Kurnool

News March 24, 2024

నంద్యాల MP బరిలో వైఎస్ షర్మిల?

image

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నంద్యాల నుంచి MPగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ స్థానంలో బీసీ, మైనారిటీ ఓట్లు అత్యధికంగా ఉండడంతోపాటు అప్పటి కాంగ్రెస్ హాయంలో ఆమె తండ్రి దివంగత CM వైఎస్ రాజశేఖర రెడ్డికి భారీ మెజారిటీ అందించిన స్థానాల్లో నంద్యాల పార్లమెంట్ స్థానం ఒకటి. ఉమ్మడి జిల్లాలో అప్పటి కాంగ్రెస్ నేతలను ఆమె మళ్లీ పార్టీలోకి వచ్చేలా ప్రణాళికల సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

News March 24, 2024

కర్నూలుకు రానున్న TDP అధినేత

image

ఏపీలో ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో TDP అధినేత ఎన్నికల సమరానికి సై అంటున్నారు.ఇందులో భాగంగా ప్రజాగళం పేరుతో కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలంలో ఈనెల 29న చంద్రబాబు రోడ్ షోలో పాల్గొననున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

News March 24, 2024

కడప జిల్లాలలో నంద్యాల వాసి బలవన్మరణం

image

నంద్యాలకు చెందిన రాజశేఖర్ శర్మ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడప జిల్లాలో రెండు చేతులు బ్లేడుతో కోసుకుని శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇతను గోనెగండ్లలో పని చేసేవారు. ఇటీవల ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. మనస్తాపానికి గురైన ఆయన ఇంటికి వెళ్లకుండా ప్రొద్దుటూరుకు వచ్చారు. ఓ లాడ్జిలో అద్దెకు దిగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ ను గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News March 24, 2024

కర్నూలు: యువ ఓటర్లే కీలకం

image

కర్నూలు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో యువత ఓట్లే కీలక పాత్ర పోషించనున్నాయి. మొత్తం ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల లోపు వారే దాదాపు 50 శాతంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 20 నుంచి 29 ఏళ్ల లోపు వాళ్లు 6,90,703 మంది ఉండగా 30 నుంచి 39 ఏళ్ల వాళ్లు 9,63,220 మంది ఉన్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నాయకుల భవితను నిర్ణయించేందుకు వీళ్లు సిద్ధంగా ఉన్నారు.

News March 24, 2024

నంద్యాల: టీడీపీలో చేరిన చల్లా కుటుంబ సభ్యులు

image

బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. దివంగత మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి సోదరుడు, అవుకు కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ చల్లా విజయ భాస్కర్ రెడ్డి, ఆయన బావమరిది కాశీపురం మెట్ల రామిరెడ్డి టీడీపీలో చేరారు. అమరావతిలోని చంద్రబాబు స్వగృహం నందు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

News March 24, 2024

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా?

image

డోన్ నియోజకవర్గం ఉమ్మడి పార్టీల అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం కలిశారు. గతంలో ధర్మవరం సుబ్బారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. తదుపరి పరిణామాల వల్ల సూర్యప్రకాశ్ రెడ్డికి సీటు కేటాయించారు. నియోజవర్గం పరిస్థితులపై బాబు ఇరువురి నేతలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు సమాచారం.

News March 24, 2024

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

నంద్యాల జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వివిద రాజకీయ పార్టీల నాయకులు, పెద్దలు, ప్రజలు అందరూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 23, 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: డీఐజీ

image

రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు అధికారులను ఆదేశించారు. 4 జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఐజీ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. క్రికెట్ బెట్టింగ్, క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News March 23, 2024

నంద్యాల: గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

image

బనగానపల్లె పట్టణం ఖాజీ వాడలో నివాసం ఉంటూ యనకండ్ల గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షాషావలి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఖాజీ వాడాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చిన్ననాటి స్నేహితుడు టీచర్ షాషావలి మృతి చెందడం పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు.

News March 23, 2024

సంజామల మండల వాసికి కడప TDP MLA టికెట్

image

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కడప MLA అభ్యర్థిగా రెడ్డప్పగారి మాధవి రెడ్డిని అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. YCP సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాతో ఆమె ఆమె తలపడనున్నారు. ఈమె ప్రస్తుతం కడపలో నివశిస్తున్నా.. సొంత ఊరు నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామం అని తెలిపారు. ఈమె భర్త కడప టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి.