India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమానికి 97 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ జీ.బిందు మాధవ్ తెలిపారు. సోమవారం కర్నూలులోని కొత్తపేట సమీపంలో ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. అర్జీదారులతో ఎస్పీ మాట్లాడుతూ.. తమ సమస్యలపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తానని అన్నారు.
మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేసి, మహిళలకు భద్రత కల్పించాలని ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కన్వీనర్ రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రాయలసీమ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్పై హత్యాచారం సమాజానికి సిగ్గుచేటని అన్నారు.
కర్నూలు జిల్లా పెద్దహరివాణం గ్రామంలో బీజేపీ నేత శేఖన్న హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆదోని డీఎస్పీ సోమన్న హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. శేఖన్నకు గ్రామంలో ఎలాంటి విభేదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన పార్టీ మారిన కొద్దిరోజులకే హత్యకు గురికావడం హాట్ టాపిక్గా మారింది.
ఎమ్మిగనూరు ఎన్నికల డీటీ రఘువీర్, హొళగుంద ఆర్ఐ రాజశేఖరన్ సస్పెన్షన్కు గురయ్యారు. రెవెన్యూ శాఖలో విధుల్లో నిర్లక్ష్యం, వివాదాల భూములను తొలగించడం తదితర కార్యకలాపాలకు పాల్పడటంతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కర్నూల్ జిల్లాలో పని చేస్తున్న ఉపాధ్యాయిని కల్యాణి కుమారిని మంత్రి నారా లోకేశ్ అభినందించారు. పత్తికొండ మండలం జేఎం తండా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఆమె విద్యార్థుల సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర పోషించారు. సుమారు 45 మంది విద్యార్థులను బడి బాట పట్టించారు. అలాగే వినూత్న రీతిలో పాఠాలు చెబుతున్న తీరును లోకేశ్ కొనియాడారు. కల్యాణిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
మోదీ విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఆదివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తున్నామన్నారు.
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మహానంది వ్యవసాయ కళాశాల ఏర్పడి నేటికి 31 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఈ కళాశాలను స్థాపించారు. ఎందరినో శాస్త్రవేత్తలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లను తయారు చేసిన ఘనత ఈ కాలేజీకి ఉందన్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు పలు దేశాలలో ఇక్కడి విద్యార్థులు ఉన్నత పదవుల్లో విధులు నిర్వహిస్తున్నారు.
మంత్రి నారా <<13881711>>లోకేశ్<<>> చొరవతో కర్నూలులో మురుగు సమస్యకు పరిష్కారం లభించింది. ‘కర్నూలు నగర శివారుకు 2 కి.మీ దూరంలో విస్తరించిన స్కంద లోటస్ లోనిది ఈ సమస్య. ఇక్కడ అనేక గృహాలు నిర్మిస్తుండగా మురుగు నీరు బయటికి వెళ్లేందుకు వీలులేదు. ప్రస్తుతం 1.70 కి.మీ మేర కచ్చ కాలువ నిర్మించి గల్ఫర్తో మురికి నీరు తొలగించాం. శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం’ అని KMC ట్వీట్ చేసింది.
వెలుగోడు మండలం మోత్కూరులో పసుపుల మల్లికార్జున హత్యకు గురయ్యారు. వరుసకు తమ్ముడైన పసుపుల శ్రీనివాసులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో మల్లికార్జున(40) తలపై రోకలి బండతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి బాల నాగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో త్వరలో భారీగా ASIలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల బదిలీలు జరగనున్నట్లు సమాచారం. తాజాగా కర్నూలు రేంజ్ పరిధిలో పెద్ద సంఖ్యలో CIలను బదిలీ చేస్తూ DIG ఉత్తర్వులు జారీ చేయగా, SIలను బదిలీ చేస్తూ కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్పీలు ఉత్తర్వులిచ్చారు. దీంతో త్వరలో ASIలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీలు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.