India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవినీతిని బయటపెట్టి తీరుతామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన ప్యాపిలిలో మాట్లాడారు. బుగ్గన అధికారంలో ఉన్నప్పుడు ఆయన అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేశారన్నారు. ఇప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు.
నంద్యాల కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ హాజరు కావాలని ఆమె తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని కార్తీకదీపం సీరియల్ నటి జోష్ణ ఆదివారం దర్శించుకున్నారు. ఆమెకు శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ దేవిని, గురు రాయల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సీరియల్ నటితో ఫొటోలు దిగడానికి ప్రేక్షకులు పోటీపడ్డారు. ఆమెకు శ్రీమఠం సెక్యూరిటీ సిబ్బంది భద్రత కల్పించారు.
నంద్యాలలో ఈ నెల 18, 19న అండర్-19 రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక అవుతారని తెలిపారు.
పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబుకు రెండేళ్లలో మంత్రి పదవి వస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. పత్తికొండలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేఈ శ్యామ్ బాబుకు మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు చోటు కల్పిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్న అధిరాజ్ సింగ్ రాణాను నంద్యాల ఎస్పీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన 2018 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. గతంలో ఆదోని ఏఎస్పీగా అధిరాజ్సింగ్ రాణాకు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న అరగంటలోనే అప్పటి పాలకులు బదిలీ చేయించారు. ప్రస్తుతం నంద్యాలకు ఎస్పీగా రానున్నారు.
కర్నూలు SP కృష్ణకాంత్ నెల్లూరుకు బదిలీ అయ్యారు. ఈయన 2023 ఏప్రిల్ 12న కర్నూలు SPగా వచ్చారు. మొదటి పోస్టింగే అయినా అంతగా ప్రభావం చూపలేదనే విమర్శలు ఉన్నా.. నిత్యం ప్రజల్లో ఉండేవారని, పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేశారనే ప్రసంశలూ అందుకున్నారు. YS వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు కర్నూలుకు వచ్చిన CBI అధికారులకు సహకరించలేదనే విమర్శలున్నాయి.
కర్నూలు జిల్లా కౌతాళం మండలం గుడికంబాలి ఇసుక డిపోకు ఆదివారం సెలవు ఉంటుందని డిపో నిర్వహణ అధికారి, గ్రామ రెవెన్యూ కార్యదర్శి నాగార్జున తెలిపారు. గుడికంబాలి ఇసుక డిపో నుంచి 6వ రోజైన శనివారం 91 వాహనాల్లో 1,334 టన్నుల ఇసుకను విక్రయించినట్లు ఆయన పేర్కొన్నారు. డిపో వద్ద అక్రమంగా ఎత్తుకెళ్లకుండా పోలీసులు కాపలా ఉన్నట్లు వివరించారు.
ఆలూరు నియోజకవర్గంలో చతికిలపడ్డ టీడీపీని బతికించాలని శనివారం నియోజకవర్గానికి చెందిన నేతలు అధిష్ఠానానికి విన్నవించారు. అధినేత చంద్రబాబు, లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసును కలిసి పలు విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వీరభద్ర గౌడ్ స్థానిక నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లకపోవడం వల్లే 2024 ఎన్నికల్లో ఓటమి చెందారని, ఈయన స్థానంలో కొత్త ఇన్ఛార్జిని నియమించాలని కోరినట్లు వారు తెలిపారు.
రాష్ట్రంలో ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా బిందు మాధవ్ను కర్నూలు జిల్లా ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్న కృష్ణకాంత్ను నెల్లూరు జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు.
Sorry, no posts matched your criteria.