India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరుడు సుబ్బరాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. సీతారామపురంలోని తన ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రాళ్లతో దాడి చేశారు. కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు, సంస్థలు అందించిన నిస్వార్థ సేవలను గుర్తించి వారిని గౌరవించేందుకు భారత ప్రభుత్వం సుభాశ్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-25కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ అవార్డును ప్రతి ఏడాది జనవరి 23న చంద్రబోస్ జయంతి రోజున ప్రకటిస్తారన్నారు. అవార్డు పారితోషికం సంస్థకు రూ.51 లక్షలు, వ్యక్తులకు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు.
వచ్చేవారం నుంచి ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభమవుతుందని డీఈఓ శామ్యూల్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో త్వరలోనే పాఠశాల విద్యాశాఖ కమిషనర్, కార్యదర్శి పర్యటనలు ఉంటాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా నివేదికలను సిద్ధం చేసుకోవాలని కోరారు. ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో త్వరలో ఎస్సైల బదిలీలు జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే DIG, SPలు, DSPలను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా కర్నూలు రేంజ్ పరిధిలో పెద్ద సంఖ్యలో CIలను బదిలీ చేస్తూ DIG డా.ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఇటీవలే నంద్యాల, కర్నూలు జిల్లాలకు కొత్త ఎస్పీలు ఛార్జ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీలు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
దేశభక్తి భావన ఉట్టిపడేలా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వేడుకలను మొక్కుబడిగా కాకుండా దేశ, రాష్ట్ర, జిల్లా సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించాలని పేర్కొన్నారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో సుమారు 400 సెల్ టవర్ల ద్వారా 4G సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని BSNL కర్నూలు ఏరియా జనరల్ మేనేజర్ రమేశ్ శనివారం తెలిపారు. ఇప్పటికే 2G/3G సిమ్లు ఉపయోగిస్తున్నవారికి వారికి వారి ప్రాంతాలలో 4G సేవలను ప్రారంభించినప్పుడు అంతరాయం ఏర్పడుతుందన్నారు. వారు తమ సిమ్ను అప్ గ్రేడ్ చేసిన తరువాత 2G/3G/4G సేవలను పొందవచ్చన్నారు. 2G/3G సిమ్లను 4Gకి అప్ గ్రేడ్ చేసుకోవాలన్నారు.
పారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొనే ఏపీ, భారత్కు చెందిన క్రీడాకారులు విజయం సాధించాలని కలెక్టర్ రంజిత్ బాషా ఆకాంక్షించారు. ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కలెక్టర్ ఛాంబర్ సమీపంలోని సెల్ఫీ స్టాండ్ వద్ద భారతీయ అథ్లెట్లకు ఆయన థంబ్స్ చీర్ చూపించారు. క్రీడాకారులు విజయం సాధించి, ప్రపంచానికి మన భారత కీర్తిని చాటి చెప్పాలని ఆకాంక్షించారు.
శ్రీశైల ఆలయంలో క్యూలైన్ల ఏఈవో జి.స్వాములు, ఇన్ఛార్జి పర్యవేక్షకుడు గంజి రవిని సస్పెండ్ చేస్తూ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులు జారీ చేశారు. క్యూలైన్లలో విధులు నిర్వర్తించే పొరుగు సేవల సిబ్బంది మద్యం తాగి దుర్భాషలాడినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఈవో చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పొరుగు సేవల సిబ్బంది నాగేంద్రను విధుల నుంచి తొలగించారు. కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.
ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లో రన్ వే ఎక్స్టెన్షన్, విమానాలు రాత్రి సమయంలో ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రన్వేలో కల్పించాల్సిన సౌకర్యాలు, కావలసిన నిధుల వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎయిర్పోర్ట్ డైరక్టర్ను ఆదేశించారు. శుక్రవారం ఓర్వకల్ ఎయిర్పోర్ట్లోని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఛాంబర్లో రన్ వే ఎక్స్టెన్షన్, నైట్ ల్యాండింగ్పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి తల్లిబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపు ముర్రుపాలు తాగించాలని, దీంతో బిడ్డకు వ్యాధి నిరోధకత పెరిగి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు.
Sorry, no posts matched your criteria.