Kurnool

News March 19, 2024

‘ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డైరెక్టర్ సముద్ర ఖని’

image

శ్రీశైలానికి 20 కి.మీ దూరం గల దట్టమైన అభయారణ్యంలో వెలసిన కోరిన కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరి అమ్మవారిని సినీ దర్శకులు సముద్ర ఖని మంగళవారం దర్శించుకున్నారు. మల్లన్న దర్శనార్థమై వచ్చిన ఆయన ముందుగా నల్లమల అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరి దేవాలయాన్ని సందర్శించి అనంతరం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట స్థానికుడు కోటి ఉన్నారు.

News March 19, 2024

కర్నూలు: ఆసుపత్రి గదిలో రోజాంతా చిక్కుకు పోయిన ఐదేళ్ల బాలుడు

image

ఐదేళ్ల చిన్నారి రోజంతా గదిలో బందీ అయిన ఘటన కర్నూలు ఆసుపత్రిలో జరిగింది. ఓర్వకల్లు(M) తిప్పాయిపల్లెకు చెందిన ఉస్సేనయ్య, మౌనికల కొడుకు సుజిత్‌ పుట్టుకతో మూగ, చెవుడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ఆదివారం తల్లి బయటకు వెళ్లగా బాలుడు ఎనస్థీషీయా HOD గదిలోకి వెళ్లాడు.గదిని శుభ్రంచేసి బాలుడిని గమనించకుండా తాళం వేశారు. వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. సోమవారం గది తలుపులు తెరవగా సుజిత్ అందులో ఉన్నారు.

News March 19, 2024

కర్నూలు: వైసీపీ MLA అభ్యర్థుల్లో వీరే చిన్నోళ్లు

image

కర్నూలు జిల్లాలో 14మంది ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులను వైసీపీ అదిష్ఠానం ప్రకటించింది. వీరిలో 1988లో జన్మించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డి అందరికంటే వయస్సులో చిన్నవారు. ఆయన తర్వాత స్థానంలో 1988లో జన్మించిన నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నారు. అందరి కంటే ఎక్కువ వయస్సు కల్గిన అభ్యర్థిగా 1954లో జన్మించిన నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.

News March 19, 2024

కర్నూలు: ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం

image

ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైనట్లు క్యాంపు ఆఫీసర్, ఆర్ఐఓ ఎస్విఎస్ గురువయ్య శెట్టి వెల్లడించారు. సోమవారం కర్నూలులోని టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో మూల్యాంకనం జరిగిందన్నారు. ప్రతిరోజు మూల్యాంకనానికి హాజరయ్యే అధ్యాపకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా క్యాంపులో ఉండాలన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 15, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు 15 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు.

News March 18, 2024

కర్నూలు: టెన్త్ పరీక్షలకు 810 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎక్కడా వాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష నిర్వహించారు. మొదటి రోజు పరీక్షకు 33,144 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 32,334 మంది మాత్రమే హాజరయ్యారు. 810 మంది గైర్హాజరయ్యారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు దాదాపుగా 44 పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.శామ్యూల్ వెల్లడించారు.

News March 18, 2024

కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదుల స్వీకరణ: కలెక్టర్

image

కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను వివిధ మాధ్యమాల ద్వారా స్వీకరించడం జరుగుతోందని కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఫిర్యాదులను సీ-విజిల్ యాప్‌లో కానీ, హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కానీ, కర్నూలు జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 7755కు కానీ, కాల్ సెంటర్ 08518-220125కు కానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసే వారు డిఐపిఆర్ఓ_కర్నూలు ట్విట్టర్ అకౌంట్‌కు ఫిర్యాదును ట్యాగ్ చేయవచ్చన్నారు.

News March 18, 2024

కర్నూలు: పీజీ సెమిస్టర్‌కు 90శాతం హాజరు

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో పీజీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగిన పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షకు సోమవారం నాడు 90 శాతం విద్యార్థులు హాజరైనట్లు యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. మొత్తం 558 మంది విద్యార్థులకు గాను.. 53 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.

News March 18, 2024

కర్నూలు నుంచి జేఎస్ఎస్‌పీ అభ్యర్థిగా రామయ్య యాదవ్ పోటీ

image

జాతీయ సమ సమాజం పార్టీ నుంచి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏపీ రామయ్య యాదవ్ తెలిపారు. సమాజ హితం కోసం సమసమాజ స్థాపనకై తమ పార్టీ ఆవిర్భవించిందని స్పష్టంచేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు ప్రజల తాగునీటి సమస్యను తీర్చి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కర్నూలును అభివృద్ధి చేస్తానన్నారు.

News March 18, 2024

కొత్తూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కోడుమూరు మండలంలోని కొత్తూరు వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు వద్ద రోడ్డుపై వెళ్తున్న కొత్తూరు గ్రామానికి చెందిన ఎం.రామయ్య అనే(65) వ్యక్తిని కర్నూలు వైపు నుంచి కోడుమూరు వైపు వస్తున్న బొలెరో వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2024

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు: కలెక్టర్

image

వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవని కలెక్టర్ జి.సృజన ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే విధుల నుంచి తొలగిస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటే వెంటనే సస్పెండ్ చేస్తామన్నారు. అలా ఎవరైనా ప్రచారంలో పాల్గొంటే టోల్ ఫ్రీ నెంబర్: 1800 425 7755కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.