Kurnool

News July 28, 2024

కర్నూలు: WOW.. కళ్లు చెదిరే PHOTO

image

తుంగభద్ర పరుగులు పెడుతోంది. కృష్ణమ్మ చెంతకు బిరబిరా పారుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 1,17,632 క్యూసెక్కులు వచ్చి చేరుతుండటంతో జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పర్యాటకుల తాకిడి అధికమైంది. డ్యామ్‌ను రంగు రంగుల విద్యుత్ వెలుగులతో అలంకరించారు. నిన్న రాత్రి తీసిన ఫొటో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

News July 28, 2024

నేటి నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ప్రారంభం

image

నేటి నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కర్నూలులోని సనత్ నగర్ అయాన్ డిజిటల్ కేంద్రంలో డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని, పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్ఓ మధుసూదన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరగనుంది. బేర్ యాక్ట్స్ పుస్తకాలు, గుర్తింపు కార్డులు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.

News July 28, 2024

బ్యాంకాక్‌లో డోన్‌ వాసి కిడ్నాప్‌

image

డోన్‌ (మం) చిన్నమల్కాపురానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మధుకుమార్‌ను బ్యాంకాక్‌లో కిడ్నాప్‌ చేశారని తండ్రి డోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఈనెల 22న చెల్లెలికి ఫోన్‌ చేసి ఉద్యోగానికి 23న బ్యాంకాక్‌ వెళ్తున్నానని చెప్పాడు. 25న తనను కిడ్నాప్‌ చేశారని, రూ.80 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాట్సాప్‌ మెసేజ్ వచ్చింది. తర్వాత నుంచి ఆ ఫోన్‌ స్విచ్ఆఫ్ అయింది.’ అని తండ్రి తెలిపారు.

News July 28, 2024

కర్నూలులో 29న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

ఈ నెల 29న సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News July 27, 2024

బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్‌

image

నంద్యాల జిల్లా వాసి బ్యాంకాక్‌లో కిడ్నాప్ అయినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డోన్ మండలం చిన్న మల్కాపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మధుకుమార్ ఈనెల 22న బ్యాంకాక్ వెళ్లారు. అక్కడ కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, రూ.8 లక్షలిస్తే వదులుతామంటున్నారని 25న మధుకుమార్ తన అక్కకు మెసేజ్ చేశారని తెలిపారు. తర్వాత మధుకుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో డోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News July 27, 2024

కర్నూల్ ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

image

కర్నూల్ ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన జరిగింది. విజయనగరం విద్యార్థి సాయికార్తీక్ తొమ్మిదో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాయికార్తీక్ ఈసీఈ మూడో సంవత్సరం చుదువుతున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

News July 27, 2024

నంద్యాల: నాపరాల ట్రాక్టర్ బోల్తా.. మహిళ దుర్మరణం

image

నాపరాల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడి మహిళ దుర్మరణం చెందిన ఘటన శనివారం జరిగింది. బేతంచెర్ల మండలం బలపాలపల్లె నుంచి పాపసాని కొట్టాల వెళ్లేందుకు ట్రాక్టర్‌లో శశికళ(29) ఎక్కింది. బలపాలపల్లె గ్రామ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. నాపరాలు ఆమెపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది.

News July 27, 2024

నంద్యాల: ‘భార్యను చూడటానికి బస్టాండ్‌లో నిలిపి ఉన్న బస్సు తీసుకెళ్లాడు’

image

భార్యను చూసేందుకు నిలిపి ఉన్న RTC బస్సు తీసుకెళ్లిన ఘటన ఆత్మకూరులో శనివారం తెల్లవారుజామున జరిగింది. ఆత్మకూరు (మం) వెంకటాపురానికి చెందిన దర్గయ్య లారీ డ్రైవర్. విధులకు వెళ్లగా.. భార్య పుట్టినిల్లు ముచ్చుమర్రికి వెళ్లింది. ఇంటికి వచ్చిన దర్గయ్య.. భార్య లేదని తెలిసి ఆత్మకూరు బస్టాండ్‌లో నిలిపి ఉన్న బస్సు తీసుకుని ముచ్చుమర్రికి వెళ్లాడు. అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సు స్వాధీనం చేసుకున్నారు.

News July 27, 2024

కర్నూలు: పింఛన్ల పంపిణీకి రూ.196.42 కోట్లు మంజూరు

image

ఎన్టీఆర్ పెన్షన్ కానుక కింద ఆగస్టు నెలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 4,63,200 పింఛన్లకు రూ.196.42 కోట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 4,69,716 పింఛన్లు ఉండగా.. ఆగస్టు నెలకు వచ్చేసరికి 6,916 పింఛన్లపై కోత పడింది. కర్నూలు జిల్లాలో 2,43,337 పింఛన్లకు సంబంధించి రూ.103.54 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,19,863 పింఛన్లకు సంబంధించి రూ.92.88 కోట్లు మంజూరయ్యాయి.

News July 27, 2024

నంద్యాల: పూర్తిగా జలాధివాసం కానున్న సంగమేశ్వరాలయం

image

కొత్తపల్లి మండలం పరిధిలో కృష్ణా నది తీరాన వెలసిన సంగమేశ్వరాలయం శ్రీశైలం వెనుక జలాలలో శిఖరంతో సహా పూర్తిగా జలాధివాసం కానుంది. తాజాగా కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో సంగమేశ్వరాలయం కృష్ణా నదిలో జలాధివాసమైంది. ఆలయంలో కొలువైన వేపదార శివలింగం దర్శనం 7 నెలల తర్వాత ఉండవచ్చని ఆలయ అర్చకులు తెలకపల్లి గ్రామశర్మ తెలిపారు.