్పభావాలను తెలియజేసి, వాటి వినియోగాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హాలులోమాదకద్రవ్యాల నిషేధంపై కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల దుష్ర్పభావాలపై పాఠశాల, కళాశాలల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

News September 28, 2024

అధికారులకు కర్నూలు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ఓటర్ల జాబితా సవరణలో ఎన్నికల కమిషన్ గైడ్‌లైన్స్ కచ్చితంగా పాటించాలని కలెక్టర్ రంజిత్ బాషా ఈఆర్ఓలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో స్పెషల్ సమ్మరీ రివిజన్‌పై సమావేశం నిర్వహించారు. ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18వ తేది వరకు ప్రీ రివిజన్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 27, 2024

జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అహోబిలం

image

జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అహోబిలం ఎంపికైంది. ప్రపంచం పర్యాటక దినోత్సవం సందర్బంగా నేడు ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ చేతుల మీదుగా అవార్డును నంద్యాల ఇంటాచ్ చాప్టర్ కన్వీనర్ శివ కుమార్ రెడ్డి, ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖాధికారి లంజ్వంతి నాయుడు కలిసి అందుకున్నారు.

News September 27, 2024

రాష్ట్రస్థాయి లాంగ్ జంప్ పోటీలకు నందవరం కేజీబీవీ విద్యార్థిని ఎంపిక

image

నందవరం కేజీబీవీ 8వ తరగతి విద్యార్థిని జీ.స్వాతి రాష్ట్రస్థాయి లాంగ్ జంప్ పోటీలకు ఎన్నికైనట్లు నందవరం కేజీబీవీ ప్రిన్సిపల్ శైలజ తెలిపారు. 26న జరిగిన జిల్లాస్థాయి లాంగ్ జంప్ పోటీలో స్వాతి ప్రతిభ కనబరిచి నాలుగో స్థానంలో విజయం సాధించిందని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన స్వాతిని ఆమె అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలలో మెరుగైన ప్రతిభను కనబరిచి విజయం సాధించాలని కోరారు.

News September 27, 2024

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు మద్దికేర విద్యార్థి ఎంపిక

image

మద్దికేరకు చెందిన ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న యువరాజ్ రాష్ట్రస్థాయి అండర్-19 క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. పట్టుదలతో కొన్నేళ్లుగా శ్రమించిన దానికి ఫలితం నేడు దక్కిందని కరస్పాండెంట్ యజ్ఞం వెంకట్ మాధవ్ అన్నారు. ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయుడు భాస్కర్ యాదవ్ విద్యార్థిని అభినందించారు.

News September 27, 2024

ఈవీఎంలు భద్రపరచిన గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

image

ఈవీఎంలు భద్రపరచిన గోడౌన్‌ను కలెక్టర్ రంజిత్ బాషా శుక్రవారం పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీసీ కెమెరాల నిఘాలో ఈవీఎంలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సంబంధిత రిజిస్టర్‌లో కలెక్టర్ సంతకం చేశారు. ఆయనతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఉన్నారు.

News September 27, 2024

కర్నూలు: పెన్షన్లకు రూ.102.97 కోట్లు

image

అక్టోబర్ నెలలో కర్నూలు జిల్లాలో పెన్షన్ల పంపిణీకి గాను రూ.102.97 కోట్ల నిధులు విడుదలైనట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ సలీం బాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,41,843 పెన్షన్లకు నగదు మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఎంపీడీవోలు డ్రా చేసుకుని నేరుగా సచివాలయ ఉద్యోగులకు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.