Kurnool

News August 1, 2024

శ్రీశైలానికి సీఎం.. నంద్యాల ఎస్పీ హై అలర్ట్

image

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రానికి ఇవాళ CM చంద్రబాబు రానున్నారు. కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హై అలర్ట్ ప్రకటించారు. 11 సెక్టార్ల పరిధిలో 1100 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా ఇప్పటికే శ్రీశైలం అడవులు అన్నింటినీ జల్లెడ పట్టినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా స్పష్టం చేశారు.

News August 1, 2024

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ఎంపీ బైరెడ్డి శబరి

image

శ్రీశైల భ్రమరంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ రాజగోపురం వద్ద ఈవో పెద్దిరాజు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

News July 31, 2024

35 మంది సీఐలను బదిలీ చేసిన కర్నూలు రేంజ్ డీఐజీ

image

రాయలసీమ రేంజ్ (ZONE- 4) పరిధిలో 35 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 16 మంది సీఐలను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కాగా ఇప్పటికే వీఆర్‌లో ఉన్న ఇద్దరు సీఐలకు పోస్టింగ్ లభించింది.

News July 31, 2024

కర్నూలు జిల్లాకు రూ.250 కోట్లు!

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. రాష్ట్రంలోని 7 జిల్లాలకు రూ.1,750 కోట్లు కేటాయించింది. ఒక్కో జిల్లాకు రూ.250 కోట్లు రానున్నాయి. వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న ఉమ్మడి కర్నూల్ జిల్లాకు కూడా రూ.250 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయనుంది. ఈ నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగించనున్నారు.

News July 31, 2024

కర్నూలు: పింఛన్ల పంపిణీకి రూ.103.54 కోట్లు

image

ఆగస్టు 1న ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని, మొదటి రోజే 96 శాతానికిపైగా పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ రంజిత్ బాషా పింఛన్ల పంపిణీపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాకు రూ.103.54 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు.

News July 31, 2024

వెలుగోడు జలాశయానికి పెనుముప్పు.. కట్టపై భారీ గొయ్యి

image

వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కట్టపై భారీ గొయ్యి ఏర్పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు కట్ట దెబ్బతిన్నా అధికారులు గుర్తించలేదని, ఏదైనా ప్రమాదం జరిగితే భారీ నష్టం జరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వెలుగోడు జలాశయంలోకి శ్రీశైలం జలాలు చేరుతున్నాయి. వెలుగోడు జలాశయ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.136 టీఎంసీల నీరు చేరింది.

News July 31, 2024

ఉదయం 6 గంటలకే ఇంటింటికీ పింఛన్ పంపిణీ: సీఎస్

image

విజయవాడ సీఎస్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. ఉదయం 6 గంటలకే ఇంటింటికీ పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News July 31, 2024

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

నంద్యాల కలెక్టర్ రాజకుమారి మంగళవారం శ్రీశైలం చేరుకున్నారు. ఆగస్టు 1న సీఎం చంద్రబాబు శ్రీశైలం వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. డ్యామ్ అధికారులతో పలు విషయాలపై చర్చించారు. వారితో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఆత్మకూరు ఆర్డీవో దాస్, జిల్లాస్థాయి అధికారులు, పోలీసు అధికారులు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News July 30, 2024

మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన కడప ఆర్జేడీ

image

బేతంచెర్ల: గోరుమానుకొండ సమీపాన మోడల్ స్కూలును కడప ఆర్జెడీ శామ్యూల్ పాల్ మంగళవారం సందర్శించారు. పాఠశాల ఉత్తీర్ణతను, పిల్లల అడ్మిషన్ల ప్రక్రియను, అదనపు తరగతుల నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్ కిట్టుపై విస్తృతంగా చర్చించారు. విద్యార్థుల బట్టలు, బూట్లు, సాక్షులు విషయాల గురించి ఆరా తీశారు. ఇంటర్ విద్యార్థులకు భవిష్యత్ అవకాశాల గురించి ముచ్చటించారు.

News July 30, 2024

భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయండి: ఎస్పీ

image

కర్నూలు జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద శ్రీ ఈరన్న నరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. శ్రావణ మాస ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్వాహకులు, పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఆదోని DSP శివ నారాయణ స్వామి, EO వెంకటేశ్వర్లు, CIలు నాగరాజు యాదవ్, ప్రసాద్, SI నరేంద్ర కుమార్ రెడ్డి పాల్గొన్నారు.