India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దకడబూరులోని ఆది ఆంధ్ర MPP స్కూళ్లో పనిచేస్తున్న HM సుప్రసాద్ పై పోక్సో కేసు నమోదైనట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. కాగా ఆయన ఈ ఏడాది ఆగస్టులో బాలికలకు ఫోన్లో అసభ్యకర వీడియోలను పంపించారు. దీనిపై MEO సువర్ణల సునియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల నిన్న రాత్రి వరకు కురిసిన వర్షానికి లోత్టటు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నందవరం మండలం కనకవీడు గ్రామంలో నరసింహుడు అనే వ్యక్తి మట్టి మిద్దె వర్షానికి కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకుపోవడంతో ప్రమాదం తప్పింది. పలు చోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బేతంచెర్ల పట్టణానికి చెందిన డీజే మధు డాన్స్ బృందం విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి ప్రథమ స్థానం కైవసం చేసుకుని రూ.50వేల నగదు బహుమతిని అందుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలకు 17 జట్లు హాజరయ్యాయి. ఈ పోటీల్లో బేతంచెర్ల డీజే మధు బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పట్టణవాసులు బృందం సభ్యులను అభినందించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీగా ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. ఒకేసారి 42 మంది ఎంపీడీవోలకు స్థానాలు కేటాయిస్తూ జెడ్పి సీఈవో నాసరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ముగ్గురు ఎంపీడీవోలను కడప జిల్లా నుంచి జిల్లాకు కేటాయించగా, మరో ఆరుగురు ఎంపీడీవోలను అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లాకు కేటాయించారు.
బేతంచెర్ల మండలం ముచ్చట్ల దేవాలయానికి వెళ్లే రహదారిపై మంగళవారం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బేతంచెర్లకు చెందిన యువకులు బైకుపై వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుంచే శ్రీనివాసులు(22) అక్కడికక్కడే మృతి చెందగా, గణేష్కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
డోన్ నియోజకరవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డికి కీలక నామినేటెడ్ పదవి వరించింది. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా ప్రభుత్వం ఆయనను నియమించింది. ఎన్నికల ముంగిట సీనియర్ నేత కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేయడం, వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కీలక బాధ్యతలు నిర్వర్తించి కార్యకర్తలకు అండగా ఉండటంతో ఆయనకు టీడీపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది.
సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గుజరాత్లో పర్యటిస్తున్నారు. మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన హై లెవెల్ కమిటీ సభ్యులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఆ రాష్ట్రంలో పీపీపీ విధానంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి, ఇతర అనేక అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. నిన్న ఆ రాష్ట్ర ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి, చీఫ్ ఇంజినీర్లతో అహ్మదాబాద్లో సమావేశమై చర్చించారు.
నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 135 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలపై అధికారులు చొరవచూపి పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా ప్రతి పోలీస్ అధికారి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు పాల్గొన్నారు.
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి కర్నూలు జిల్లా ప్రముఖ రాజకీయ నేత. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, రెండుసార్లు సీఎంగా సేవలందించారు. విద్య, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పాలనలో తనదైన ముద్ర వేశారు. ఐదుసార్లు శాసనసభ, ఆరుసార్లు పార్లమెంటుకు ఎన్నికై 1999 ఎన్నికలలో ఓటమితో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 81 ఏళ్ల వయసులో 2001లో తుదిశ్వాస విడిచారు. ఆయనెవరో గుర్తుపట్టారా? ఆయన జన్మించిన గ్రామం పేరేంటి? కామెంట్ చేయండి.
కర్నూలు జిల్లాలో వివిధ శాఖలకు అధికారులను నియమిస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నూతన డీఆర్డీఏ పీడీగా ప్రతాపరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిగా రామనాథరెడ్డి, జిల్లా సివిల్ సప్లై మేనేజర్గా నాగసుధను నియమించారు. ప్రస్తుతం డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సలాం బాషాను సంబంధిత శాఖ రాష్ట్ర కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.