India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్లోని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఈ మరణానికి విలువలేదు’ అన్నట్లుగా ఆయన మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆ అధికారిపై తాజాగా చర్యలు తీసుకున్నారు.
కర్నూలులో నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి జడ్పీ సమావేశం ఇది. జిల్లాకు మినీ అసెంబ్లీ లాంటి ఈ సమావేశానికి సమావేశానికి మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలు, వివిధ శాఖలకు రావాల్సిన నిధులు, పేరుకుపోయిన బకాయిలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
జిల్లా ప్రజలు, వైద్య ఆరోగ్య సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి కుష్టు వ్యాధిని నిర్మూలిద్దామని నంద్యాల డీఎంహెచ్వో డాక్టర్ ఆర్.వెంకటరమణ పేర్కొన్నారు. గురువారం వైద్య సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి టెక్కే వరకు కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు.
కర్నూలులో ఉన్న రెండు ప్రధానమైన యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమిస్తూ గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాయలసీమ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్స్లర్గా ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్, డాక్టర్ అబ్దుల్ అక్ష ఉర్దూ యూనివర్సిటీకి కడప యోగి వేమన యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ పటాన్ షేక్ షాషావలి ఖాన్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
రైల్వే డివిజన్ పరిధిలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జులై 21 నుంచి నరసాపూర్ – గుంటూరు ఎక్స్ప్రెస్, గుంటూరు – డోన్ ఎక్స్ ప్రెస్ను నడపనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జులై 22 నుంచి డోన్ – గుంటూరు ఎక్స్ప్రెస్, గుంటూరు-నరసాపూర్ ఎక్స్ ప్రెస్ను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే ప్రయాణికులు గమనించాలని కోరారు.
కర్నూలులో నిన్న <<13648791>>హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. తాడిపత్రికి చెందిన శ్రీరాములు యాచకుడిగా జీవిస్తున్నారు. అదే వృత్తిలో ఉన్న ఫాతిమాతో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉండగా ఒక కూతురు శ్రీరాములు ద్వారా జన్మించినట్లు తెలిసింది. శ్రీరాములు కూతురితో పరశురాం అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. గొడవ జరగ్గా శ్రీరాములిని బండరాయితో కొట్టి పరశురాం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.85 ఉండగా 94 పైసలు తగ్గి నేడు రూ.108.91కు చేరింది. డీజిల్ 87 పైసలు తగ్గి నేడు లీటర్ రూ.96.80గా ఉంది. నంద్యాల జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.89 ఉండగా 20 పైసలు పెరిగి నేటికి రూ.110.09కు చేరింది. 18 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.97.87గా ఉంది.
అల్పపీడనం ప్రభావంతో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు రైతులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్ర అభివృద్ధికి చక్కటి బాటలు వేయాలని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులతో రాష్ట్రంలోని రహదారులను అనుసంధానం చేస్తూ వివిధ దశల్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు, భూ సేకరణ సమస్యలు, నూతనంగా నిర్మించాల్సిన రహదారులపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
కర్నూలు జిల్లా కోసిగిలో బుధవారం చిరుత పులి సంచారం కలకలం రేపింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రాముడు అనే వ్యక్తి గొర్రెల మందను ఏర్పాటు చేసుకున్నాడు. తెల్లవారుజామున చిరుత పులి గొర్రెల మందపై దాడి చేసింది. గమనించిన రాముడు కేకలు వేయడంతో పారిపోయింది. కాగా చిరుత దాడిలో ఒక గొర్రెపిల్ల మృతిచెందింది. చిరుత పులి తరచూ దాడులు చేస్తోందని, తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.