India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు నుంచి విజయవాడ జంక్షన్కు రైలు సౌకర్యం కల్పించాలని రైల్వేశాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోమణ్ణను భరత్ కలిసి రైల్వే సమస్యలపై వినతిపత్రం అందించారు. కర్నూలు నుంచి విజయవాడకు ప్రతి రోజూ రైలు, కర్నూలు నుంచి ముంబైకి వారంలో ఒకటి లేదా రెండు సార్లు రైలు సౌకర్యం కల్పించాలని కోరారు.
శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు అందించిన విరాళాలు రూ.2,22,70,749ను సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అందజేశారు. మంగళగిరిలో సీఎం చంద్రబాబుకు ఈ మొత్తాన్ని అందజేశారు. నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, వ్యాపారవేత్తలు, పొదుపు మహిళలు, విద్యార్థులు అందించిన మొత్తం సొమ్మును లెక్క చూపి ఆయనకు అందజేశారు. ప్రజలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటివరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..
కర్నూలు జిల్లాలో ఇసుక ఆన్లైన్ అమ్మకాలు ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి ప్రారంభమవుతాయని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ డీడీ రాజశేఖర్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక బుకింగ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇసుక కొనుగోలుదారులు తహశీల్దారు కార్యాలయాలు, సచివాలయాల్లో బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపారు.
కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా ఆర్.జయలక్ష్మిని నియమిస్తూ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జయలక్ష్మి అనంతపురం మార్కెట్లో విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత కార్యదర్శి గోవిందును అనంతపురం బదిలీ చేశారు.
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ట్రైనీ ఐపీఎస్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఏపీకి నలుగురు ట్రైనీ ఐపీఎస్లను కేటాయించింది. నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లెకు చెందిన వంగల మనీషా రెడ్డి ఆ జాబితాలో ఉన్నారు. సొంత రాష్ట్రానికి ట్రైనీ ఐపీఎస్గా కేటాయించడంతో నందిపల్లి గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
శిరివెళ్లలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కాశిరెడ్డి నాయన దేవాలయం సమీపంలోని కాలువలో పడి శంకరయ్య(13) అనే బాలుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన గురుమూర్తి, సుంకమ్మ కుమారుడు శంకరయ్య నిన్నటి నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలిస్తుండగా ఆలయం పక్కన ఉన్న కాలువలో మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా వ్యాప్తంగా ఊరూరా స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీ.రంజిత్ బాషా బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
చిన్నారుల ఆరోగ్యం పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం నంద్యాలలోని పొన్నాపురం కాలనీలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారి ప్రత్యేక దత్తత కేంద్రం (జిల్లా బాలల సంరక్షణ విభాగం)ను తనిఖీ చేశారు. దత్తత కేంద్రంలోని వసతులు, చిన్నారుల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న చర్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఉ.కర్నూలు జిల్లాలో కొత్తగా మరిన్ని <<14130693>>అన్న<<>> క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాటి అడ్రస్లు ఇవే..
➤ ఆళ్లగడ్డ: టీబీ రోడ్డు పాతూర్ వీధి
➤ డోన్: LIC కార్యాలయం కింద
➤ ఎమ్మిగనూరులో(రెండు చోట్ల): శ్రీనివాస థియేటర్ ఎదురుగా, తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో
➤ గూడూరు: కూరగాయల మార్కెట్ వద్ద
➤ ఆదోనిలో(మూడు చోట్ల): పాత లైబ్రరీ పోస్ట్ ఆఫీస్, యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా, శ్రీనివాస భవన్
SHARE IT
Sorry, no posts matched your criteria.