Kurnool

News April 16, 2024

బాలనాగిరెడ్డి ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్ముతున్నారు: బాలకృష్ణ

image

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్మి కోట్లు సంపాదించారని బాలకృష్ణ విమర్శించారు. మంగళవారం కోసిగిలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో మాట్లాడారు. తుంగభద్ర నది నుంచి ఇసుక తవ్వి అభివృద్ధిని మరిచారని అన్నారు. అక్రమ మద్యం, కల్తీ సారాయి అమ్మి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఆలోచించి TDP అభ్యర్థి రాఘవేంద్రని గెలిపించాలని కోరారు.

News April 16, 2024

శ్రీశైలంలో ఆగమ పాఠశాలలో ప్రవేశ పరీక్షలు

image

శ్రీశైలంలోని వీరశైవ ఆగమ పాఠశాలలో మంగళవారం వార్షిక పరీక్షలు నిర్వహించినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. మంగళవారం శ్రీశైలంలో ఆగమ పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ.. అర్చక ప్రవేశ, వర, ప్రవర కోర్సులకు సంబంధించి ఆగమ పరీక్షలు జరిగాయన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 115మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. రేపటితో పరీక్షలు ముగుస్తాయన్నారు.

News April 16, 2024

కర్నూలు కిమ్స్‌లో తొలిసారిగా స్కోరింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ

image

క‌ర్నూలు జిల్లాలోని కొండాపురం గ్రామానికి చెందిన స‌త్యనారాయ‌ణ రాజు దీర్ఘకాల కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్న వ్యక్తికి గుండెల్లో స‌మ‌స్య త‌లెత్తింది. ఈ కేసులో రిస్క్ ఎక్కువ ఉండ‌టంతో యాంజియోప్లాస్టీ చేసేందుకు కొంద‌రు వైద్యులు అంగీక‌రించ‌లేదు. క‌ర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో ఈ రోగికి విజ‌య‌వంతంగా స్కోరింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ చేశారని కార్డియాల‌జిస్టు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.

News April 16, 2024

ఆదోని: బీజేపీ జిల్లా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా

image

కర్నూలు జిల్లా బీజేపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు ఆదోనికి చెందిన రమేశ్ యాదవ్ మంగళవారం తెలిపారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి తమను నిర్లక్ష్యం చేయడంతో బీజేపీకి వీడ్కోలు పలికానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం ఇస్తే ఆదోని నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీల అండ తనకు ఉందని పేర్కొన్నారు.

News April 16, 2024

కర్నూలు: ఈనెల 19, 20వ తేదీల్లో షర్మిల పర్యటన

image

‘ఏపీ న్యాయ యాత్ర’లో భాగంగా ఈనెల 19, 20వ తేదీల్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కే.బాబురావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 19న అలూరు, ఆదోని, కోసిగిలో, 20న కోడుమూరు, కర్నూలులో పర్యటించనున్నట్లు చెప్పారు. ఈ యాత్రను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News April 16, 2024

వైసీపీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్‌గా ఎస్వీ మోహన్ రెడ్డి

image

సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కర్నూలు పార్లమెంట్ డిప్యూటీ రీజినల్ కో- ఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సంబంధిత రీజినల్ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యంలో డిప్యూటీ రీజినల్ కో-ఆర్డినేటర్ పనిచేస్తారని ఉత్తర్వులో పేర్కొంది.

News April 16, 2024

కర్నూలు: 399 మంది వాలంటీర్ల రాజీనామా

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 339 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని జెడ్పీ సీఈఓ నాసర రెడ్డి తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు 264 మంది రాజీనామా చేయగా.. 15న ఒక్కరోజే 135 మంది రాజీనామా చేశారన్నారు. సంబంధిత ఎంపీడీఓలు వారి రాజీనామాలను ఆమోదించారన్నారు. 15న రాజీనామా చేసిన వారిలో కోసిగి మండలంలో 46, కల్లూరు 38, మద్దికెర 3, తుగ్గలి 21, ఆదోని 16. కౌతాళం మండలంలో 11 మంది ఉన్నారని సీఈఓ తెలిపారు.

News April 16, 2024

పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి గౌస్ దేశాయ్‌ రాజకీయ ప్రస్థానం

image

పాణ్యం సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌస్ దేశాయ్‌ స్వగ్రామం పెద్దకడబూరు మండలం కల్లుకుంట. బీఈడీ పూర్తిచేశారు. ఎస్ఎఫ్ఎలో చేరి విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు. 1988లో సీపీఎం సభ్యత్వం పొందారు. అనేక ఉద్యమాలలో పాల్గొని నాయకత్వం వహించారు. 1993లో సీపీఎం సర్పంచిగా గెలిచేలా కృషి చేశారు. డీవైఎఫ్ఎ కర్నూలు నగర కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. సీఐటీయూ కర్నూలు నగర, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.

News April 16, 2024

వైసీపీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్‌గా ఎస్సీ మోహన్ రెడ్డి

image

సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కర్నూలు పార్లమెంట్ డిప్యూటీ రీజినల్ కో- ఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే ఎస్సీ మోహన్ రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సంబంధిత రీజినల్ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యంలో డిప్యూటీ రీజినల్ కో-ఆర్డినేటర్ పనిచేస్తారని ఉత్తర్వులో పేర్కొంది.

News April 16, 2024

18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల : కర్నూలు కలెక్టర్

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 18వ తేదిన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు, అదే రోజు 11నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సంబంధిత కార్యాలయాల్లో నామినేషన్ పత్రాలను అందుబాటులో ఉంచామన్నారు.