Kurnool

News September 13, 2024

శ్రీమఠంలో సినీ నటుడు లారెన్స్‌

image

శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్ గురువారం మంత్రాలయానికి వచ్చారు. ఆయనకు శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. ముందుగా గ్రామదేవత శ్రీ మంచాలమ్మ దేవిని, గురు రాయల బృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు ఫలమంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు.

News September 12, 2024

ఆవులగడ్డ నుంచి ఆళ్లగడ్డ!

image

ఆళ్లగడ్డను పూర్వం ‘ఆవులగడ్డ’ అని పిలిచేవారట. కాలక్రమేణా ఆ పేరు ఆళ్లగడ్డగా మారింది. శిల్పకళా రంగంలో ఆళ్లగడ్డ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడి శిల్పులకు కటిక రాతికి జీవకళ పోయడం ఉలితో పెట్టిన విద్య. స్థానిక దురుగడ్డ వంశీకులు 300 ఏళ్ల క్రితం శిల్పాల తయారీకి శ్రీకారం చుట్టగా నేటికీ ఇదే వృత్తిపై వందల మంది జీవిస్తున్నారు. ఆళ్లగడ్డలో తయారు చేసిన విగ్రహాలు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతుంటాయి.

News September 12, 2024

వరద బాధితులకు రూ.11 లక్షల విరాళం

image

కర్నూలు: వరద బాధితుల సహాయార్థం రూ.11 లక్షలు అందజేశామని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. విజయవాడలోని సచివాలయంలో మంత్రి నారా లోకేశ్‌‌ను ఎమ్మెల్సీ రామలింగారెడ్డితో కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సుబ్బారెడ్డిని లోకేశ్ అభినందించారు. వరద బాధితులను ఆదుకోవడానికి మరింతమంది ముందుకు రావాలని కోరారు.

News September 12, 2024

నంద్యాల: కూతురుకి వింత వ్యాధి.. తల్లిదండ్రుల ఆవేదన

image

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాకు చెందిన నాగేశ్వరరావు, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కొడుకు రవికుమార్ గతేడాది జూలైలో విల్సన్ అనే వింత వ్యాధికి గురై, కాలేయంలో రాగి నిల్వలు పేరుకుపోయి పదేళ్ల వయసులో మరణించాడు. రెండో సంతానం అయిన విజయలక్ష్మికీ అదే వ్యాధి సోకింది. కుమార్తె కూడా తమకు దక్కదని, వైద్యం కోసం రూ.40 లక్షలు అవసరమని ఆవేదన చెందుతున్నారు.

News September 12, 2024

స్పెషల్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు అవకాశం

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 2015-2018 వరకు డిగ్రీ కోర్స్ పూర్తి చేసుకునేందుకు అభ్యర్థులు స్పెషల్ సప్లిమెంటరీ చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అక్టోబర్ 5వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 12, 2024

ఉపాధి హామీలో 25వ స్థానం: కర్నూలు కలెక్టర్

image

ఉపాధి హామీ పనుల కల్పనలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా 25వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రంజిత్ బాషా అసహనం వ్యక్తం చేశారు. తుగ్గలి మండలంలో గతవారం జీరో శాతం నమోదుపై సంబంధిత అధికారులందరికీ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఉపాధి హామీ, హౌసింగ్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వెల్దుర్తి, కృష్ణగిరి, కర్నూలు, ఓర్వకల్ మండలాల్లో పనులు కల్పించడంలో వెనుకబడి ఉన్నారని అన్నారు.

News September 11, 2024

డోన్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

image

డోన్ పట్టణం పాతపేరు ద్రోణపురి. పాండవుల గురువైన ద్రోణాచార్యుడు తీర్థయాత్రలకు బయలుదేరి దారి మధ్యలో ఈ ప్రాంతంలోని కొండలపై కొంత సమయం బస చేస్తాడట. అందుకు గుర్తుగానే ఈ ప్రాంతానికి ద్రోణపురి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. కాలానుగుణంగా ఈ పేరు ద్రోణాచలంగా మారింది. బ్రిటిష్ హయాంలో ఈ పట్టణం డోన్‌గా స్థిర పడింది. నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

News September 11, 2024

చందలూరులో కుళాయి గుంతలో పడి బాలుడి మృతి

image

నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చందలూరు గ్రామంలో కుళాయి గుంతలో పడి గౌతమ్ (5) అనే బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సుబ్బయ్య, మహేశ్వరి దంపతుల కుమారుడు గౌతమ్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కుళాయి కోసం తీసిన గుంతలో పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతి చెందాడు. గుంతలను పంచాయతీ అధికారులు పూడ్చకపోవడంతోనే తమ కుమారుడు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు.

News September 11, 2024

ఎలాంటి అపశ్రుతులు లేకుండా నిమజ్జనం పూర్తి చేయాలి: ఎస్పీ

image

గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ బిందు మాధవ్ ఆదేశించారు. ఆదోని మండలం చిన్నహరివాణం ఎల్లెల్సీ కాలువ వద్ద గురువారం వినాయక ఘాట్‌ను ఆయన పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడుతూ.. నిమజ్జనం సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. నిర్వాహకులకు సూచనలు చేస్తూ ఉండాలన్నారు.

News September 11, 2024

నంద్యాల: గుండెపోటుతో వైసీపీ నేత మాతృమూర్తి మృతి

image

బనగానపల్లె నియోజకవర్గ వైసీపీ నాయకుడు కాటసాని ప్రసాద్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రసాద్ రెడ్డి మాతృమూర్తి కాటసాని ఈశ్వరమ్మ(73) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. స్వగ్రామం అవుకు మండలం గుండ్లసింగవరంలో సాయంత్రం 4 గంటలకు అంతక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.