India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు శుక్రవారం పోలీస్ శాఖలో పనిచేస్తూ వివిధ కారణాల ద్వారా మరణించిన పోలీస్ వారి కుటుంబ సభ్యులతో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సమావేశం నిర్వహించారు. అనంతరం కుటుంబాల సభ్యుల వివరాలు అడిగి తెలుసుకుని వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీ సంక్షేమానికి అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
కోసిగి రైల్వేస్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి శుక్రవారం దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై పడటంతో కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో బీఏ హానర్స్ స్పెషల్ ఉర్దూ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వీ.లోకనాథ శుక్రవారం తెలిపారు. బీఏ హానర్స్ స్పెషల్ ఉర్దూలో ఇంటర్మీడియట్, మదరస బోర్డు ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఈ కోర్సు అర్హత వివరాలు ఉర్దూ యూనివర్సిటీ వెబ్ సైట్లో పొందుపర్చినట్లు ఆయన తెలిపారు.
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో ఇవాళ మాజీ CM, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. తుపాకీకి ఎదురుగా వెళ్లి తన గుండెను చూపించిన ధీరుడు ఆంధ్రకేసరి అని ఎస్పీ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఏఎస్పీ, పోలీస్ అధికారులు స్మరించుకున్నారు.
ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందజేయాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు మండలం గార్గేయపురంలోని పీహెచ్సీ, జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోగుల పట్ల వైద్యులు మర్యాదగా నడుచుకోవాలని సూచించారు.
ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నూజివీడు మండలం బోర్వంచ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన మసీదును మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని అన్నారు. మైనార్టీ విద్యార్థులు చదువుకోవడానికి మదరసాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
బనగానపల్లె నుంచి అక్రమంగా మహారాష్ట్రకు డోలమైట్ ఖనిజాన్ని తరలిస్తున్న టిప్పర్లను ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ వెల్లడించారు. టిప్పర్లలో గ్రావెల్, చిప్స్, డోలమైట్ ఖనిజాలను అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు విస్తృత దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 3 టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకున్నామనన్నారు.
రాష్ట్రంలో బయో సింథటిక్ వుడ్, హైడ్రో ఫాయిల్ బోట్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు స్పెయిన్ ఆధారిత ఆరియా గ్లోబల్ సంస్థ ఆసక్తి చూపుతోంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు సమావేశమై తమ ప్రతిపాదనలను వివరించారు. రూ.300 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి తెలిపారు.
ఉపాధి కల్పన స్కీం ఫ్రాడ్పై నంద్యాల పోలీసులు ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ‘మిమ్మల్ని ఈ విధంగా ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని సంప్రదిస్తే వారిని నమ్మకండి. ఎవరైనా అలా చెబితే, మొదట మీరు ఆ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారో, లేదో చెక్ చేసుకోండి. ప్రజలు ఎవరైనా ఈ విధంగా నష్టపోయి ఉంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్ను కానీ, సైబర్ క్రైమ్ వారిని కానీ ఆశ్రయించండి’ అని పోలీసులు పేర్కొన్నారు.
రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సర్వీసులు అందిస్తే గ్రీవెన్స్ తగ్గుతాయని, రెవెన్యూ అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రికార్డుల నిర్వహణ తీరును బట్టి అధికారుల పనితీరు అంచనా వేయవచ్చని అన్నారు.
Sorry, no posts matched your criteria.