India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని వనరులను సమర్ధవంతంగా వినియోగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రణాళిక రూపకల్పనలో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి కనీసం రూ.25 వేలు ఆదాయం వచ్చేలా ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి నివేదికలు అందజేయాలన్నారు.
అప్పులు తీర్చలేక చిప్పగిరి మండలం నగరడోనకు చెందిన రైతు గొల్ల చిన్న రంగస్వామి(48) తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై శుక్రవారం మరణించారు. మృతుడు సాగు కోసం దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేశారు. వాటిని ఎలా తీర్చాలనే మనోవేదనకు గురవుతూ శుక్రవారం ఛాతిలో నొప్పి రావడంతో గుంతకల్లు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ మరణించారు. ఈయనకు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు.
ఐదేళ్ల లక్ష్యాలతో జిల్లా అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకుని, లక్ష్యాల సాధనకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఐదేళ్ల విజన్ ప్లాన్ రూపకల్పనపై జిల్లా అధికారులతో నిర్వహించిన వర్క్ షాప్లో కలెక్టర్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పాటు ఈ వర్క్ షాప్ జరుగనుంది.
ఆలూరు సంత మార్కెట్లో రూ 1.20 లక్షలతో నిర్మించిన 29 షాపులను, రూ.80 లక్షలతో నిర్మించిన 16 షాపులను ప్రారంభించి బహిరంగ వేలం వేయాలని సీపీఎం మండల కార్యదర్శి షాకీర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలూరు సంత మార్కెట్ వద్ద నిరసన తెలిపారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు నిర్మాణాలు పూర్తయినా ప్రారంభించలేదన్నారు. వాటిని ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు.
కర్నూలు జిల్లా గోనెగండ్లలోని పెద్ద మర్రివీడుకు చెందిన నాగేశ్, మరియమ్మల రెండో కుమార్తె అక్షయ(2) స్పైనల్ మస్కులర్ ఆట్రోపీతో బాధపడుతోంది. ప్రాణాంతక సమస్య కావడంతో జోల్ జేరి ఏస్ఎంఏ ఇంజక్షన్ చేయాలని HYDలో వైద్యులు స్పష్టం చేశారు. దాని విలువ రూ.18 కోట్లు ఉంటుందన్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
నంద్యాల పూర్వ కలెక్టర్కు హైకోర్టు రూ.10 వేల ఫైన్ వేసింది. లైమ్స్టోన్ భూములను కాటసాని రామిరెడ్డి అనుచరులకు అసైన్డ్ చేసేందుకు సిఫార్సు చేశారని మంత్రి బీసీ ఆరోపించారు.ఈ ప్రక్రియను నిలిపివేయాలని 2023లో హైకోర్టులో ఫిల్ వేశారు. దీనిపై కౌంటర్ వేయాలని కేంద్ర గనుల శాఖ కార్యదర్శి, కలెక్టర్కు కోర్టు ఆదేశించినా వేయలేదు. బుధవారం వెలువరించిన తీర్పులో గనుల శాఖ కార్యదర్శికి కూడా రూ.20వేలు ఖర్చులు విధించింది.
కర్నూలు జిల్లా పరిధిలోని ఎమ్మిగనూరు KGBV ప్రిన్సిపల్ కవితపై విద్యాశాఖ సీరియస్ అయ్యింది. ఇటీవల పలు వార్తా పత్రికలు, మీడియాలో వచ్చిన “విద్యార్థులకు అందని భోజనం” అనే కథనాలపై ప్రభుత్వం ఆదేశాలతో విచారణ జరిపిన అధికారులు, వాస్తవమని తేలడంతో ఆమెను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కర్నూలు డిఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలం ఫౌండేషన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి గురువారం సీఎం చంద్రబాబు నుంచి రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలకు అందజేసే విభాగంలో కర్నూలు జిల్లా నుంచి ఈ పాఠశాల ఎంపికైంది. మూడోసారి వరుసగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న పాఠశాలగా గుర్తింపు పొందింది. విజయలక్ష్మిని కలెక్టర్ రంజిత్ బాషా, డీఈఓ శామ్యూల్ పాల్ అభినందించారు.
నంద్యాల జిల్లాలో మరోసారి భారీగా ఎస్ఐలు బదిలీ అయ్యారు. 23 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 21 మందికి వివిధ మండలాలకు పోస్టింగ్ ఇవ్వగా, మరో ఇద్దరు ఎస్సైలను వీఆర్కు బదిలీ చేశారు. మరోవైపు ఇప్పటికే వీఆర్లో ఉన్న ఏడుగురు ఎస్ఐలకు పోస్టింగ్ లభించింది. ఈ మేరకు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, ఆదోనిలో బీజేపీ అభ్యర్థి కోసం నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి గెలిపించుకున్నామని, అయినా తాము అధికార పార్టీలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యవహార శైలి వల్ల తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. తమ నాయకులను ఇబ్బంది పెట్టిన వారిని బీజేపీలో చేర్చుకోవడం ఏంటని అసహనం వ్యక్తంచేశారు.
Sorry, no posts matched your criteria.