Kurnool

News April 3, 2024

నేటి నుంచి 6వ తేదీ వరకు సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ: నంద్యాల కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో నేటి నుంచి 6వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ జరుగుతుందని మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమైన వారు, నడవలేక వీల్ చైర్స్‌లో ఉన్నవారు, వృద్ధ మహిళలకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తారన్నారు.

News April 2, 2024

BIG BREAKING: కాటసాని చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరిక

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇటు పాణ్యం అటు బనగానపల్లె నియోజకవర్గాల్లో కాటసాని బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

News April 2, 2024

ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలి : జిల్లా కలెక్టర్

image

సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం పింఛన్ల పంపిణీపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ నెల 4,5 తేదీల్లోపు పెన్షన్లు పంపిణీ పూర్తి కావాలని ఆదేశించారు.

News April 2, 2024

కర్నూలు: కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీరే..

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురు MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఎస్సీ సామాజికవర్గాలైన కోడుమూరు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణ, నందికొట్కూర్ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే తోగూర్ అర్థర్‌ను ప్రకటించింది. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా గోకుల్ కృష్ణారెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పీజీ రాంపుల్లయ్య పోటీ చేయనున్నారు.

News April 2, 2024

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు. పత్తికొండలో మంగళవారం ఓటర్లకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఆర్డిఓ రామలక్ష్మి, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

News April 2, 2024

కర్నూలు: రెండు ప్యాసింజర్ రైళ్లు రద్దు

image

గుంతకల్లు నుంచి కాచిగూడకు వెళ్లే ప్యాసింజర్ రైలు(07671) సోమవారం నుంచి రద్దైనట్లు డోన్ రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు రద్దు చేసినట్లు చెప్పారు. కాచిగూడ నుంచి గుంతకల్లుకు వెళ్లే ప్యాసింజర్ రైలు (07670) మంగళవారం నుంచి మే ఒకటో తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ డివిజన్‌లోని మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల్లో రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతుండటంతో రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News April 2, 2024

అన్నను హత్య చేసిన దుర్మార్గుడివి నువ్వు: BC జనార్దన్ రెడ్డి

image

బనగానపల్లె ఎమ్మెల్యే కొడుకు ఓబుల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘ఒరే ఓబుల్ రెడ్డి లఫూట్. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మీ అన్న నాగార్జున రెడ్డిని రాత్రికి రాత్రి గొంతు నులిమి ఫ్యానుకు వేలాడిదీసినావ్. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన చరిత్ర నీది. నువ్వా మాట్లాడేది మా అన్న గురించి, మా కుటుంబం గురించి. ఆస్తి కోసం హత్య చేసిన దుర్మార్గుడిని నువ్వు’ అని ఆరోపించారు.

News April 2, 2024

పది’ మూల్యాంకనం ప్రారంభం: డీఈఓ

image

పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభమైనట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి శ్యాముల్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 180 లక్షల జవాబు పత్రాలు వచ్చాయన్నారు. ఆరోగ్య సమస్యలున్న ఉపాధ్యాయులకు మూల్యాంకన ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు.

News April 2, 2024

విధుల నుంచి 30 మంది తొలగింపు: కలెక్టర్

image

కర్నూలు: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 31 మందిపై చర్యలు తీసుకున్నామని, అందులో 30 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియమావళి ఉల్లంఘించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 2, 2024

కర్నూలు: విద్యుత్ నియంత్రికలతో ఇబ్బందులు

image

కర్నూలులో సుమారు 1,900 విద్యుత్ నియంత్రికలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నియంత్రికలు తక్కువ ఎత్తులో ఉండటం, ఫ్యూజులకు రక్షణ కవచం లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సీతారాంనగర్ మార్కెట్ యార్డు సమీపంలోని ప్రధాన రహదారి అనుకుని విద్యుత్ నియంత్రిక ఉంది. దీనిచుట్టూ కంచె ఏర్పాటు చేయలేదు. నిత్యం వేలాది మంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.