Kurnool

News August 12, 2024

తుంగభద్ర డ్యామ్‌కు కర్ణాటక సీఎం

image

కర్ణాటక సీఎం సిద్ద రామయ్య తుంగభద్ర డ్యామ్‌ను మంగళవారం సందర్శించనున్నారు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో గేటు మరమ్మతుల పనులు పరిశీలించనున్నారు. దీంతో అందుకు తగ్గ ఏర్పాట్లను కొప్పల్, విజయనగర జిల్లాల అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్‌ను ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, రామానాయుడులు పరిశీలించారు.

News August 12, 2024

కృష్ణానదిలో గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం

image

పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ సమీపంలోని కృష్ణా నదిలో ఆదివారం చేపల వేటకు వెళ్లి బండారు శేషన్న అనే మత్స్యకారుడు గల్లంతైన విషయం విధితమే. స్థానికులు, మత్స్యకారులు చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా శేషన్న మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నందికొట్కూరుకు తరలించారు.

News August 12, 2024

ఈనెల 16 నుంచి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు

image

ఈనెల 16 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పీ.రంజిత్ బాషా పేర్కొన్నారు. ఆదివారం సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్లతో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ గ్రామంలో, ఏ తేదీలో సదస్సులు నిర్వహిస్తామన్న వివరాలతో వెంటనే షెడ్యూల్ రూపొందించి పంపాలని అధికారులను ఆదేశించారు.

News August 12, 2024

చెన్నైలో ఘోర ప్రమాదం.. కర్నూలు బీటెక్ విద్యార్థి దుర్మరణం

image

కర్నూలుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రామ్మోహన్(21) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న రామ్మోహన్.. తన స్నేహితులతో కలిసి కారులో అరుణాచలేశ్వర ఆలయానికి ఆదివారం బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారును తిరువళ్లూరు జిల్లాలో లారీ ఢీకొంది. ప్రమాదంలో రామ్మోహన్‌తో పాటు మరో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందారు.

News August 12, 2024

వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి వృద్ధురాలి ఆత్మహత్య

image

ఆత్మకూరు పద్మావతి నగర్‌లోని పెద్ద వాటర్ ట్యాంక్‌పై నుంచి వృద్ధురాలు దూకి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు ఆత్మకూరులోని అక్కిరాజు కాలనీకి చెందిన ఖైరన్ బీ(68)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మతిస్థిమితం సరిగా లేక ఆమె ట్యాంకు నుంచి దూకినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News August 12, 2024

దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట: ఎస్పీ

image

నంద్యాల జిల్లా పరిధిలో దొంగతనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే దిశగా గస్తీ నిర్వహణ చేయాలని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలో గస్తీ విధులు నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, నేర చరిత్ర గల వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. వాహనాల రికార్డులను పరిశీలించాలన్నారు.

News August 11, 2024

తూర్పు గోదావరి జేసీగా నంద్యాల జిల్లా వాసి

image

తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన ఎస్.చిన్న రాముడు నియమితులయ్యారు. ఏపీఎస్సీ కార్పొరేషన్ VC&MDగా ఉన్న ఆయనను తూ.గో జేసీగా ప్రభుత్వం నియమించింది. అటు నంద్యాల పూర్వపు జేసీ టీ.రాహుల్ కుమార్ రెడ్డిని సీతంపేట ITDA పీవోగా బదిలీ చేయగా.. మరోసారి బదిలీ చేస్తూ ఆయనను పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.

News August 11, 2024

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

image

పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి బండారు శేషన్న అనే వ్యక్తి ఆదివారం గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న ముచ్చుమర్రి ఎస్సై గంగన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో పుట్టి మునిగిన ప్రాంతాన్ని ఇంజిన్ బోట్‌లో వెళ్లి పరిశీలించారు. శేషన్న అచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

News August 11, 2024

విద్యుత్ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయండి: DYFI

image

విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని DYFI జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం DYFI జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్యదర్శి నగేశ్ మాట్లాడారు. విద్యుత్ సంస్థల్లో ఇంజినీర్ల కొరత వేధిస్తోందని, ఏటా ఉద్యోగ విరమణ చేస్తున్న పోస్టుల్లో కొత్త నియామకాలు చేసేందుకు ప్రభుత్వం, విద్యుత్ సంస్థల ముందుకు రావడంలేదని అన్నారు.

News August 11, 2024

కర్నూలు జిల్లా కలెక్టర్‌కు సీఎం కీలక ఆదేశాలు

image

తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై CM చంద్రబాబు సమీక్షిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా చూడాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో నదీ పరివాహక ప్రాంత ప్రజలను రెవెన్యూ అధికారులు, సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. కౌతాళం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.