Kurnool

News August 2, 2024

నైట్ ల్యాండింగ్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయండి: కలెక్టర్

image

ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లో రన్ వే ఎక్స్టెన్షన్, విమానాలు రాత్రి సమయంలో ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రన్‌వేలో కల్పించాల్సిన సౌకర్యాలు, కావలసిన నిధుల వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎయిర్పోర్ట్ డైరక్టర్‌ను ఆదేశించారు. శుక్రవారం ఓర్వకల్ ఎయిర్పోర్ట్‌లోని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఛాంబర్‌లో రన్ వే ఎక్స్టెన్షన్, నైట్ ల్యాండింగ్‌పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

News August 2, 2024

నంద్యాలలో వ్యక్తి దారుణ హత్య

image

నంద్యాల పట్టణంలో కానిస్టేబుల్ సురేంద్ర మర్డర్ కేసులోని A1 ముద్దాయి అల్లూరి వెంకటసాయి అలియాస్ ఖవ్వను అయ్యాలూరు మెట్ట సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో కిరాతకంగా చంపారు. జైలుశిక్ష అనుభవించి బెయిల్ మీద ఉన్న అతన్ని చంపడం పట్టణంలో కలకలం సృష్టించింది. పాత నేరస్థులే ఈ దురాగతానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News August 2, 2024

పింఛన్ సొమ్ము స్వాహా.. నంద్యాల జిల్లాలో ఉద్యోగి సస్పెండ్

image

పింఛన్ సొమ్ము స్వాహాకు పథకం రచించిన జేఎల్ఎంను అధికారులు సస్పెండ్ చేశారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం వెంగళాంపల్లి సచివాలయంలో పనిచేస్తున్న జేఎల్ఎం పవన్ గురువారం పింఛన్ పంపిణీకి బయలుదేరారు. 50 మందికి చెందిన రూ.2,23,500 తీసుకుని బైక్‌పై వెళ్తుండగా డబ్బుల బ్యాగ్ పోయిందని అధికారులకు తెలిపారు. ఎంపీడీవో ఫిర్యాదు చేయడంతో పోలీసులు పవన్‌ను విచారించారు. స్వాహా యత్నం అని తెలుసుకుని డబ్బులు రికవరీ చేశారు.

News August 2, 2024

మిద్దె కూలి నలుగురి మృతి.. నంద్యాల జిల్లాలో విషాదం

image

నంద్యాల జిల్లాలో ఘోర విషాదం జరిగింది. మట్టి మిద్దె కూలి ఓ కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. చాగలమర్రి మండల పరిధిలోని చిన్న వంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురు శేఖర్ రెడ్డి, ఆయన భార్య ఇద్దరు తమ పిల్లలతో కలిసి నిద్రించగా వారి జీవితాలు నిద్రలోనే తెల్లారాయి. అర్ధరాత్రి వేళ హఠాత్తుగా మట్టి మిద్దె కూలి వారిపై పడటంతో నలుగురూ చనిపోయారు. ఈ ఘటనతో చిన్న వంగలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News August 2, 2024

కలెక్టరేట్ ఏవోగా రాజేశ్వరి బాధ్యతల స్వీకరణ

image

కర్నూలు కలెక్టరేట్ పరిపాలన అధికారిగా రాజేశ్వరి గురువారం ఏవో ఛాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ సెక్షన్లలో పనులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ఏవోకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

News August 1, 2024

పెన్షన్ పంపిణీలో కర్నూలు జిల్లా అగ్రస్థానం: కలెక్టర్

image

పెన్షన్ల పంపిణీలో కర్నూలు జిల్లా 97.96 శాతంతో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ రంజిత్ బాషా గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 2,43,337 పెన్షన్లు ఉండగా.. అందులో 2,38,372 పెన్షన్లను పంపిణీ చేశామని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న 4,965 పెన్షన్లను కూడా శుక్రవారం పంపిణీ చేస్తామన్నారు.

News August 1, 2024

స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు

image

కర్నూలు నగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. వైసీపీకి చెందిన కార్పొరేటర్లు విక్రమసింహా రెడ్డి, క్రాంతి కుమార్, జుబేర్ అహ్మద్, చిట్టెమ్మ మిద్దె, యూనూస్ బాషా గెలుపొందారు. టీడీపీకి సరైన బలం లేనప్పటికీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఎన్నికలలో నిలబడి ఓటమి పాలయ్యారు.

News August 1, 2024

ఆదోనిలో భారీ కుంభకోణాన్ని బయట పెట్టబోతున్నా: ఎమ్మెల్యే

image

ఆదోనిలో ఓ భారీ కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేస్తానని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆ కుంభకోణం ఏంటో, ఎవరు చేశారో త్వరలోనే తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నియోజవర్గంలో చర్చనీయాంశంగా మారాయి.

News August 1, 2024

కర్నూలు @85.49.. నంద్యాల @86.42%

image

కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పింఛన్ పంపిణీ జోరుగా సాగుతోంది. ఉదయం 10 గంటలకు నంద్యాల జిల్లాలో 86.42, కర్నూల్ జిల్లాలో 85.49 శాతం పంపిణీ పూర్తయింది. నంద్యాల జిల్లాలో 2,19,863 మందికి గానూ 1,90,013 మందికి, కర్నూల్ జిల్లాలో 2,43,337 మందికి గానూ 2,08,029 మంది లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందజేశారు.

News August 1, 2024

పెన్షన్ పంపిణీ చేసిన కర్నూలు జిల్లా కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకను బాధ్యతగా ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులకు సూచించారు. గురువారం కల్లూరు మండలంలోని చిన్నటేకూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. వృద్ధులకు స్వయంగా పెన్షన్ అందజేశారు.