India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల జిల్లాలో మరికాసేపట్లో YCP అధినేత, మాజీ CM వైఎస్ జగన్ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. TDP నేతల దాడిలో మృతి చెందిన నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సీతారామపురం గ్రామానికి చెందిన YCP కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్లు సమాచారం. నంద్యాలకు వస్తున్నట్లు నిన్నటి నుంచి సోషల్ మీడియోలో వైరల్గా మారింది.
మహానంది మండలం సీతారామపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు హత్యకు గురైన నేపథ్యంలో గ్రామంలో భయం భయం నెలకొంది. డీఐజీ ప్రవీణ్ కుమార్, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదివారం సాయంత్రం గ్రామానికి చేరుకుని మృతుడు సుబ్బరాయుడు భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మాకు రక్షణ కల్పించాలని కుటుంబ సభ్యులు కోరారు.
శ్రావణమాసానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఈ మాసాన్ని శుభాలు, పండుగల మాసం అని అంటారు. ఈ నెలలో అన్ని రోజులూ శుభకరమే. ఈ నెలలో ప్రతి ఇల్లూ నిత్య పూజలతో అలరారుతుంది. ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. సోమవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం అయింది. మహా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో వచ్చినందున ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. వివాహాది, గృహారంభాలు, ఇతర శుభముహూర్తాలకు వేళయింది.
‘హత్యారాజకీయాకు టీడీపీ నాయకులు చరమగీతం పాడాలి. లేని పక్షంలో మేము కూడా తిరగబడదతాం. తగ్గేదే లేదు’ అని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తేల్చి చెప్పారు. సీతారామపురంలో YCP నేత సుబ్బరాయుడు మృతదేహాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. YCP MLA విరుపాక్షి, మాజీ MLAలు రాంభూపాల్ రెడ్డి, శిల్పా రవికిషోర్ రెడ్డి, రామిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విజయవాడ వెళ్లారు. ఆయన అక్కడ సోమ, మంగళవారాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరె న్స్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లాకు సంబంధించిన ప్రగతి నివేదికలను తీసుకొని వెళ్లినట్లు సమాచారం. అనంతరం తిరిగి బుధవారం కర్నూలుకు రానున్నారు.
నంద్యాల కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రివియన్స్ రెడ్రెస్సల్ సిస్టం (పీజీఆర్ఎస్) ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు.
నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. ఆటోనగర్ సమీపంలో లోకేశ్వర్ రెడ్డి అనే విద్యార్థిని అటకాయించిన దుండగులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లన దగ్గర లేవని చెప్పడంతో విచక్షణ కోల్పోయిన దుండగులు.. కింద పడేసి కొట్టారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థి చెవిని కొరకడంతో చెవి కొంతభాగం తెగి కిందపడింది. లోకేశ్వర్ రెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీకి ఓటు వేశామనే తన భర్త సుబ్బరాయుడును టీడీపీ నేత బుడ్డా శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు హత్య చేశారని బాల సుబ్బమ్మ ఆరోపించారు. ‘శ్రీనివాసరెడ్డి అనుచరులు 30 మంది అర్ధరాత్రి మా ఇంటికి వచ్చారు. సుబ్బరాయుడు ఎక్కడ అని అడిగారు. లేడని చెప్పడంతో నన్ను కొట్టారు. తర్వాత రాళ్లు, కర్రలతో దాడిచేసి నా భర్తను చంపేశారు. దాడికి పాల్పడింది మా ఊరోళ్లే. భూ సమస్య కాదు. రాజకీయ కక్షతోనే హత్య చేశారు’ అని ఆమె చెప్పారు.
నంద్యాలలో వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడిని టీడీపీకి సంబంధించిన వ్యక్తులే హత్య చేసినట్లు వైసీపీ ఆరోపించింది. ‘మహానంది మండలం సీతారామపురంలో సుబ్బారాయుడు వైసీపీ కోసం పని చేశారు. టీడీపీ గూండాలు కక్ష పెట్టుకుని ఇంట్లోకి చొరబడి రాళ్లు, కత్తులతో దాడి చేశారు. సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాష్ట్రంలో ఇంకెన్నాళ్లు ఈ రాక్షసకాండ’ అని ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.
నంద్యాలలో వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు <<13773210>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఇంట్లోని సామగ్రి, వస్తువులను ధ్వంసం చేసి రాళ్లు, కర్రలతో సుబ్బరాయుడిని కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తను కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన భార్య పసుపులేటి బాలసుబ్బమ్మపై కూడా కత్తులతో దాడిచేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Sorry, no posts matched your criteria.