Kurnool

News August 10, 2024

కిడ్నాప్ కేసు.. కర్నూలులో వైసీపీ నేత అరెస్ట్

image

కర్నూలులో సంచలనం సృష్టించిన వ్యాపారి ప్రవీణ్ కుషాల్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేతతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 8న ప్రవీణ్‌ను కిడ్నాపర్లు బలవంతంగా అపహరించారు. తండ్రి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు వైసీపీ నేత పెద్ద మద్దిలేటి ఆయన అనుచరులు అనిల్, సురేశ్, భాస్కర్, మిథున్‌ను అరెస్ట్ చేశారు. కోడుమూరు MLA టికెట్ విషయంలో డబ్బులు తీసుకుని మోసం చేయడంతో కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది.

News August 10, 2024

అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే బుడ్డా

image

ఎవరు కోరినా తాను కాల్ డేటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, కావాలంటే చెక్ చేసుకోవచ్చని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సీతారామపురంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడి టీడీపీ ప్రభుత్వానికి పట్టం కట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

News August 10, 2024

సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కేఈ శ్యామ్ బాబు, బొగ్గుల దస్తగిరి, గౌరు చరితారెడ్డి హాజరయ్యారు. గిరిజన సంక్షేమ కోసం పోరాడిన బిర్సా ముండా, అల్లూరి ఆదర్శప్రాయులన్నారు.

News August 9, 2024

కప్పట్రాళ్లను సందర్శించిన కర్నూలు ఎస్పీ

image

దేవనకొండ మండల పరిధిలోని కర్నూలు మాజీ ఎస్పీ, ప్రస్తుత ఐజీ ఆకే రవికృష్ణ దత్తత గ్రామమైన కప్పట్రాళ్లను శుక్రవారం సాయంత్రం ఎస్పీ జీ.బిందు మాధవ్ సందర్శించారు. ప్రజలతో ఎస్పీ మమేకమయ్యారు. ప్రజల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఎస్పీ ఆకాంక్షించారు. ప్రశాంత జీవనానికి ప్రజలు ఎల్లప్పుడు ముందుండాలని పిలుపునిచ్చారు.

News August 9, 2024

పట్టుదలతో చదివి కలలను సాకారం చేసుకోవాలి: కలెక్టర్

image

పట్టుదలతో చదివి కన్న కలలను సాకారం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కర్నూలు బీ క్యాంప్‌లోని బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పదో తరగతి, తొమ్మిదో తరగతి విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. క్లాస్ రూమ్‌లో 9, 10 విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.

News August 9, 2024

శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి: సీఐటీయూ

image

నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, కార్యదర్శి కేఎన్‌డీ గౌస్ డిమాండ్ చేశారు. నంద్యాల సీఐటీయూ కార్యాలయంలో శానిటేషన్ వర్కర్ల సమావేశం శుక్రవారం జరిగింది. వారు మాట్లాడుతూ.. శానిటేషన్ వర్కర్లపై పనిభారం ఎక్కువగా ఉందని, 70 మందితో చేయాల్సిన పనులను కేవలం 40 మందితో చేయించుకుంటున్నారని అన్నారు.

News August 9, 2024

కర్నూలు, నంద్యాలలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేది వీరే..

image

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. కర్నూలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో పంద్రాగస్టు నాడు మంత్రి టీజీ భరత్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించనున్నారు. నంద్యాలలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆవిష్కరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News August 9, 2024

నంద్యాల జిల్లా నుంచి బెంగళూరు వెళ్లనున్న వైఎస్ జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్ నంద్యాల జిల్లా పర్యటన ముగిసిన అనంతరం బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇవాళ ఉ.10 గంటలకు ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సీతారామపురం చేరుకుంటారు. సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు బయలుదేరనున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

News August 9, 2024

నంద్యాల జిల్లా హెడ్ కానిస్టేబుల్‌‌కు ఏడాది జైలు శిక్ష

image

నంద్యాల జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ శోభన్ బాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా పడింది. ఈ మేరకు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జ్యోత్స్నాదేవి తీర్పు చెప్పారు. 2019లో కర్నూలులోని ఓ మహిళపై కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా విచారణలో నేరం రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమానా విధించారు.

News August 9, 2024

నేడు నంద్యాల జిల్లాకు వైఎస్ జగన్

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు నంద్యాల జిల్లాకు రానున్నారు. ఉదయం10 గంటలకు ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హుసేనాపురం, పాణ్యం, నంద్యాల బైపాస్ మీదుగా సీతారామపురం చేరుకుంటారు. ఇటీవల హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.