India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉగాది మహోత్సవాల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగించుకుంటామని ఈఓ పెద్దిరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సేవకులు మార్చి 29వ తేదీ నుంచి ఏప్రియల్ పదో తేదీ వరకు సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద సేవకులకు ప్రదేశాల కేటాయింపులో పారదర్శకత కోసం గత ఏడాది లాగే ఈ ఏడాది లాటరీ పద్దతిలో సేవా ప్రదేశాలను కేటాయిస్తామన్నారు.
జిల్లాలోని అన్ని చెక్ పోస్టులలో 3 షిఫ్టులలో పోలీసు అధికారులు, సిబ్బందితో నిఘా పెంచామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. విలువైన వస్తువులకు రశీదు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆధారాలు చూపితే పరిశీలించి నిబంధనల మేరకు పట్టుబడిన వాటిని అందిస్తామన్నారు. జిల్లాలోకి అక్రమంగా ఏమీ రాకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తామని చెప్పారు. నిరంతరం సిబ్బంది విధుల్లో ఉండి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు.
కర్నూలు MP స్థానానికి YCP, TDP నుంచి BC సామాజికవర్గ నేతలు పోటీ పడుతున్నారు. కురువ సామాజిక వర్గానికి చెందిన MPTC సభ్యుడు నాగరాజు TDP నుంచి, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కర్నూలు మేయర్ BY రామయ్య YCP నుంచి బరిలో దిగనున్నారు. ఇద్దరు సామాన్యులకు టికెట్లు కేటాయించి సామాజిక సమీకరణలో ఇరు పార్టీలు సమతుల్యం పాటించాయి. అయితే గెలిచి నిలిచేదెవరో కామెంట్ చేయండి.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ జ్యోతి అభ్యర్థుల వివరాలను సోమవారం వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో నంద్యాల నుంచి రమణ, నందికొట్కూరు నుంచి లాజర్, ఆళ్లగడ్డ నుంచి అన్నమ్మ, పాణ్యం నుంచి చిన్న మౌలాలి, డోన్ నుంచి రాముడు, ఆలూరు నుంచి రామలింగయ్య పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీకి 10 అసెంబ్లీ సీట్లకు మించి రావని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలోని తెదేపా కార్యాలయంలో సోమవారం నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేశారని, మన రాష్ట్రంలో అంతకంటే ఎన్నో రెట్ల మద్యం కుంభకోణం జరిగిందని అన్నారు.
ఆస్పరిలోని బొరుగుల బట్టి యజమాని ఇంటి ఆవరణలో చేతి గుర్తు ఉండే రక్తపు మరకలు, పక్కనే RCM చర్చి ఆవరణలోని వెనుక భాగంలో రక్తం మడుగులా ఉండటంతో CI హనుమంతప్ప సోమవారం పరిశీలించారు. ఆ రక్తపు మడుగును చీపురుతో కడిగే ప్రయత్నం చేశారని, అక్కడే సబ్బు ముక్కలు ఉన్నాయని తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో విచారణ చేపట్టామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. రక్తం మనిషిదా? జంతువుదా? తేలాల్సి ఉంది.
ఆదోని మండలం సంతేకుడ్లూరులో సోమవారం హోలీ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. రతీ, మన్మథుల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని యువకులు, పురుషులు మహిళల వేషధారణలో ముస్తాబై ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఐదు రోజులు సాగే సంబరాలకు గ్రామస్థులు ఎక్కడ ఉన్నా ఇక్కడికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చిన రతీ, మన్మథులను దర్శించుకున్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం క్షేత్రం సోమవారం భక్తజనంతో పోటెత్తింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేపట్టారు. సాధారణ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.
వడదెబ్బ తగిలి అయ్యన్న అనే రైతు మృతి చెందిన ఘటన కోసిగి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. కోసిగిలోని 2వ వార్డుకు చెందిన అయ్యన్న కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం పొలం పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి పొలంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులున్నారు.
పొత్తులో భాగంగా ఆదోని ఎమ్మెల్యే సీటు BJPకి కేటాయిస్తున్నారనే మీడియాలో ప్రచారం జరగడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మీనాక్షినాయుడు నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దయచేసి మీడియాలో వచ్చిన కథనాలను నమ్మొద్దని.. ఇంకా అధికారికంగా ప్రకటన కాలేదని తెలిపారు. ఆదోని ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి కేటాయించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.