India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత శ్రీనివాసులు (45) హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో చురుగ్గా పనిచేసిన ఆయనకు పత్తికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్ పోస్ట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ పోస్ట్ ఆయనకు దక్కకుండా చేసేందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ పదవి కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఐదు హత్యలు జరిగాయి. ఇందులో నలుగురు టీడీపీ నేతలు ఉండగా ఒకరు వైసీపీ కార్యకర్త ఉన్నారు. వెల్దుర్తి, డోన్, ఆళ్లగడ్డ, పత్తికొండ ప్రాంతాల్లో టీడీపీ నేతలు హత్యకు గురవ్వగా మహానంది మండలం సీతారామపురంలో వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు.
భారత స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ 1921, 1929 సంవత్సరాల్లో కర్నూల్ జిల్లాలో పర్యటించారు. 1921 SEP 29న తొలిసారి రైలులో కర్నూలు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో మహాత్ముడి ఉపన్యాసాలు లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. స్వరాజ్య నిధికి భారీ విరాళాలు అందజేశారు. అప్పట్లో జనాలను ఉద్దేశించి హిందీలో ప్రసంగించగా ఆయన ఉపన్యాసాన్ని కొండా వెంకటప్పయ్య పంతులు తెలుగులో అనువాదం చేశారు.
రాయలసీమ రేంజ్ పరిధిలో మరోసారి సీఐలు బదిలీ అయ్యారు. 16 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు సీఐలను వీఆర్కు బదిలీ చేయగా, మరోవైపు ఇప్పటికే వీఆర్లో ఉన్న ముగ్గురు సీఐలకు పోస్టింగ్ లభించింది. ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కొత్త సీఐలను డీఐజీ డా.కోయ ప్రవీణ్ నియమించారు.
వెలుగోడు మండల పరిధిలోని అబ్దుల్లాపురం గ్రామంలో బుధవారం అప్పుల బాధ తట్టుకోలేక భార్య, భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన విదితమే. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. దంపతుల కుమారుడు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. డబ్బు అప్పుగా ఇచ్చిన వారు ఇంటి మీదికి వచ్చి నానా దుర్భాషలాడారు. అప్పు తీర్చే మార్గం కనబడకపోవడంతో దంపతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కర్నూలు (D) పత్తికొండ (మం) హోసూరులో TDP నేత శ్రీను హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. YCP ఉనికిని కాపాడుకునేందుకు జగన్&కో తమ నేతలు, కార్యకర్తలపై హత్యలు, బెదిరింపులతో దాడులకు పాల్పడుతుందని బీసీ విమర్శించారు. హత్య చేసిన వారిని, వారి వెనుకున్న వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీను కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి బీసీ హామీచ్చారు.
శ్రీశైలం జలాశయం పరిసరాల్లో చేపల వేటపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. జులై, ఆగస్టులో చేపలు సహజ సంతానోత్పత్తి సమయం అని మత్స్యశాఖ పేర్కొంది. ఈ సమయంలో జలాశయంతో పాటు వెనక జలాల్లో చేపల వేట చేయొద్దని ఆదేశించింది. శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు మూసివేయడంతో మత్స్యకారులు ఇటీవల పుట్టీలపై చేపల వేట కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో ఆధారాలు సేకరించామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. సాయంత్రంలోగా నిందితులను పట్టుకుంటామని అన్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. శ్రీనివాసులు తలపై వెనుక నుంచి గొడ్డలితో నరికినట్లు గుర్తించామన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా మృతులు మహేశ్వర్ రెడ్డి(40), భార్య శాంతి(35)గా పోలీసులు గుర్తించారు. గ్రామంలోని తమ పొలంలో విష ద్రావణం తాగి వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత శ్రీనివాసులును వైసీపీ నేతలే హత్య చేశారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ‘ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు. శ్రీనివాసులు కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.