India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా లోన్ మేళాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో స్పెషల్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఐఈపీసీ) సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి మేళాలు ఏర్పాటు చేసినట్లే లోన్ మేళాను నిర్వహించాలన్నారు.
కర్నూల్ జిల్లాలో నేడూ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. ఇవాళ అర్ధరాత్రి మరోసారి కుండపోత వర్షానికి ఛాన్స్ ఉందని ట్వీట్ చేశారు. కాగా నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పత్తికొండ-ఆదోని మధ్య కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. అమృతాపురంలో టోపీ మారెమ్మవ్వ ఆలయంలోకి వరద నీరు చేరింది. హంద్రీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
నంద్యాల జిల్లాలో పోలీసుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరుతోందని వైసీపీ విమర్శించింది. ‘నందికొట్కూరు సీఐ పోస్టింగ్ విషయంలో కోల్డ్ వార్ జరుగుతోంది. తాజాగా జూపాడుబంగ్లా ఎస్ఐ కేశవకి ఎంపీ బైరెడ్డి శబరి పోస్టింగ్ ఇప్పించారు. ఛార్జ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే కేశవను ఎమ్మెల్యే బదిలీ చేయించారు. ముచ్చుమర్రి ఎస్ఐగా మేము సూచించిన వ్యక్తినే నియమించాలని నేతల పట్టు’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలో విషాదం జరిగింది. పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో మట్టి మిద్దె కూలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిద్రిస్తున్న సమయంలో రాత్రి హఠాత్తుగా మట్టి మిద్దె కూలి హనుమన్న భార్య కుమ్మరి మద్దమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందారు. హనుమన్న, కొడుకు రామాంజనేయులుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సూచించారు. సోమవారం కర్నూలు IIIT DM విద్యార్దులకు జరిగిన మోటివేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేశారు. విద్యార్దులు ప్రతి ఒక్కరూ ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకుని, దానిని సాధించుకోవాలన్నారు.
తుంగభద్ర డ్యాం నుంచి నదికి నీటి విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 31,435 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం మొత్తం నీటి సామర్థ్యం 105.33 టీఎంసీలుకాగా ప్రస్తుతం 76.780 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తం అవుట్ఫ్లో 10,089 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. అర్ధరాత్రి పలు చోట్ల కుండపోత వర్షం పడింది. తెల్లవారుజామున పలు మండలాల్లలో మోస్తరు వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నందికొట్కూరులో ఏకధాటిగా రెండు గంటల పాటు వర్షం బీభత్సం సృష్టించింది.
టీడీపీ నేతలు నిజాలు తెలుసుకోకుండా వైసీపీపై అసత్య ప్రచారం చేయడం సరికాదని పత్తికొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హితవు పలికారు. సోమవారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పత్తికొండ నియోజకవర్గంలోని హోసూరుకు చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాసులును వారి సొంత పార్టీ నాయకులే హత్య చేశారని విమర్శించారు. వైసీపీ నాయకులపై నిందలు వేయడం సరికాదన్నారు.
నంద్యాల జిల్లాలో అక్టోబర్ 18వ తేదీ వరకు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరిగి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని తహశీల్దార్లను సూచించారు. ఓటర్ల జాబితాలో తప్పు ఒప్పుల సవరణలను ఏఈఆర్వోలు, ఈఆర్వోలు స్వయంగా పరిశీలించాలన్నారు.
నంద్యాలలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 150 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు అర్జీల రూపంలో విన్నవించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు ఉంటాయన్నారు.
Sorry, no posts matched your criteria.