India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రతిశాఖ వంద రోజులు, ఏడాది, 5 ఏళ్ల కాలానికి లక్ష్యాలతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వంద రోజుల ప్రణాళిక, ఏడాది ప్రణాళిక, 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏమేమి చేయగలమో లక్ష్యాలు నిర్ణయించుకొని వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.
శ్రీశైలం మండల కేంద్రమైన సున్నిపెంట గ్రామపంచాయతీకి గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన జల వనరుల శాఖ ఆధీనంలోని 208.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ మేరకు మంత్రి పార్థసారథి వివరాలు వెల్లడిస్తూ రద్దయిన భూమిని తిరిగి జల వనరుల శాఖకు కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదించినట్లు పేర్కొన్నారు. ఆ భూమిని శ్రీశైలం ప్రాంత అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్కు వినియోగించుకోవాలని సూచించారు.
కర్నూలు జిల్లాలోని వేదవతి ప్రాజెక్టును ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన పథకం కింద చేర్చాలని కేంద్ర జలశక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ను కర్నూలు ఎంపీ నాగరాజు కోరారు. బుధవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 80 వేల ఎకరాలకు నీరు అందించవచ్చని, అధిక సంఖ్యలో రైతులకు లబ్ధిచేకూరి వలసలను అరికట్టవచ్చని తెలిపారు.
డోన్ మండలం చిన్న మల్కాపురానికి చెందిన మధు కుమార్ కొద్దిరోజుల కిందట బ్యాంకాక్లో కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. ఆ యువకుడిని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కిడ్నాపర్ల చర నుంచి విడిపించి బుధవారం ఇంటికి చేర్చారు. వెంటనే స్పందించి తమ కుమారుడిని తమ దగ్గరకు చేర్చినందుకు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
మహానంది మండలం సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడు హత్యకేసులో బుధవారం 11 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ ఆధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు చాపిరేవుల అండర్ పాస్ దగ్గర అరెస్ట్ చేసినట్లు ఇన్ఛార్జ్ సీఐ ఇస్మాయిల్ తెలిపారు. అరెస్టయిన వారిలో ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, శేఖర్ రెడ్డి, తాళ్లూరి శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు. రెండు వాహనాలు సీజ్ చేశామన్నారు.
జిల్లాలోని 75 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని మరింత విస్తరించేందుకు వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. బుధవారం 100 రోజుల ప్రణాళికలో భాగంగా వ్యవసాయ, ఉద్యాన, ఇరిగేషన్, పరిశ్రమలు, అటవీ, మైనింగ్, నీటి వనరులు, తదితర అంశాలపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రైతుల అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు.
ఏపీ CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూఖ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ భేటీలో CM చంద్రబాబు తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.
ఢిల్లీలో ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఎంపీలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈక్రమంలో నంద్యాల ఎంపీ, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరిని సత్కరించారు. తెలుగు రాష్ట్రాల హక్కులు కాపాడుకునేందుకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. పార్లమెంట్ వేదికగా ఏపీకి రావాల్సిన నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండులో నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు. మంగళవారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏర్పాట్ల నిర్వహణపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ, సాయుధ దళాల మార్చ్ ఫాస్ట్, వేదిక, తదితర ఏర్పాట్లపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల(GGH)కు గత ఆరు నెలలతో పోలిస్తే జూలై నెలలో క్షేత్రస్థాయిలో ఓపిలు పెరిగాయని GGH సూపరింటెండెంట్ డా.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు 2700 నుంచి 3000 వరకు ఓపీలు జారీ చేస్తున్నామన్నారు. అత్యుత్తమ డాక్టర్లు, సిబ్బందిచే అధునాతన పరికరాలతో కూడిన వైద్య సేవలు, డయాగ్నొస్టిక్ సేవలను నిరంతరాయంగా అందించడం జరుగుతోందని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.