Kurnool

News March 29, 2024

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో కర్నూలు కలెక్టర్ సమీక్ష

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో సమీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్నికల అంశాలపై ఆర్వో లు, మునిసిపల్ కమిషనర్‌లు, తహశీల్దార్లు, ఎంపిడిఓలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదు చేసిన ప్రజల ఐడెంటిటీ రహస్యంగా ఉంచాలని ఆదేశించారు.

News March 28, 2024

కర్నూలు: పల్లె లక్ష్మన్న శవం ఆచూకీ లభ్యం

image

దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామానికి చెందిన లక్ష్మన్న మృతదేహాం ఇవాళ లభ్యమైంది. అనంతపురం జిల్లా పామిడి బైపాస్ రోడ్‌లో బ్రిడ్జి కింద ముళ్లపొదలలో అతడి తల, మొండెం వేరుగా పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ శ్రీనివాసులు తెలిపారు. అనుమానితులుగా మృతుడి భార్య, కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 40 రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది.

News March 28, 2024

ఉచిత విద్యకు దరఖాస్తు గడువు పొడిగింపు: డీఈఓ

image

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆయా స్కూళ్లలో 25 శాతం కోటా కింద పేద విద్యార్థులు ప్రవేశం పొందచవ్చని తెలిపారు. విద్యార్థుల https://cse.ap.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. 

News March 28, 2024

కోవెలకుంట్ల: ఇద్దరు వాలంటీర్లు రాజీనామా

image

కోవెలకుంట్ల మండలంలో ఇద్దరు గ్రామ వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసినట్లు కోవెలకుంట్ల మండల ఎంపీడీవో సయ్యదున్నిసా ఓ ప్రకటనలో వెల్లడించారు. కోవెలకుంట్ల పట్టణం సచివాలయం-5కు చెందిన మీనా కుమారి, గుళ్లదుర్తి గ్రామానికి చెందిన పాణ్యం మహేష్ కుమార్ రాజీనామా లెటర్ అందించినట్లు తెలిపారు. కాగా సీఎం జగన్ కోసం పని చేయడానికి తమ పదవులు అడ్డుగా ఉన్నాయన్న కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు ప్రకటించారు.

News March 28, 2024

నేడు నంద్యాలకు CM జగన్

image

నంద్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ CM వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరిట చేపట్టిన బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో CM జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం రేపు ఎమ్మిగనూరులో నిర్వహించే ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో CM పాల్గొననున్నారు.

News March 28, 2024

కర్నూలు: BSNL ల్యాండ్ లైన్ సేవలు కాపర్ నుంచి ఫైబర్‌లోకి మార్పు

image

కర్నూలు: BSNL కాపర్ ద్వారా అందిస్తున్న ల్యాండ్ లైన్ వాయిస్, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా ఫైబర్‌లోకి మార్చే ప్రక్రియ కొనసాగుతుందని బీఎస్‌ఎన్‌ఎల్ కర్నూల్ బిజినెస్ ఏరియా జనరల్ మేనేజర్ జి.రమేష్ తెలిపారు. ప్రకాష్ నగర్‌లోని బీఎస్ఎన్ఎల్ భవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఫైబర్‌లోకి మారితే కేవలం రూ.199కే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 1 జీబీ డేటాను 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో పొందవచ్చని తెలిపారు.

News March 28, 2024

కర్నూలు: ‘క్షేత్ర స్థాయిలో కోడ్ ఉల్లంఘనల నివేదికలపై కలెక్టర్ అసంతృప్తి’

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. బుధవారం ఎన్నికల అంశాలపై ఆర్వోలు, మునిసిపల్ కమిషనర్‌లు, తహశీల్దార్లు, ఎంపిడిఓలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన నివేదికలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

News March 28, 2024

నంద్యాల:  ట్రాఫిక్ అంతరాయం కలగకుండా డైవర్షన్ పాయింట్లు

image

సీఎం జగన్ గురువారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వెంకటేశ్వరపురం నుంచి వచ్చే వాహనాలు టౌన్‌లోకి అనుమతించకుండా  హైవే మీదుగా డైవర్షన్ చేయాలన్నారు. చామకాలువ నుంచి ఫ్లైఓవర్ మీదుగా బొమ్మల సత్రం, క్రాంతి నగర్‌లకు వెళ్లే వాహనాలను రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా మళ్లించారు. ఈ విషయాలను గమనించాలని కోరారు.

News March 27, 2024

నంద్యాల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

బనగానపల్లె మండలంలోని కైప అప్పలాపురం గ్రామాల మధ్య ఆటో బోల్తాపడి ఒక వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన బుధవారం జరిగింది. టంగుటూరు గ్రామానికి చెందిన బాల చౌడయ్య(60) ఆటోలో స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. దీంతో బాల చౌడయ్య మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2024

ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది: టీడీపీ ఎంపీ అభ్యర్థి

image

ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు అన్నారు. బుధవారం కర్నూలు టీడీపీ కర్నూలు పార్లమెంట్ కార్యలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు  తమపై నమ్మకం ఉంచి కర్నూలు ఎంపీ సీటు ఇచ్చినందుకు రుణపడి ఉంటాను అన్నారు. ప్రజల మద్దతుతో ఎంపీగా గెలిచి చంద్రబాబుకు కనుక ఇస్తానన్నారు.