Kurnool

News August 22, 2024

జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహించండి: డీఈఓ

image

జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గురువారం డీఈఓ కార్యాలయంలో జాతీయ అంతరిక్ష దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేజీబీవీ జీసీడీఓ స్నేహలత, అసిస్టెంట్ డైరెక్టర్ శామ్యూల్ పాల్, జిల్లా సైన్స్ అధికారిణి రంగమ్మ పాల్గొన్నారు.

News August 22, 2024

నంద్యాల: ఉల్లిగడ్డల లారీ బోల్తా

image

పాణ్యం మండలంలోని తమ్మరాజు పల్లె గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉల్లిగడ్డల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ఉల్లిగడ్డల బస్తాలన్నీ చెల్లాచెదురయ్యాయి. లారీ డ్రైవర్‌కు గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 22, 2024

సెప్టెంబర్ 11 నుండి కొత్త ఇసుక పాలసీ: కలెక్టర్

image

సెప్టెంబర్ 11 నుండి కొత్త ఇసుక పాలసీని ప్రభుత్వం అమలు చేయబోతుందని కలెక్టర్ రంజిత్ బాషా ప్రకటించారు. ప్రజలు నేరుగా ఇసుక తీసుకోవచ్చు కానీ అక్కడి నుంచి రవాణా కోసం వాహనాలకు ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తామని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 484 గ్రామపంచాయతీలో 4 అంశాలతో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.

News August 22, 2024

నందికొట్కూరులో యువకుడి మృతి

image

నందికొట్కూరులోని పగిడ్యాల రోడ్డు సమీపంలో ఉన్న పాత సామాను షాపులో విద్యుత్ షాక్‌కు గురై మహబూబ్ బాషా(35) గురువారం మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 22, 2024

ఓర్వకల్లులో భారీ అగ్ని ప్రమాదం.. సంస్థ ప్రకటన

image

కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని జై రాజ్ స్టీల్ ప్లాంట్‌లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఎవరికీ గాయాలు కూడా అవ్వలేదని పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాల ప్యానల్స్ మాత్రమే కాలిపోయాయని సంస్థ ప్రతినిధి శ్రీనివాస కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.

News August 22, 2024

హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారూ: భూమా అఖిలప్రియ

image

మెగాస్టార్ చిరంజీవికి ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బర్త్ డే విసెష్ చెప్పారు. ‘దేవుడు మీకు మరింత శక్తి, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. దీనికి గతంలో భూమా, శోభా నాగిరెడ్డితో చిరంజీవి దిగిన ఫొటోతో పాటు ఆమె వివాహ వేడుకలకు చిరు హాజరైన పలు చిత్రాలను జత చేశారు.

News August 22, 2024

కర్నూల్ జిల్లాకు రూ.59.60 కోట్లు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామ పంచాయతీలకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం 2వ విడత నిధులు రూ.59.60 కోట్లు విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజునాయుడు తెలిపారు. నంద్యాల జిల్లాలోని 488 పంచాయతీలకు రూ.28.05 కోట్లు మంజూరు కాగా, కర్నూలు జిల్లాలోని 482 పంచాయతీలకు రూ.31.56 కోట్లు వచ్చాయని వివరించారు.

News August 22, 2024

ఆస్తి కోసమే భర్తను చంపేసింది: డీఎస్పీ సోమన్న

image

ఆదోని మండలం పెద్దహరివాణానికి చెందిన శేఖన్న (50) హత్యకు గురైన విషయం విదితమే. ఈ ఘటనలో మృతుడి భార్యే నిందితురాలని డీఎస్పీ డి.సోమన్న తెలిపారు. మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య జయమ్మ గొంతు కోసి హత్య చేసిందని వివరించారు. రెండెకరాల భూమిని తనకు రాసివ్వాలని ఆమె కోరగా అందుకు భర్త నిరాకరించారు. ఈ క్రమంలో గొడవ పడ్డారు. భర్తను చంపితే ఆస్తిలో సగం వస్తుందని భావించిన ఆమె కొడవలితో గొంతు కోసి హత్య చేసిందని తెలిపారు.

News August 22, 2024

కేఎంసీ ఉద్యోగులు ఆధార్‌‌కు పాన్‌ లింక్ చేయించుకోవాలి: కమిషనర్

image

నగరపాలక సంస్థ ఉద్యోగులు తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకుని వారు వెంటనే చేసుకోవాలని కమిషనర్ రామలింగేశ్వర్ సూచించారు. లింక్ చేసుకోక ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిమానాలు విధించబడిన ఉద్యోగులు, సిబ్బందితో బుధవారం నగరపాలక కౌన్సిల్ హాలులో సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. లింక్ చేయకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 186 మంది ఉద్యోగులకు జరిమానా విధించిందని అన్నారు.

News August 21, 2024

క్యాన్సర్ ఆసుపత్రిని అందుబాటులో కి తీసుకొస్తాం: ఎంపీ

image

సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలులో మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో సాగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో క్యాన్సర్ ఆసుపత్రి పూర్తి కాలేదని, దాదాపు 20శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.