Kurnool

News September 15, 2024

నంద్యాల విద్యార్థికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్’లో చోటు

image

నంద్యాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి హావీస్ తన ప్రతిభతో ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. రమేశ్, స్వర్ణ దంపతుల కుమారుడు హావీస్ ప్రముఖ చిత్రకారుడు కోటేశ్ వద్ద చిత్రకళలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో ఆయన పోట్రేయిట్ చిత్రాన్ని 3 గంటల్లో 3,022 చిన్న బొట్టు బిళ్లలను అతికిస్తూ తయారు చేశాడు. హవీస్‌కు సంస్థ ప్రతినిధులు ప్రశంసా పత్రాన్ని అందించారు.

News September 15, 2024

యువకుడిని కాపాడిన నంద్యాల పోలీసులు

image

నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు కాపాడారు. వివరాలు.. గడివేముల మండలం మంచాలకట్టకు చెందిన మానస ఆత్మహత్యకు పాల్పడింది. మనస్తాపానికి గురైన మానస భర్త అశోక్ (25) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. బంధువుల సమాచారం, ఎస్పీ, డీఎస్పీల దిశానిర్దేశంతో ఆపరేషన్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబీకులకు అప్పగించారు.

News September 15, 2024

తుగ్గలి: వజ్రం దొరికింది

image

ఓ రైతుకు వజ్రం దొరికిన ఘటన తుగ్గలి మండలంలో జరిగింది. మండలంలోని సూర్యతండాకు చెందిన ఓ రైతు పొలం పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయనకు 8 క్యారెట్ల బరువైన వజ్రం దొరికింది. దానిని జొన్నగిరికి చెందిన ఓ వ్యాపారి రూ.10 లక్షలకు కొనేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

News September 15, 2024

మహానందిలో భక్తుల సందడి

image

మహానంది ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా కనిపిస్తుంది. సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చారు. కోనేరులలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేపట్టారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కొనసాగుతుంది. స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణాలు తిలకించారు.

News September 15, 2024

గణేష్ నిమజ్జనం సజావుగా సాగేలా చర్యలు తీసుకోండి- ఎస్పీ

image

వినాయక ఉత్సవాల్లో ఆఖరు ఘట్టమైన గణేష్ నిమజ్జనం జిల్లా కేంద్రంలో సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జరిగే గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గణేష్ నిమజ్జనం ఘాట్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక ప్రతిమల ఊరేగింపు మొదలు నిమజ్జనం పూర్తి అయ్యేవరకు, ఉత్సవ కమిటీలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News September 15, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ

image

కర్నూలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఈనెల 16న(సోమవారం) నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ జి.బిందు మాధవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు కర్నూలుకు రావద్దని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఎస్పీ బిందు మాధవ్ సూచించారు.

News September 14, 2024

ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు: ఎస్పీ

image

కర్నూలులో రేపు గణేశ్ నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ‘ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. శోభయాత్రలో ప్రజలు, భక్తుల పట్ల పోలీసులు సత్ప్రవర్తనతో మెలగాలి. నిమజ్జనం ముగిసే వరకు పోలీసులు తమకు కేటాయించిన విధుల్లో ఉండాలి’ అని దిశా నిర్దేశం చేశారు.

News September 14, 2024

కొండారెడ్డి బురుజుకు ఆ పేరెలా వచ్చింది?

image

కర్నూలులోని కొండారెడ్డి బురుజును క్రీ.శ 16వ శతాబ్దంలో అచ్యుతదేవరాయులు నిర్మించారు. 1602-1618 మధ్య అబ్దుల్ వహాబ్ కందనవోలును పరిపాలించే వారు. ఆ సమయంలో నందికొట్కూరు తాలుకాలోని పాతకోట పాలెగాడైన కొండారెడ్డి అతని అధికారాన్ని ధిక్కరించారట. దీంతో వహాబ్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కారాగారంలో బంధించాడు. అందులోనే మరణించడంతో అతని పేరుమీద దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.

News September 14, 2024

కర్నూలు: 16న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

image

ఈ నెల 16న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శనివారం ఓ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం, డివిజన్ స్థాయి, మున్సిపాలిటీ, మండల స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News September 14, 2024

కొండారెడ్డి బురుజుకు ఆ పేరెలా వచ్చింది?

image

కర్నూలులోని కొండారెడ్డి బురుజును క్రీ.శ 16వ శతాబ్దంలో అచ్యుతదేవరాయులు నిర్మించారు. 1602-1618 మధ్య అబ్దుల్ వహాబ్ కందనవోలును పరిపాలించే వారు. ఆ సమయంలో నందికొట్కూరు తాలుకాలోని పాతకోట పాలెగాడైన కొండారెడ్డి అతని అధికారాన్ని ధిక్కరించారట. దీంతో వహాబ్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కారాగారంలో బంధించాడు. అందులోనే మరణించడంతో అతని పేరుమీద దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.