India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల జిల్లా గోగులదిన్నెకు చెందిన ఉదయ్ కిరణ్ అనే యువకుడు రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వెంగాయపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పగిడ్యాల మండలం ముచ్చుమర్రి బాలిక ఆచూకీ 63 రోజులైనా తెలియకపోవడం దారుణమని ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి కొండన్న ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి నంద్యాల మండలం హెచ్.కొట్టాల, కానాల, ఎం.చింతకుంట, తదితర గ్రామాల్లో పర్యటించి వాల్మీకి యువతతో సమావేశమయ్యారు. ముచ్చుమర్రి బాలిక హత్యాచారానికి గురైందని తెలిసి 63 రోజులైనా ఎటువంటి ఆనవాళ్లూ దొరకలేదని, ఈ ఘటనను అధికారులు పూర్తిగా వదిలేశారని వాపోయారు.
సీఎం సహాయ నిధికి తన 3 నెలల వేతనం రూ.5 లక్షలు, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు టీడీపీ నాయకులు ఇచ్చిన మరో రూ.5 లక్షల విరాళంతో కలిపి మొత్తం రూ.10 లక్షలు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సీఎం చంద్రబాబుకు అందజేశారు. అనంతరం విజయవాడలో వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తనకు కేటాయించిన వార్డులో పర్యటించి, వారి కష్టాలు తెలుసుకున్నారు.
వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి టీజీ భరత్ అన్నారు. అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ వరద బాధితులను ఆదుకునేందుకు రూ.25 లక్షలు అందించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులు భరత్ను కలిసి చెక్కును అందించారు. మంత్రి మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని చెప్పారు.
అసభ్య పదజాలంతో దూషించిన మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ లీగల్ సెల్ ఆలూరు నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ కుమార్, టీడీపీ నాయకుడు వెంకటేశ్ చౌదరి మంగళవారం ఆలూరు సీఐ శ్రీనివాస్ నాయక్కు ఫిర్యాదు చేశారు. విజయవాడ వరద బాధితులకు మంచి చేస్తున్న సీఎంపై లోఫర్ అంటూ అసభ్య పదజాలంతో దూషించడం మాధ్యమాల్లో చూశామన్నారు. నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ది శాఖ అమలు చేస్తున్న పథకాలు జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పనుల పురోగతిపై ఎంపీ శబరికి నివేదిక రూపంలో అందజేసి కేంద్రం ద్వారా పెండింగ్ నిధులు రాబట్టేందుకు సహకరించాలన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలోలో ఈ నెల 15న వినాయక నిమజ్జనం, 16న మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకుని శాంతియుత సమావేశం మంగళవారం నిర్వహించారు. కర్నూలులోని వివిధ వర్గాలకు చెందిన సామాజిక మత పెద్దలు, జిల్లాస్థాయి అధికారులతో ఎస్పీ మాట్లాడారు. జిల్లా మతసామరస్యంలో ఆదర్శంగా, స్పూర్తిగా ఉండాలన్నారు. వినాయక నిమజ్జన ఉత్సవం ప్రశాంతంగా జరుగుతుందన్నారు. కుల, మతాలకు అతీతంగా కలిసి మెలిసి పండుగలు జరుపుకోవాలన్నారు.
కర్నూలు జిల్లా టీడీపీ తరఫున వరద బాధితులకు రూ.1.50 కోట్ల విలువ చేసే నిత్యవసరాల సరుకులను విరాళంగా ఇచ్చారు. ఇవి దాదాపు 10 వేల కిట్లు ఉంటాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఈ నిత్యావసరాల సరుకులను తీసుకెళ్తున్న వాహనాలను కలెక్టర్ రంజిత్ బాషా జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు.
అవసరాల్లో ఉన్న పేదలకు బ్యాంకర్లు రుణాల మంజూరు చేసి అండగా నిలవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లకు సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (DCC) సమావేశం మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పశుసంవర్థక శాఖకు సంబంధించి గోకులం పథకం కింద లబ్దిదారుల గుర్తింపు పూర్తి చేసి త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని అన్నారు.
కొందరు అధికారులు గత ప్రభుత్వ మైకంలోనే ఉన్నారని, వాటి నుంచి బయటపడాలని, గతం ఒక లెక్కా, ఇప్పటి నుంచి మరో లెక్క అని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులందరం కలిసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది.
Sorry, no posts matched your criteria.