Kurnool

News April 2, 2024

కాంగ్రెస్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య యాదవ్

image

రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే 17 మంది అభ్యర్థుల జాబితాను పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ప్రకటించారు. కర్నూలు పార్లమెంట్ స్థానానికి రాంపుల్లయ్య యాదవును ఎంపిక చేశారు. దీంతో యాదవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కంది వరుణ్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మల్లిఖార్జున యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

News April 2, 2024

పోలీసు శాఖలో పదవీ విరమణ పొందడం అభినందనీయం: ఎస్పీ

image

సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ అన్నారు.
సోమవారం పదవీ విరమణ పొందిన కర్నూలు ట్రాఫిక్ ఎస్సై టీఎస్ఎస్.ప్రసాద్ కుమార్‌ను ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్పీ తెలిపారు.

News April 1, 2024

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం: ఎస్పీ

image

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు.

News April 1, 2024

అనుమానాస్పద లావాదేవీలపై తనిఖీలు నిర్వహిస్తాం: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత రశీదు, ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వ్యాపార సంఘాలు, ట్రేడ్ యూనియన్లతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓలు పాల్గొన్నారు.

News April 1, 2024

రేపు పత్తికొండలో కలెక్టర్, ఎస్పీ పర్యటన

image

పత్తికొండలో రేపు (మంగళవారం) కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ పర్యటన ఉంటుందని పత్తికొండ ఆర్డీఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి సోమవారం తెలిపారు. ఉదయం 10:30 గంటలకు పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎస్పీ పాల్గొంటారని వెల్లడించారు.

News April 1, 2024

కర్నూలు: విద్యార్థిపై అన్నం వండిన గంజి పడి ఆస్పత్రి పాలు

image

హోళగుంద: గంజహళ్లిలో అంగన్వాడీ విద్యార్థి మల్లప్పపై అన్నం గంజి పడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. అంగన్వాడీ సెంటర్-2లో మల్లప్ప యూరిన్ పోసి వస్తుండగా.. ఆ సమయంలో ఆయా లక్ష్మి అన్నం గంజిని విసిరినట్లు తెలిసింది. చూసుకోకుండా విసిరినట్లు అంగన్వాడీ ఆయా తెలుపగా.. తల్లిదండ్రులు మాత్రం నిర్లక్ష్యం కారణంగానే తన బిడ్డపై గంజి పోసిందంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 1, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. పలువురికి గాయాలు

image

డోన్ మండలం గోసానిపల్లె సమీపంలో కరివేపాకు తోట మలుపు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొనడంతో ప్యాపిలి మండలం కోటకొండకు చెందిన వెంకటేశ్వరరావు అనే వికలాంగుడు అక్కడికక్కడే మృతిచెందారు. అతని కుమారుడికి, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108లో ఆసుపత్రికి తరలించారు.

News April 1, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో TDP, BJP సత్తా చాటగలవా?

image

గెలుపే లక్ష్యంగా అనేక సర్వేల అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 2 MP, 13 అసెంబ్లీ స్థానాలకు TDP, ఒక (ఆదోని) స్థానానికి BJP అధినేతలు అభ్యర్థులను ప్రకటించారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో YCP క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సర్వేల రిపోర్టును బట్టి YCP బలాలు, బలహీనతల దృష్ట్యా పలుచోట్ల అభ్యర్థులను మార్చారు. చంద్రబాబు నిర్ణయాలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.

News April 1, 2024

నందికొట్కూరు: టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత 

image

నందికొట్కూరు మండలం అల్లూరులో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఐపీఎస్, టీడీపీ నేత ఇన్ఛార్జ్ శివానందరెడ్డి ఇంటికి 2012లో నమోదయిన ఓ కేసు విచారణ నిమిత్తం తెలంగాణ పోలీసులు చేరకున్నారు. అయితే తనకు నోటీసు ఇచ్చి విచారించాలంటూ శివానందరెడ్డి పోలీసులను కోరారు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు తయారు చేసేలోపే ఆయన తన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

News April 1, 2024

కర్నూలు: 44 మందికి షోకాజ్ నోటీసులు

image

కర్నూలు జిల్లా పీవో, ఏపీవో శిక్షణ తరగతులకు పలువురు గైర్హాజరు కావడంపై కలెక్టర్ సృజన సీరియస్ అయ్యారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పత్తికొండ నియోజకవర్గంలో 16 మంది, ఎమ్మిగనూరులో 12 మంది, ఆలూరులో తొమ్మిది మంది, మంత్రాలయంలో ఏడుగురు.. మొత్తంగా 44 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.