India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రహదారులపై ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా రహదారి భద్రతా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారులపై 51 బ్లాక్ స్పాట్స్ గుర్తించామని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు.
కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 1, 2 తేదీల్లో కర్నూలులో జరిగే సామాజిక చైతన్య శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. గురువారం కర్నూలులో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలకులు మారారు తప్ప, దళితుల పరిస్థితులు మాత్రం మారలేదన్నారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.
పాములపాడు మండలం ఇస్వాలకు చెందిన లింగస్వామిని తెలుగుగంగ కాల్వ వద్ద <<13666742>>హత్య <<>>చేసిన సంగతి తెలిసింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ఆత్మకూరు సీఐ నాగభూషణం తెలిపారు. ఆయన వివరాలు..లింగస్వామి ఓ మహిళతో చనువుగా ఉండటం చూసిన ఆమె బంధువైన బాలుడు ఈ విషయాన్ని రుద్రవరానికి చెందిన మహిళ మరిది శేఖర్కు చెప్పాడు. బాలుడు, శేఖర్, అతని స్నేహితులైన మద్దిలేటి, సందీప్తో కలిసి లింగస్వామిని కత్తితో పోడిచి హత్య చేశారు.
జూపాడుబంగ్లా: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయంలోకి 1,75,448 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో డ్యామ్లో గంట గంటకు నీటిమట్టం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యాంలో 841 అడుగులకు నీటిమట్టం చేరుకోగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లను కృష్ణ జలాలు తాకాయి. శ్రీశైలం డ్యామ్లో 849.80 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు 848.80 అడుగుల నీటిమట్టం నమోదైంది.
జాబ్స్ ఇస్తామంటూ రూ.95లక్షలు మోసంచేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కర్నూలులోని రిచ్మండ్ విల్లాస్కు చెందిన అనూష ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ PSలో బుధవారం కేసు నమోదైంది. ‘హైదరాబాద్కు చెందిన సురేశ్, ధనలక్ష్మీ, సంతోష్ జాబ్స్ ఇస్తామంటూ నమ్మించారు.ఆన్లైన్ శిక్షణ ఇస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షలు తీసుకున్నారు. తనతో పాటు బంధువులు,స్నేహితులు మెుత్తం కలిపి రూ.95 లక్షలు మోసపోయామని’ ఫిర్యాదులో పేర్కొంది.
నంద్యాల జిల్లాలో మైనర్లు, లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే యజమానులకు శిక్ష తప్పదని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. తన ఛాంబర్లో ఎస్పీ మాట్లాడుతూ.. వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని ఆకాంక్షించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపైనే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా 2019 బ్యాచ్ IAS అధికారి సి.విష్ణు చరణ్ కలెక్టరేట్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత కలెక్టరేట్ చేరుకున్న నూతన జేసీ విష్ణు చరణ్కు డీఆర్ఓ పద్మజ స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని JC తెలిపారు.
నంద్యాలలో కరెంట్ షాక్తో న్యాయవాది శివరాం మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. వివరాల ప్రకారం.. నంద్యాలలో న్యాయవాదిగా ఉన్న శివరాం బుధవారం స్నానం చేసేందుకు వాటర్ హీటర్ వేస్తుండగా కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆదోని అరుణ్ జ్యోతినగర్కు చెందిన ఇంతియాజ్ ఆలీ అనే వ్యక్తి తనకు దేవుడు చెప్పాడని మంగళవారం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద తన కుడి చేతిని పెట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని ఎస్సై గోపాల్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
నిఫా వైరస్ పట్ల ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మాట్లాడుతూ..ఐడీ వార్డు బ్లాక్లో 6 పడకలతో గదిని సిద్ధం చేసి నిఫా వైరస్ రోగులకు కేటాయించినట్లు తెలిపారు. దానికి నోడల్ అధికారిగా డా.విద్యాసాగర్ను నియమించినట్లు తెలిపారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు, పీపీఈ కిట్లు, ఎన్ఐవీ మాస్కులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.