Kurnool

News April 8, 2024

రైలు కిందపడి యువతీ, యువకుడి ఆత్మహత్య

image

యువ‌తీ(20), యువ‌కుడు(25) రైలు కిందప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మంత్రాల‌యం- ముచ్చుమర్రి (536/11-13) మ‌ధ్య టీబీ బ్రిడ్జి వ‌ద్ద సోమ‌వారం చోటుచేసుకుంది. ఈ మేరకు రైల్వే ఎస్ఐ గోపాల్ తెలిపారు. మృతదేహాలు వ‌ద్ద సైకిల్ తాళాలు త‌ప్ప ఎలాంటి ఆధారాలు ల‌భ్యం కాలేద‌న్నారు. త‌ల‌లు ప‌గిలి గుర్తుప‌ట్ట‌లేనంతగా ఉన్నాయ‌న్నారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు.

News April 8, 2024

కర్నూలు: వ్యయ పర్యవేక్షణపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన వ్యయ పర్యవేక్షణపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.సృజన సమీక్ష నిర్వహించరు. ఆమె మాట్లాడుతూ.. బ్యాంకుల్లో పెద్దమెుత్తంలో డబ్బులు విత్ డ్రా, డిపాజిట్ చేసేవారిపై డేగకన్ను ఉంచాలన్నారు. అనుమానిత ఖాతాలో నగదు లావాదేవీలు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని అధికారులకు తెలిపారు.

News April 8, 2024

ఆస్పరి మండలంలో 200 మంది వాలంటీర్ల రాజీనామా

image

ఆస్పరి మండలంలోని అన్ని గ్రామాల వాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. మండలంలో మొత్తం 302 మంది వాలంటీర్లు ఉండగా.. 200 మంది తమ రాజీనామాల పత్రాలను ఎంపీడీవోకు అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ సేవలు అందిస్తుంటే.. పత్రిపక్ష పార్టీలకు చెందిన నేతలు తమను అవమానపరచడం సరికాదని అన్నారు. రాజీనామా అనంతరం జగన్మోహన్ రెడ్డి విజయం కోసం ఎన్నికల ప్రచారం చేస్తామని అన్నారు.

News April 8, 2024

కర్నూలు: ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన 35 మందిపై వేటు

image

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన హెచ్చరించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మార్చి 16 నుంచి ఇప్పటి వరకు 35మంది సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. కోడ్ ఉల్లంఘించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

News April 8, 2024

శ్రీశైలం: కృష్ణా నదిలో నీట మునిగి వ్యక్తి మృతి

image

శ్రీశైలం డ్యాం దిగువన గల లింగాలగట్టు హై లెవెల్ పుష్కర ఘాట్ వద్ద సోమవారం ఉదయం ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడని మత్స్యకారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ముగ్గురు మల్లన్న దర్శనార్థమై వచ్చి రద్దీ అధికంగా ఉండటంతో ఆలోగా కృష్ణానదిలో స్నానమాచరించేందుకు లింగాలగట్టుకు చేరుకున్నారు. ముగ్గురు నదిలో దిగి స్నానమాచరిస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి నీట మునిగాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2024

శ్రీశైలంలో నేడు ప్రభోత్సవం కార్యక్రమం

image

ఉగాది ఉత్సవాల్లో భాగంగా శ్రీశైలం క్షేత్రంలో నేటి సాయంత్రం ప్రభోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. ఉత్సవం అనంతరం నంది వాహన సేవ ఉంటుందన్నారు. శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారికి మహా సరస్వతి అలంకారం ఉంటుందని చెప్పారు. స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం, కళ్యాణోత్సవం, ఏకాంతసేవ పూజలు వైభవంగా జరుగుతాయన్నారు. రుద్రహోమం, చండీ హోమం పూజలు ఉంటాయని వివరించారు.

News April 8, 2024

నంద్యాలలో యువకుడి దారుణ హత్య

image

నంద్యాల పట్టణంలోని దేవనగర్ మసీదు సెంటర్‌లో సమీర్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. హత్యకు పాల్పడిన వారు అతి కిరాతకంగా సమీర్ గొంతు కోసి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2024

శ్రీశైలంలో నేడు వీరాచార విన్యాసాలు..

image

ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో 3 రోజు సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం నిర్వహిస్తారు. అలాగే స్వామి అమ్మవార్లకు నంది వాహనసేవ, శ్రీభ్రమరాంబా దేవికి మహా సరస్వతి అలంకార సేవ నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు వీరశైవుల వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. శివ దీక్షా శిబిరాల వద్ద నిర్వహించే వీరచార విన్యాస కార్యక్రమానికి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

News April 8, 2024

కర్నూలు: 24 ఓట్ల తేడాతో గెలిచారు

image

ఆదోని నియోజవర్గంలో 1952 నుంచి 2019 వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. 1955లో జి.భూషన్న అనే పీఎస్పీ అభ్యర్థి ఎస్.ఎమ్. నిజాని(పీపీ) అభ్యర్థిపై 24 ఓట్ల అత్యల్ప మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2009లో టీడీపీ అభ్యర్థి కె.మీనాక్షినాయుడు కాంగ్రెస్ అభ్యర్థి వై.సాయిప్రసాద్ రెడ్డిపై 256 ఓట్ల తేడాతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

News April 8, 2024

నంద్యాల: ప్రభుత్వ టీచర్ మృతి

image

దైవదర్శనానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. కోవెలకుంట్లకు చెందిన రాణిబాయి(22) మండలంలోని భీమునిపాడు స్పెషల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. అహోబిలేశుడిని దర్శించుకుని తమ్ముడు శ్రీధర్ నాయక్‌ బైక్‌లో వస్తున్నారు. ఈక్రమంలో చీర కొంగు బైక్‌ చక్రానికి చుట్టుకోవడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ నగీన తెలిపారు.