Kurnool

News March 22, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లా TDP MP అభ్యర్థులు వీరే..

image

టీడీపీ మూడో జాబితా విడుదల చేసింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బస్తిపాడు నాగరాజును ప్రకటించింది. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు.

News March 22, 2024

ఎమ్మెల్యే శ్రీదేవి కోడ్ ఉల్లంఘన ఈసీ షోకాజ్‌లు

image

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి 22 మంది లబ్ధిదారులకు బుధవారం సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ ఫొటోలు వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో హల్చల్ చేశాయి. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించిన ఎమ్మెల్యేకి పత్తికొండ రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి గురువారం షో కాజ్ నోటీసులు జారీ చేశారు. కోడ్ ఉల్లంఘనపై 24గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఈ నోటీసును రెవెన్యూ అధికారులు ఆమెకు అందజేశారు.

News March 22, 2024

కర్నూలు జిల్లా TDP MP అభ్యర్థులు వీరేనా..?

image

టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ సీట్లు ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ టీడీపీ నాయకులలో నెలకొంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా శబిరి పేర్లు ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధికారిక ప్రకటనలో వారి పేర్లు ఉంటాయా..? లేదా ఎవరికి ఇచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి.

News March 22, 2024

కర్నూలు : పాలీసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎ.చక్రవర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 ఫీజు చెల్లించి https://polycetap. nic.in ద్వారా వచ్చే నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.

News March 22, 2024

12 మంది వాలంటీర్ల తొలగింపు: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని ఎన్నికల అధికారి, కలెక్టర్ సృజన తెలిపారు. కోడ్ వచ్చినప్పటి నుంచి 20వ తేదీ వరకు పబ్లిక్ ప్రాపర్టీస్ మీద ఉన్న 15,115, ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఉన్న 5,649 గోడ రాతలు, పోస్టర్లు, బ్యానర్లు, తదితరాలను తొలగించామన్నారు. కోడ్ ఉల్లంఘించిన 12మంది వాలంటీర్లను ఉద్యోగం నుంచి తొలగించామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

News March 22, 2024

ఈవీఎంల పనితీరుపై సంపూర్ణ అవగాహన పొందండి: కలెక్టర్

image

పోలింగ్ రోజు ఈవీఎంల పనితీరుపై సమస్యలు తలెత్తకుండా సంపూర్ణ శిక్షణ పొంది పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణ నివ్వాలని జిల్లా స్థాయి మాస్టర్లను మాస్టర్ ట్రైనర్లను జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో ఈవీఎంల పనితీరుపై జిల్లా, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్, సెక్టోరల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు.

News March 21, 2024

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: ఎస్పీ

image

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. పత్తికొండ సబ్ డివిజన్, రాతన, తుగ్గలి, జొన్నగిరి గ్రామాలలో కవాతు నిర్వహించారు. పత్తికొండ రూరల్ సీఐ వై.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తుగ్గలి SI బి.మల్లికార్జున, జొన్నగిరి ఎస్సై రామాంజనేయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో కూడా నిర్వహించారన్నారు.

News March 21, 2024

వాలంటీర్లపై క్రిమినల్ కేసులు: కలెక్టర్

image

ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే క్రిమినల్ కేసులో నమోదు చేయాలని కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చి 4 రోజులు గడిచినా ఎన్నికల కోడ్‌కు సంబంధించి ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయన్నారు. పోస్టర్స్, హోర్డింగ్స్, బ్యానర్స్ ఈపాటికే తీసేసి ఉండాల్సిందన్నారు. ఇప్పటికి తీసేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 21, 2024

ఎన్నికల్లో వీరికి పోస్టల్ బ్యాలెట్లు

image

పోలింగ్ జరిగే మే 13న అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. విద్యుత్, BSNL, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, AIR, స్టేట్ మిల్క్ యూనియన్, పాల సహకార సంఘాలు, హెల్త్, ఫుడ్ కార్పొరేషన్, RTC, అగ్నిమాపక, పోలీసులు, అంబులెన్స్, షిప్పింగ్, సమాచార, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, కవరేజీ కోసం లెటర్లు పొందిన జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది.

News March 21, 2024

కర్నూలు జిల్లాలో TDP ఒక్కసారి మాత్రమే గెలిచిన స్థానం ఇదే..

image

కోడుమూరు నియోజవకర్గానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో TDP ఒక్కసారి మాత్రమే గెలిచింది. 1962లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పీఆర్ రావుపై కాంగ్రెస్ అభ్యర్థి డీ.సంజీవయ్య విజయం సాధించారు. మొత్తం 8సార్లు కాంగ్రెస్ విజయం సాధిస్తే.. 1983లో తొలిసారి బరిలో నిలిచిన TDP పరాజయం పాలైంది. 1985లో TDP అభ్యర్థి ఎం.శిఖామణి మాత్రమే విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో గెలుస్తుందో లేదో కామెంట్ చేయండి.