India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై కర్నూలు జిల్లా కలెక్టర్తో మంత్రి టి.జి భరత్ మాట్లాడారు. డ్యాంలో నీటి నిల్వ, ఔట్ ఫ్లోపై ఆరా తీసి పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. టీబీ డ్యాం సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని మంత్రి చెప్పారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందొద్దని మంత్రి కోరినట్లు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీమ్ను పంపాలని సీఎం వారికి సూచించారు.
ట్రాఫిక్ క్రమబద్దీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్నూలులోని ఆయా కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలతో కర్నూలు కలెక్టర్ బిందు మాధవ్ శనివారం సమావేశం నిర్వహించారు. వాటిపై చర్చించి పలు సూచనలు చేశారు. బైక్ రైడింగ్, సైలెన్సర్లు తీసి శబ్దం చేసే వారి వీడియోలు తీసి వాట్సప్ నంబర్ 7777877722కు పంపితే చర్యలు తీసుకుంటామన్నారు.
టీడీపీ ప్రభుత్వ హాయంలో రాయలసీమ సాగునీటి అవసరాలను గుర్తించి, సీమను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నంద్యాల జిల్లాలోని అవుకు రిజర్వాయర్ నుంచి గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ ద్వారా కడప జిల్లాకు నీటిని విడుదల చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు.
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గటంతో రాత్రి 10 గేట్లలో 4 గేట్లను అధికారులు మూసివేశారు. కేవలం 6 గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు 1,62,114 క్యూసెక్కులు, రెండు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 61,028 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రస్తుతం శ్రీశైలానికి 1,85,664 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. డ్యామ్ నీటిమట్టం 882.70 అడుగులు. 202.9673 TMCలుగా ఉంది.
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా జిల్లాలోని ఫ్యాక్షన్ జోన్, స్పెషల్ బ్రాంచ్, సీసీ కెమెరాల నిర్వహణ(PCR) మొదలగు విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు వారి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాలు అక్కడ వర్గ, రాజకీయ కక్షలు, నెలకొనే ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలు ,గొడవలు, అల్లర్లు మొదలగు వాటి గురించి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బేతంచెర్ల-నంద్యాల రైల్వే లైన్లో కృష్ణమ్మ కోన వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి కిందపడి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ తెలిపారు. మృతునికి దాదాపు 55 ఏళ్లు ఉంటాయని, లేత నీలిరంగు చొక్కా, టవల్ కలిగి ఉన్నారని పేర్కొన్నారు. మృతుని వద్ద తుగ్గలి నుంచి డోన్ వరకు టికెట్ లభించిందన్నారు. గుర్తించిన వారు నంద్యాల రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.
బనగానపల్లె మండలం నందవరంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని జిల్లా కలెక్టర్ రాజకుమారి దంపతులు దర్శించుకున్నారు. కలెక్టర్ దంపతులను అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి కామేశ్వరి, మాజీ పాలకమండలి చైర్మన్ పీవీ కుమార్ రెడ్డి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.
స్వీడన్లోని గోథెన్స్ బర్గ్ వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఆదోనికి చెందిన ఖాజా బందే నవాజ్ ఎంపికయ్యారని జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాండురంగా రెడ్డి, రవికుమార్ తెలిపారు. ఈనెల 13 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ పోటీల్లో 60 ఏళ్ల కేటగిరీలో పాల్గొననున్నారు. ఖాజా బందే నవాజ్కు మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అభినందనలు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో వివిధ జిల్లాల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాకు బదిలీపై వచ్చిన ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జడ్పీ సీఈఓ నాసర రెడ్డి రిలీవ్ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 39 మంది ఎంపీడీవోలను రిలీవ్ చేసినట్టు ప్రకటించారు. ఇందులో అనంతపురం జిల్లాకు చెందిన వారు 23 మంది, కడప జిల్లాకు చెందిన వారు 16 మంది ఉన్నారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.