Kurnool

News August 18, 2024

ప్రమాదకరంగా కుందర వాగు వంతెన

image

కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడు సమీపాన కోవెలకుంట్ల-ఆళ్లగడ్డ R&B రహదారిలో కుందర వాగుపై ఏర్పాటుచేసిన వంతెన ప్రమాదకరంగా ఉంది. 1932 బ్రిటిష్ కాలంలో ఈ వంతెన నిర్మించారు. 92 ఏళ్లు కావడంతో వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వంతెనకు ఇరువైపులా ఏర్పాటుచేసిన కడ్డీలు వంగిపోవడంతో పాటు దిమ్మెలు పూర్తిగా దెబ్బతిని కూలేందుకు సిద్ధంగా ఉంది.

News August 18, 2024

KNL: పరిష్కారం కాని సమస్య.. మంత్రి లోకేశ్ క్షమాపణ!

image

ఇంటి పరిసర ప్రాంతంలో మురికి నీరు ప్రవేశించడంపై PGRSలో కర్నూలు కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. కాగా అధికారులు కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేసి, సమస్యను పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు చూపారు. దీంతో బాధితుడు మంత్రి నారా లోకేశ్‌కు ఈ విషయాన్ని Xలో వివరించారు. స్పందించిన లోకేశ్ అతనికి క్షమాపణలు తెలిపారు. ‘నా బృందం సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తుంది’ అని హామీ ఇచ్చారు.

News August 18, 2024

20వ తేదీ నుంచి ఆధార్ క్యాంపులు: కలెక్టర్

image

కర్నూలు: ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు ఆధార్ క్యాంపులను సచివాలయాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ కార్డు కొత్తగా నమోదుతో పాటు అప్డేట్, బయోమెట్రిక్ చేసుకునేందుకు అవకాశం కల్పించామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News August 17, 2024

ఫ్రీ ఓల్డ్ భూములపై సమగ్ర నివేదిక: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలోని ఫ్రీ ఓల్డ్ భూములకు సంబంధించి సమగ్ర నివేదికను పంపాలని కలెక్టర్ రంజిత్ బాషా రెవిన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం రెవెన్యూ సదస్సులు, హౌసింగ్, ఉపాధి హామీలపై తహశీసీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజులు, ఏడాది, 5 ఏళ్లు లక్ష్యాలను ఏర్పరుచుకుని జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెవెన్యూ సదస్సులకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

News August 17, 2024

ఆదోనిలో ఘోర రోడ్డు ప్రమాదం

image

ఆదోనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోనిలోని రాజ్ నగర్ వద్ద బైక్‌పై వెళ్తున్న వెంకటేశ్‌(22) అనే ఫొటో గ్రాఫర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బైచిగేరికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. మృతుడు ఆదోనిలోని సంజన స్టూడియోలో పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 17, 2024

విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు: జిల్లా వైద్యాధికారి

image

ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి హెచ్చరించారు. శనివారం బండి ఆత్మకూరు మండలంలోని నారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రికార్డ్స్ వెరిఫై చేసి వాక్సినేషన్ పెర్ఫార్మన్స్, BCG, ANC, రికార్డులను ఇంప్రూవ్ చేసుకోవాలని డాక్టర్ కిరణ్ కుమార్‌కు సూచించారు.

News August 17, 2024

KNL: ఫెయిల్ అయిన విద్యార్థులకు SVU శుభవార్త

image

తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో డిగ్రీ 1990 నుంచి 2015 వరకు చదివిన విద్యార్థులు ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయినవారికి యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. ఆ విద్యార్థులు మరోసారి పరీక్షలు రాసి పాస్ అయ్యేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు SV యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ ఉత్తర్వులు జారీ చేశారు. Website: www.svuniversity.edu.in

News August 17, 2024

మంత్రాలయం: నదిలో దూకిన మహిళ

image

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఆనుకొని ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో ఆదోని మండలం అలసంద గుత్తి గ్రామానికి చెందిన తిక్క లక్ష్మి అనే మహిళ దూకింది. గమనించిన కానిస్టేబుల్ రంగస్వామి ఆమెను కాపాడి మెరుగైన వైద్యం కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఆమెను కాపాడటంతో నది దగ్గర ఉన్న భక్తులు అభినందించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News August 17, 2024

నంద్యాల: నేషనల్ పైవేపై ప్రమాదం..డ్రైవర్ మృతి

image

నంద్యాల జిల్లా డోన్ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మ్యాక్స్ ఫోర్ హోటల్ ఎదురుగా శనివారం తెల్లవారుజామున లారీ, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఘటనా స్థలంలోనే బస్సు డ్రైవర్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 17, 2024

కర్నూలు: నేడు 24 గంటలు వైద్య సేవలు బంద్

image

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్ కత్తా నగరం ఆర్జే కార్ హాస్పిటల్లో హత్యాచార ఘటనకు నిరసనగా జిల్లాలోని అన్ని హాస్పిటల్స్ 24 గంటల పాటు (శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు) సాధారణ వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కర్నూలు అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామచంద్ర నాయుడు, డాక్టర్ ఎస్వీ రామమోహన్ రెడ్డి తెలిపారు. కేవలం అత్యావసర కేసులు మాత్రమే చూస్తామన్నారు.