Kurnool

News July 17, 2024

BIG BREAKING: ముచ్చుమరి ఘటనలో CI, SI సస్పెండ్

image

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో వాసంతి కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మిస్సింగ్ కేసు నమోదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను నందికొట్కూరు రూరల్ సీఐ ఓ.విజయ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ ఆర్.జయశేఖర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్.విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు.

News July 17, 2024

నంద్యాల: ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2024 సంవత్సరానికి అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సుధాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. http://nationalawardstoteacher.education.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 17, 2024

కర్నూలు: మరణంలోనూ వీడని స్నేహం

image

ఇద్దరూ స్నేహితులు మరణంలోనూ స్నేహబంధాన్ని వీడలేదు. పత్తికొండ మండలం దూదేకొండ గ్రామానికి చెందిన సురేశ్(18), మణికుమార్(19) పత్తికొండ నుంచి సొంతూరుకు బయలుదేరారు. దూదేకొండ గ్రామ సమీపంలోని సుకాలి నాగమ్మ ఆలయం వద్ద ముందు వెళుతున్న ఎద్దుల బండిని ఢీకొట్టారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుల తెలిపారు.

News July 17, 2024

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించండి: నంద్యాల కలెక్టర్

image

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపాధి మార్గాలను అన్వేషించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఈ విషయమై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ప్రతాపరెడ్డి, జూనియర్ ఎంప్లాయిమెంట్ అధికారి సోమశివారెడ్డి తదితరులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారికి పలు సూచనలు చేశారు.

News July 16, 2024

ప్రాణాలు కాపాడిన గుత్తి ప్రభుత్వ వైద్యులు

image

గుండెపోటుకు గురైన నంద్యాల జిల్లా వ్యక్తికి క్షణం ఆలస్యం చేయకుండా వైద్యం అందించి గుత్తి డాక్టర్లు బతికించారు. డోన్ మండలం కొత్త బురుజుల గ్రామానికి చెందిన చిన్న ఓబులేసు అనంతపురం వెళ్తుండగా గుత్తి సమీపంలో ఛాతీ నొప్పికి గురయ్యారు. వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప గుండెపోటును నివారించే ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించారు.

News July 16, 2024

డేటింగ్ యాప్‌లతో మోసం.. నంద్యాల యువకుడి అరెస్ట్

image

డేటింగ్ యాప్‌లతో యువతులకు వల విసిరి పెళ్లి చేసుకుంటానని మోసాలకు పాల్పడుతున్న నంద్యాల జిల్లా యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సంజామల మండలానికి చెందిన చిన్ని రెడ్డి శ్రీనాథ్ రెడ్డి.. టిండర్, నీతో డేటింగ్ అనే యాప్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని నమ్మించి రూ.6.41 లక్షలు వసూలు చేశాడు. మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బండారం బయటపడింది.

News July 16, 2024

శ్రీశైలం రిజర్వాయర్‌లో గాలిస్తున్నాం: నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహం ఇంకా దొరకలేదని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ తెలిపారు. ‘బాలికను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేశారు. ఆ తర్వాత హత్య చేశారు. మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్‌లో పడేశారు. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేశాం. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌‌లో గాలిస్తున్నాం. మృతదేహం ఇంకా దొరకలేదు’ అని ఎస్పీ తెలిపారు.

News July 16, 2024

శ్రీశైలం ఈవోగా IAS అధికారి.?

image

శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం తదుపరి ఈవోగా IAS అధికారిని నియమించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయం అభివృద్ధి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో IAS అధికారి డా.నారాయణ భరత్ గుప్తా ఈవోగా ఉండగా, ఆయనకు ప్రభుత్వం కమిషనర్ ర్యాంక్ అధికారాలను కల్పించింది. కాగా అత్యధికంగా గ్రూప్-1 ర్యాంక్ అధికారులు ఈవోలుగా పని చేశారు.

News July 16, 2024

కర్నూలు ఎస్పీ ప్రస్థానం

image

కర్నూలు జిల్లా ఎస్పీగా జీ.బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడకు చెందిన బిందుమాధవ్ 2017 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి. SVPNPAలో శిక్షణ తర్వాత మొదట ప్రకాశం జిల్లా గ్రేహౌండ్స్‌లో పని చేశారు. అనంతరం రంపచోడవరం ఏఎస్పీగా, గుంటూరు సెబ్ జాయింట్ డైరెక్టర్‌గా, పల్నాడు అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత గ్రేహౌండ్స్ ఎస్పీగా, పల్నాడు జిల్లా ఎస్పీగా పని చేశారు.

News July 16, 2024

వంద రోజుల్లో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటా: ఎస్పీ

image

100 రోజుల కార్యచరణ ప్రణాళికలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటానని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. అంతకుముందు ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు.