Kurnool

News July 29, 2024

పేరుకే బహుళార్థక సాధక ప్రాజెక్టు.. నిర్వహణకు నిధులు నిల్.?

image

కృష్ణానదిపై నిర్మించిన రెండో అతిపెద్ద ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు.అప్పటి ప్రధాని నెహ్రూ ముందుచూపు ఏపీ తొలి సీఎం నీలం సంజీవరెడ్డి ఆలోచన ఇంజినీర్ల మేథోశక్తి కలగలిపిన అద్భుత కట్టడం. ‘నేడు నిర్వాహణకు కూడా నిధులు లేని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో అరకొర నిధులు మంజూరయ్యాయి. గ్రీజుకు కూడా అధికారులు డబ్బులు పెట్టుకునే దుస్థితి వచ్చింది. లిఫ్ట్ కూడా పనిచేయటం లేదు’ పలువురు విమర్శిస్తున్నారు.

News July 29, 2024

కర్నూలు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

సి.బెళగల్ మండలం కొత్తకోట గ్రామ సబ్ స్టేషన్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిపడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బైక్ ఉంది. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారా లేక హత్య చేసి పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News July 29, 2024

ఆత్మకూరు: వేప చెట్టు నుంచి పాలు

image

వెంకటాపురంలోని ఉర్దూ స్కూల్ సమీపంలో ఆదివారం ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు నుంచి పాలు వస్తుండటంతో ఈ వింతను చూడటానికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. చెట్టు బెరడులో నుంచి పాలు రావడం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాన్ని పలువురు తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చక్కర్లు కొడుతోంది.

News July 29, 2024

కర్నూలు: డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాల విడుదల

image

కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సముద్రాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మొత్తం 2,913 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 851 మంది ఉత్తీర్ణులు అయినట్లు పేర్కొన్నారు. ఫలితాలను https://www.rayalaseemauniversity.ac.inలో చూసుకోవచ్చని తెలిపారు.

News July 29, 2024

రౌడీ షీటర్లకు నంద్యాల ఎస్పీ వార్నింగ్

image

నంద్యాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, డోన్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లు ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు పెడచెవిన పెట్టిన 15 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు.

News July 29, 2024

శ్రీశైలంలో శ్రావణమాసోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

image

శ్రావణమాసోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో పెద్దిరాజు అధికారులను ఆదేశించారు. ఆదివారం శ్రీశైలంలో శ్రావణమాసోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబరు 4వ తేదీ ఉదయం వరకు నిర్వహించే శ్రావణమాసోత్సవాలలో భక్తులు అధికసంఖ్యలో క్షేత్రాన్ని దర్శిస్తారని, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News July 28, 2024

గడివేముల: కొడుకును చూసి వస్తూ తండ్రి మృతి

image

గడివేముల మండలంలో ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఎల్‌కే తండాకి చెందిన రాజునాయక్ తన భార్యతో కలిసి పాణ్యంలో చదువుతున్న కొడుకుని చూసేందుకు బైక్ పై వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో దేవనూరు గ్రామానికి క్రషర్ లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా రావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో రాజునాయక్ భార్య కళ్లెదుటే మృతిచెందాడు. ఘటనపై గడివేముల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News July 28, 2024

నంద్యాల జిల్లాలో చిరుత కలకలం

image

నంద్యాల జిల్లా రుద్రవరం మండలం అప్పనపల్లిలో చిరుత సంచారం కలకలం రేపింది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత శనివారం సాయంత్రం గొర్రెల మందపైన దాడి చేసినట్లు రైతులు, కాపరులు తెలిపారు. వెంటనే రుద్రవరం ఫారెస్ట్ రేంజర్ శ్రీపతి నాయుడి దృష్టికి తీసుకువెళ్లగా, సిబ్బందిని పంపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News July 28, 2024

కర్నూలు: ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఆగస్టు 1న ఉదయం 6 గంటల నుంచి పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని శనివారం రాష్ట్ర సెర్ఫ్ సీఈవో నుంచి జిల్లా డీఆర్డీఏ-వైకేపీ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. మొదటి రోజు 99 శాతం చేయాలని, రెండు రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి. జిల్లాలో మొత్తం 2,43,337 మందికి రూ.103.54 కోట్లు పంపిణీ చేయనున్నారు.

News July 28, 2024

కర్నూలు: IIITDMలో విద్యార్థి సూసైడ్

image

కర్నూలు జగన్నాథగట్టులో ఉన్న IIITDMలో శనివారం బీటెక్ మూడో సంవత్సర విద్యార్థి సాయికార్తీక్ నాయుడు(20) ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మన్యం పార్వతీపురం జిల్లాకు చెందిన వాసి. మధ్యాహ్నం హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి జేబులో సూసైడ్ నోట్ అనుమానాలకు తావిస్తోంది.