India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాలలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 115 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ అధిరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. CIలు రవీంద్ర, దస్తగిరి బాబు పాల్గొన్నారు.
మండల కేంద్రం వెల్దుర్తిలోని 12వ వార్డులో ‘<<13679976>>పేరుకుపోయిన చెత్త<<>>’ అనే శీర్షికతో ఈ రోజు ఉదయం Way2Newsలో వార్త ప్రచురితమైంది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య సిబ్బందితో కాలువలు శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. సమస్యను పరిష్కరించిన అధికారులకు, అందుకు కృషి చేసిన Way2News యాజమాన్యానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
భర్త నుంచి తనను కాపాడాలంటూ నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఓ మహిళ ఫిర్యాదు చేశారు. బనగానపల్లెకు చెందిన ఉప్పరి అన్నపూర్ణ అనే మహిళ భర్త నుంచి తనకు ప్రాణహాని పొంచి ఉందని తెలిపారు. అదనపు కట్నం కోసం తరచూ హింసిస్తుంటే రూ.లక్ష ఇచ్చామని అయినా మరికొంత డబ్బు కావాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల పత్రంపై సంతకం పెట్టాలంటూ తనపై దాడి కూడా చేశాడని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకు ఫిర్యాదు చేశారు.
కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.43 ఉండగా 52 పైసలు తగ్గి నేడు రూ.108.91కు చేరింది. డీజిల్ 48 పైసలు తగ్గి నేడు లీటర్ రూ.96.80గా ఉంది. నంద్యాల జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.76 ఉండగా 33 పైసలు పెరిగి నేటికి రూ.110.09కు చేరింది. 30 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.97.87గా ఉంది.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ క్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు అవసరమైన ప్రాజెక్టులు, వివిధ పనులపై అసెంబ్లీ వేదికగా గళం విప్పేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. రోడ్లకు మరమ్మతులు, పరిశ్రమల ఏర్పాటు, తాగునీటి తదితర సమస్యలను పరిష్కరించేలా జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం <<13679639>>దృష్టికి<<>> తీసుకెళ్లాలని ప్రజలు ఆశిస్తున్నారు.
★ ఆత్మకూరు వద్ద 38.5 కి.మీ మేర అటవీ మార్గం విస్తరణపై దృష్టి పెట్టాలి
★ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తీవ్రంగా సాగు, తాగునీటి సమస్య
★ కొన్ని రహదారుల నిర్మాణాలకు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రతిపాదనలు
★ ఓర్వకల్లులో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు కృష్టి చేయాలి
★ గుండ్రేవుల, ఆర్డీఎస్, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణం
★ కర్నూలులో ఉర్దూ వర్సిటీ నిర్మాణం పూర్తి చేయాలి
★ జిల్లాలోని బస్టాండ్ల ఆధునికీకరణ
ఎన్నికల నేపథ్యంలో కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చిన తహశీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ రంజిత్ బాషా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లాకు వచ్చిన 29 మంది తహశీల్దార్లను సొంత జిల్లాలకు పంపుతూ రిలీవ్ చేశారు. ఆయా మండలాల్లో డిప్యూటీ తహశీల్దారులకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించాలని ఆదేశాలను జారీ చేశారు.
ఎమ్మిగనూరు మండలం కే.తిమ్మాపురానికి చెందిన రైతు రంగన్న(39) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం రాత్రి తన సొంత పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గ్రామస్థులు గమనించి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. రంగన్న 2 ఎకరాలు సొంత భూమితో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు.
కర్నూలులోని మైపర్ ఫార్మసీ కళాశాలలో 2 రోజుల పర్యటన ముగిసిందని కళాశాల డైరెక్టర్ ఆదిమూలపు సతీశ్ తెలిపారు. బెంగళూరులోని NAAC ప్రధాన కార్యాలయం నియమించిన ముగ్గురు సభ్యుల బృందం కాలేజీలోని వివిధ విభాగాలను, ప్రయోగశాలలను, ఆట స్థలాలను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ముగ్గురు అధికారుల బృందం శని, ఆదివారాలలో వివిధ విభాగాల ఫైల్స్ను పరిశీలించారు. NAAC పర్యటన విజయవంతమైందని ఆదిమూలపు సతీశ్ తెలిపారు.
పాములపాడు మండలంలో <<13666742>>హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. ఇస్వాలకి చెందిన ఎర్రన్న గొర్రెల వ్యాపారం చేసేవాడు. శుక్రవారం రాత్రి ఫోన్ వస్తే బయటికి వెళ్లాడు. తిరిగి రాకపోయేసరికి బంధువులతో కలిసి వెతకగా చెలిమిల్ల సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు ఎర్రన్న బైక్ బ్యాగులో ఓ సంచిలో నిమ్మకాయలు, టెంకాయలు గుర్తించారు. దర్యాప్తును దారి మళ్లించేందుకు ఇలా చేసుంటారని అనుమానిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.