Kurnool

News August 14, 2024

పత్తికొండ వద్ద టీడీపీ నేత హత్య

image

కర్నూలులో జిల్లాలో దారుణ హత్య జరిగింది. పత్తికొండ మండలం హోసూరులో బుధవారం తెల్లవారుజామున టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులును దుండగులు హత్య చేశారు. కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో నరికినట్లు తెలుస్తోంది. గ్రామంలో పోలీసులు భారీగా మొహరించారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

News August 14, 2024

కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైల బదిలీ

image

జిల్లాలో ఆరుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. కర్నూలు 1వ పట్టణ ఎస్సై బాలనర్సింహులును హొళగుందకు, ఎమ్మిగనూరు ఎస్సై రమేశ్ బాబు కర్నూలు 1వ పట్టణ పీఎస్, వీఆర్‌లో ఉన్న ప్రహైద్‌ను ఆదోని పీసీఆర్‌కు, తిరుపతి వీఆర్‌లో ఉన్న పరమేశ్ నాయక్‌ను మంత్రాలయం స్టేషన్‌కు, కర్నూలు వీఆర్‌లో ఉన్న హెచ్‌.డా.నాయక్‌ను ఎమ్మిగనూరు స్టేషన్‌కు, అనంతపురం జిల్లా బొమ్మనహల్‌లో ఉన్న శ్రీనివాసులును నందవరం పీఎస్‌కు బదిలీ చేశారు.

News August 14, 2024

ఆదోని: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.7749 పలికింది. సోమవారంతో పోలిస్తే పత్తి ధర స్వల్పంగా రూ.10 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి కనిష్ఠ ధర రూ.4,000, వేరుశనగ గరిష్ఠ ధర రూ.7,280 కనిష్ఠ ధర రూ.3,449 పలికింది. మార్కెట్‌లో 509 క్వింటాళ్ల పత్తి, 3320 క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు జరిగినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

News August 13, 2024

BREAKING: రాయలసీమ రేంజ్‌లో భారీగా సీఐల బదిలీ

image

రాయలసీమ రేంజ్ పరిధిలో ఒకేసారి 62మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 18 మంది సీఐలను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కాగా మరోవైపు ఇప్పటికే వీఆర్‌లో ఉన్న 15 సీఐలకు పోస్టింగ్ లభించింది. ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీఐలను డీఐజీ డా.కోయ ప్రవీణ్ నియమించారు.

News August 13, 2024

రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

image

మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారి 353వ ఆరాధన ఉత్సవాలకు రావాలంటూ సీఎం చంద్రబాబుకు మఠం అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 18 నుంచి 24 వరకు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి ఆరాధన ఉత్సవాలు ఉంటాయని సీఎంకు వివరించారు. ఆహ్వాన పత్రికతో పాటు రాఘవేంద్ర స్వాముల వారి ప్రసాదాన్ని అందజేశారు.

News August 13, 2024

విద్యుత్ వెలుగులతో ఆకట్టుకుంటున్న కొండారెడ్డి బురుజు

image

కర్నూలు నగరం ఆగస్టు 15న జరిగే 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా అధికారులు కొండారెడ్డి బురుజును త్రివర్ణ పతాక విద్యుత్ వెలుగులతో సిద్ధం చేశారు. ఈ దృశ్యాన్ని చూడటానికి నగర ప్రజలు తరలి వస్తున్నారు.

News August 13, 2024

తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించిన మంత్రులు

image

కర్ణాటకలోని హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్‌ను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కర్నూల్ ఎంపీ నాగరాజు, అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన పనులపై నిపుణులు, అధికారులతో చర్చించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News August 13, 2024

వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే

image

కర్నూలులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘ అవయవ దానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి’ అని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

News August 13, 2024

తుంగభద్ర డ్యాం.. నీటి వృథా కాకుండా స్టాప్‌లాగ్‌

image

తుంగభద్ర డ్యాంలో నీరు పూర్తిగా వృథా కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 19వ గేటు స్థానంలో స్టాప్‌లాగ్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హొసపేటెలో స్టాప్‌లాగ్‌ గేటును కార్మికులు సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల్లో తయారీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం జలాశయంలో 97 టీఎంసీల నీటినిల్వ ఉంది. గేటు కొట్టుకుపోయిన తర్వాతి నుంచి నిన్న రాత్రి 9 గంటల వరకు 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయ్యాయి.

News August 13, 2024

నంద్యాల: పిజిఆర్ఎస్‌కు 153 దరఖాస్తులు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. పిజిఆర్ఎస్‌కు 153 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు.