India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యాటకులకు స్వర్గధామం. ఎన్నో దర్శనీయ స్థలాలు మన జిల్లాలో ఉన్నాయి. శ్రీశైలం, మహానంది, అహోబిళం, మంత్రాలయం, యాగంటి, కొండారెడ్డి బురుజు, యల్లర్తి దర్గా, నందవరం చౌడేశ్వరి దేవి దేవాలయం, బెలుం గుహలు, ఓర్వకల్ రాక్ గార్డెన్ ఇలా ఎన్నో మధురానుభూతులు పంచే పర్యాటక ప్రాంతాలు మన జిల్లా సొంతం. మరి జిల్లాలో మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి..
#World Tourism Day
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి ఎంపీడీవోలు, ఏపీడీలు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉపాధి హామీ పథకం కింద నిర్ధేశించిన లేబర్ బడ్జెట్, వంద రోజుల పనిదినాల కల్పన, హార్టికల్చర్, అవెన్యూ ప్లాంటేషన్ పనులు ప్రగతి లక్ష్యాలపై క్లస్టర్ల వారీగా సమీక్షించారు.
కర్నూలు కలెక్టరేట్ పరిపాలన అధికారిగా విజయశ్రీ గురువారం ఏవో ఛాంబర్లో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. గతంలో సీ.బెళగల్ మండలంలో తహశీల్దార్గా బాధ్యతలు నిర్వహించిన విజయశ్రీ సాధారణ బదిలీలలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పరిపాలన అధికారిగా పనిచేసిన రాజేశ్వరి కలెక్టరేట్ రెవెన్యూ సెక్షన్లోనే నియమితులయ్యారు.
నంద్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో గురువారం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావంతో ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలని పోలీసులకు ఎస్పీ పిలుపునిచ్చారు. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కడా మట్కా, గ్యాంబ్లింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు.
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, కర్నూలు ఎస్పీ జీ.బిందు మాధవ్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఐజీ మాట్లాడుతూ అల్లరి మూకలు, ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన వారిపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రాబరీ, డెకాయిటి వంటి కేసులపై దర్యాప్తులు పకడ్బందీగా చేయాలన్నారు.
విజయవాడలోని R&B ఈఎన్సీ కార్యాలయంలో CM చంద్రబాబు ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల అప్ గ్రేడేషన్కు సంబంధించి గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. భూసేకరణ సమస్యలు, అటవీ క్లియరెన్స్, తదితర సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి బీసీ, వారికి దిశానిర్దేశం చేశారు.
ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలిని సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధుల్లో నిర్లక్ష్యంతో బేబీ డెత్కు కారణమైనట్లు ఆరోపణలు రావడం, సహచర వైద్యులతో విభేదాలు తలెత్తి ఒకరినొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో నిన్న విచారణ చేపట్టిన జిల్లా వైద్యాధికారి మాధవి.. నేడు మైథిలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. కరివేన గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. సతీశ్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానంతో చలమయ్యపై కోపం పెంచుకున్నాడు. నిన్న చలమయ్య తన బాబాయ్ ఇంటికి వెళ్లిన సమయంలో సతీశ్ గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో చలమయ్యకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటనారాయణ రెడ్డి తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన మళ్లీ వాయిదా పడింది. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో నేడు సీఎం పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. తాజాగా ఈ పర్యటన మళ్లీ వాయిదా పడింది. గతనెల 31న సీఎం పత్తికొండకు రావాల్సి ఉండగా వర్షం కారణంగా పర్యటన రద్దైన విషయం తెలిసిందే.
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పోలీస్ కార్యాలయంలో ఆళ్లగడ్డ సబ్ డివిజన్కు సంబంధించి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరు, పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీశారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించాలి.
Sorry, no posts matched your criteria.