Kurnool

News July 27, 2024

అప్రోచ్ రోడ్డు లేని గ్రామాలను గుర్తించండి: కలెక్టర్

image

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అప్రోచ్ రోడ్డు లేని గ్రామాలను గుర్తించాలని కలెక్టర్ రంజిత్ బాషా పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో R&B, పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్రోచ్ రోడ్డు వేయని గ్రామాలను గుర్తించాలని ఆదేశించారు. ఇందులో రెండు కిలోమీటర్ల లోపు రోడ్లు ఉంటే, వాటిని ఎన్ఆర్ఈజీఎస్ కింద రోడ్లను నిర్మిస్తామని తెలిపారు.

News July 27, 2024

కర్నూలు సబ్‌ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్‌ వేటు

image

కర్నూలు జాయింట్-1 సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. జొహరాపురం రోడ్డులోని 12.59 ఎకరాల వక్ఫ్‌ బోర్డు స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్‌ చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆ శాఖ డీఐజీ కల్యాణి విచారణకు ఆదేశించారు. ప్రవీణ్‌కుమార్‌ ఆ స్థలాన్ని మొత్తం 15 దస్తావేజులు అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తేలడంతో సస్పెండ్‌ చేస్తూ డీఐజీ చర్యలు తీసుకున్నారు.

News July 27, 2024

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్, పాన్‌కార్డు, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయని భయపెట్టి వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారని, ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930, డయల్ 100కు కాల్ చేస్తే పోగొట్టుకున్న డబ్బులను చాలా వరకు తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు.

News July 26, 2024

కర్నూలు మున్సిపల్ కమిషనర్‌గా పి.వి. రామలింగేశ్వర్

image

కర్నూలు నగర పాలక సంస్థలో అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.వి.రామలింగేశ్వర్‌ను నూతన కమిషనర్‌గా నియమించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మునిసిపల్‌శాఖ డైరెక్టర్ హరినారాయణ్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే కర్నూలు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన భార్గవ తేజ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించిన సంగతి విదితమే.

News July 26, 2024

కర్నూలుకు నేరుగా రైల్వే లైన్

image

కర్నూలు, నంద్యాల జిల్లాలను కలుపుతూ అవసరమైన రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే బడ్జెట్‌లో పొందుపరిచారు. దీనికి అనువుగా సిమెంట్ నగర్ నుంచి దూపాడు రైల్వే స్టేషన్ వరకు 47 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తయింది. దీంతో హైదరాబాదు నుంచి కర్నూలుకు వస్తున్న రైళ్లను నంద్యాల వరకు పొడిగించే అవకాశం ఉంది.

News July 26, 2024

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం

image

కర్నూలు-కడప జాతీయ రహదారిలోని శిరివెళ్ల మెట్ట వద్ద శుక్రవారం కూల్ డ్రింక్స్ లోడుతో వెళుతున్న ఆటోకు రోడ్డు ప్రమాదం జరిగింది. కోవెలకుంట్ల నుంచి శిరివెళ్ల వైపు వెళుతున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై శిరివెళ్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

News July 26, 2024

బెంగళూరు నుంచి ఓర్వకల్లుకు విమాన సర్వీస్ పునరుద్దరణ: ఎంపీ శబరి

image

బెంగళూరు-ఓర్వకల్లు విమాన సర్వీస్ పునరుద్దరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఓర్వకల్లు నుంచి గతంలో బెంగళూరుకు సర్వీస్ నడిచేదని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సర్వీస్ రద్దయిందని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించి ఆగస్టు 16 నుంచి ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో ఆ సర్వీస్ నడిచేలా పునరుద్దరించామని తెలిపారు. త్వరలో కర్నూలు-విజయవాడకు సర్వీస్ నడుస్తుందన్నారు.

News July 26, 2024

దేవుడి భూములను ఆక్రమించేశారు అధ్యక్షా..!: గౌరు చరితరెడ్డి

image

ఓర్వకల్లు మండలం శకునాలలోని కాశీ విశ్వేశ్వరస్వామి గుడి భూములను YCP నేతలు ఆక్రమించుకుని మట్టిని తవ్వేసుకున్నారని పాణ్యం MLA గౌరు చరతరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ‘నియోజకవర్గంలోని దేవాలయాలు దూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోని పరిస్థితి ఉంది. మాదవాంజనేయ గుడికి ఉన్న 180 ఎకరాలు రిఎల్ ఎస్టేట్ కోసం ఆక్రమించుకున్నారు. వీటిపై కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలి అధ్యక్షా..’ అని అన్నారు.

News July 26, 2024

ట్రాఫిక్ రద్దీ నియంత్రిణకు ప్రణాళిక రూపొందించండి: కలెక్టర్

image

కర్నూలులో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బళ్లారి చౌరస్తా, హాస్పిటల్, రాజ్ విహార్, తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీకి కారణాలను అధికారులతో చర్చించారు. ఎస్పీ జీ.బిందుమాధవ్ మాట్లాడుతూ.. నగరంలో చాలాచోట్ల సీసీ కెమెరాల్లో విజువల్స్ సరిగ్గా కనిపించడం లేదని, దొంగతనాలను కనిపెట్టేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమన్నారు.

News July 26, 2024

నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించండి: కలెక్టర్

image

జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ డిస్టిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నిరుద్యోగ యువతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించి, వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.