Kurnool

News March 18, 2024

నంద్యాల: టెన్త్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

image

నంద్యాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్, ఎస్పీజీ హైస్కూళ్లను వారు పరిశీలించి మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు.

News March 18, 2024

ఎమ్మిగనూరులో మళ్లీ వైసీపీ జెండా ఎగరేస్తాం: బుట్టా రేణుక 

image

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండానే ఎగరవేస్తామని ఆ పార్టీ అభ్యర్థి బుట్టా రేణుక ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మిగనూరులోని పలు ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేనేత కార్మికులను కలిసి మగ్గం అల్లారు. మహిళలతో కలిసి కుట్టు మిషన్లు కుట్టారు. అభివృద్ధి, సంక్షేమం వైసీపీకి రెండు కళ్ళ లాంటివన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు.

News March 18, 2024

ఆదోని ఎమ్మెల్యే టికెట్ టీడీపీకే కేటాయించాలని విజ్ఞప్తి

image

ఆదోని ఎమ్మెల్యే టికెట్ పొత్తులో భాగంగా టీడీపీకే కేటాయించాలని ఆదోని జిల్లా సాధ‌న క‌మిటీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. టీడీపీని గెలిపించుకుని ఆదోనిలో ఆగిపోయిన అభివృద్ధిని మరలా కొనసాగించాలన్నారు. ఆదోని టికెట్టు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించరనే వార్తలు ప్రజలకు నిరాశ కలిగిస్తున్నాయ‌న్నారు. చంద్రబాబు పునరాలోచన చేయాలని కోరారు.

News March 18, 2024

నంద్యాల: నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు

image

పదో తరగతి విద్యార్థులు సోమవారం నుంచి పరీక్షలు రాయబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు 134 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏ కేటగిరి సెంటర్లు 62 కాగా పోలీస్ స్టేషన్ దగ్గరగా, పోలీస్ స్టేషన్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీ సెంటర్లు 57, పోలీస్ స్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్లకు పైగా ఉన్న సెంటర్లో 15 ఉన్నాయి. ఉదయం 9:30 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

News March 18, 2024

REWIND: కర్నూలు MPగా హైదరాబాద్ రాజు

image

హైదరాబాద్ రాజు మన కర్నూలు ఎంపీగా పని చేశారని మీకు తెలుసా? ఇది నిజమే. హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనమైంది. ఆ తర్వాత నిజాం చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(6వ నిజాం) 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 1962లో అనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు. రానున్న ఎన్నికల్లో కర్నూలులో ఎవరు ఎంపీగా గెలుస్తారని మీరు భావిస్తున్నారు?

News March 18, 2024

విశ్వవిద్యాలయం అభివృద్ధి ధ్యేయం: వైస్ ఛాన్స్‌లర్

image

కర్నూలు లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఉన్న రాయలసీమ వర్సిటీని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని వైస్ ఛాన్స్‌లర్ సుధీర్ ప్రేమ్ కుమార్ ప్రకటించారు. వర్సిటీలో చదివే విద్యార్థులకు తప్పనిసరిగా ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి త్వరలో కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

News March 17, 2024

KNL: ఇకపై ఊపందుకోనున్న అభ్యర్థుల ప్రచార పర్వం

image

మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్న వేళ శనివారం సాయంత్రంతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో YCP, TDP-JSP-BJP, కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు ఇకపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరగనున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల ప్రచార పర్వం ఊపందుకోనుంది. ఈసారి ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు హామీలు ఇవ్వనున్నారు.

News March 17, 2024

నంద్యాల: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

image

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద వంటి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ఎవరు గుమిగూడి ఉండొద్దన్నారు. నంద్యాల జిల్లాలో 134 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. పరీక్ష కేంద్రానికి దగ్గరలో ఎలాంటి జిరాక్స్ షాపులు తెరవకూడదని ఆదేశించారు.

News March 17, 2024

టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈఓ

image

కర్నూలు జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ కె.శామ్యూల్ వెల్లడించారు. . విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులేకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. మొత్తం 31,070 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 6,020 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. 162 పరీక్షా కేంద్రాలను గుర్తించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.

News March 17, 2024

అనుమతులు తప్పనిసరి: భార్గవ తేజ

image

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూలు రావడంతో ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమావళిని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. కాన్వాసింగ్, లౌడ్ స్పీకర్స్, ఊరేగింపులు, మీటింగులు, బ్యానర్లు, పోస్టర్లు, హోల్డింగుల కోసం అనుమతులకు ఆన్‌లైన్‌లో (https://suvidha.eci.gov.in) ఎలా అప్లై చేసుకోవాలో డెమో నిర్వహించి అవగాహన కల్పించారు.