Kurnool

News April 5, 2024

కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి నంది అవార్డులు

image

తెలంగాణలోని మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ వరకు జరిగిన నంది అవార్డులలో కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి నంది అవార్డులు వరించాయి. ఉత్తమనటుడుగా శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ నటిగా సురభి ప్రభావతి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ మేకప్ మాన్ విభాగాలలో నంది అవార్డులు లభించాయని కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు.

News April 4, 2024

కర్నూలులో రోజు విడిచి రోజు తాగునీరు.. ప్రణాళిక సిద్ధం

image

తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కర్నూలు నగర ప్రజలకు ఏప్రిల్ రెండవ వారం నుంచి రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని నగరపాలక కమిషనర్ భార్గవ్ తేజ చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వర్షభావ పరిస్థితుల వల్ల సుంకేసుల రిజర్వాయర్లో నీరు అడుగంటిపోయిందన్నారు. ప్రస్తుతం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజులదిన్నె నుంచి కేసీ కెనాల్ ద్వారా నీరు తీసుకొస్తున్నామని ఆయన వివరించారు. 

News April 4, 2024

ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్

image

ఎన్నికల నిర్వహణకు అవసరమైన తగు చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీ ప్రతినిధులకు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఫారం-6, 8లను 16 వరకు స్వీకరించి వాటిని 25వ తేదీ వరకు క్లియర్ చేస్తామన్నారు.

News April 4, 2024

మహానందీశ్వర స్వామి దర్శన వేళల్లో మార్పులు

image

కర్ణాటక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహానందీశ్వర స్వామి దర్శన వేళల్లో మార్పులు చేపట్టినట్లు ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి 11వ తేదీ వరకు వేకువజామున 3 గంటలకే ఆలయ తలుపులు తెరిచి స్థానిక అభిషేక, అర్చన పూజల అనంతరం అష్టవిధ మహా మంగళహారతులు పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం వేకువజామున 4 గంటల నుంచి 6: 30 గంటల వరకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

News April 4, 2024

మద్దికేర రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతి

image

మద్దికేర గ్రామ శివారులో ఇటీవల బొలెరో టైరు పగిలి విద్యుత్ స్తంభానికి ఢీకొని బోల్తాపడిన ఘటన తెలిసిందే. అందులో ప్రయాణిస్తున్న మద్దికేర గ్రామానికి చెందిన కూలీలు ఆదిలక్ష్మి (50), సంజమ్మ (40) అదే రోజు మరణించారు. కురువ లక్ష్మీదేవి (35) సావిత్రమ్మ(65) చికిత్స పొందుతూ బుధవార రాత్రి మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

News April 4, 2024

శ్రీశైలంలో ఉగాది మహోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు ఇవే

image

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. 6న భృంగివాహన సేవ, అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం, 7న కైలాస వాహన సేవ మహాదుర్గ అలంకారం, 8న నంది వాహన సేవ, మహాసరస్వతి అలంకారం, 9న రథోత్సవం, అమ్మవారికి రాజరాజేశ్వరి అలంకారం కార్యక్రమాలు ఉంటాయన్నారు. వీటితో పాటు 8వ తేదీన ప్రభోత్సవం, 9న పంచాంగ శ్రవణం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News April 4, 2024

నంద్యాల: తనిఖీలలో రూ.91 లక్షల నగదు స్వాధీనం

image

బనగానపల్లె మండలం పసుపుల గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున వాహనాల తనిఖీలో రూ. 91 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు సీఐ, పోలీసులు తనిఖీ చేయగా లారీలో ఒక బాక్సులో రూ. 91 లక్షలు నగదు గుర్తించారు. డ్రైవర్ సయ్యద్ మహబూబ్ బాషా బెంగళూరు నుంచి లారీని తీసుకొస్తుండగా సరైన పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 4, 2024

కర్నూలు: 24 నుంచి వేసవి సెలవులు

image

కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాశాఖాధికారి శ్యాముల్ తెలిపారు. సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని చెప్పారు.

News April 4, 2024

కర్నూలు: కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

అనంత(D) గుంతకల్లు కస్తూర్బా పాఠశాలలో ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి తండ్రి వివరాలు.. మద్దికెర మండలానికి చెందిన బాలిక 8వతరగతి చదువుతుంది. తోటి విద్యార్థులు తమ స్నాక్స్ చోరీ చేసిందని టీచర్‌కు ఫిర్యాదుచేయడంతో దండించింది. మళ్లీ వారు పీటీకి ఫిర్యాదుచేయగా గ్రౌండ్‌లో రెండు రౌండ్లు వేయాలని శిక్షించింది. మనస్తాపం చెందిన బాలిక చున్నితో ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది.

News April 4, 2024

నంద్యాల: చెక్‌పోస్ట్ హెల్పర్‌పై చిరుతపులి దాడి

image

టోల్‌గేట్ వద్ద చెక్‌పోస్ట్ హెల్పర్‌పై చిరుతపులి దాడిచేసిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. మహానంది-శిరివెళ్ల సరిహాద్దు పచ్చర్ల టోల్‌గేట్ వద్ద దస్తగిరి చెక్‌పోస్ట్ హెల్పర్‌గా విధులు నిర్వహిస్తుండగా చిరుతపులి అకస్మాత్తుగా అతడిపై దాడి చేసింది. అక్కడున్న తోటి అటవీ సిబ్బంది స్థానికుల సాయంతో ఆటోలో గాజులపల్లి సమీపంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.