Kurnool

News November 25, 2024

టెక్స్ టైల్స్ పార్కు ద్వారా 10 వేల మందికి ఉపాధి: మంత్రి

image

ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్కు ద్వారా 5 వేల నుంచి 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనున్నామని మంత్రి సవిత తెలిపారు. ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కుకు కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఆదివారం ఆమె పరిశీలించారు. స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి కల నెరవేరబోతోందని అన్నారు. గడిచిన ఐదేళ్లలో చేనేత కార్మికులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు.

News November 25, 2024

కర్నూలులో భర్తను హత్య చేసిన భార్య

image

భర్తను భార్య చంపిన ఘటన ఆదివారం కర్నూలులో జరిగింది. కర్నూలు తాలూకా సీఐ శ్రీధర్ మాట్లాడుతూ.. టీవీ9 కాలనీకి చెందిన కరగల్ల చిన్న(25), తన భార్య స్వరూపారాణి రోజూ గొడవపడేవారు. ఆదివారం కూడా గొడవ జరగడంతో ఆగ్రహించిన భార్య ఇనుప రాడ్డుతో భర్త తలపై కొట్టింది. బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి పద్మావతి ఫిర్యాదు మేరకు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు.

News November 25, 2024

ఏపీ సీఎస్ఐఈసీ జాయింట్ సెక్రటరీగా కలెక్టర్

image

ఏపీ సివిల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జాయింట్ సెక్రటరీగా కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన స్పెషల్ జనరల్ బాడీ సమావేశంలో ఏపీ సివిల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించి కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో కమిటీ జాయింట్ సెక్రటరీగా రంజిత్ బాషా ఎన్నికయ్యారు.

News November 25, 2024

అందరూ సమన్వయంతో పని చేయండి: అడిషనల్ ఎస్పీ

image

కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జిల్లా కోర్ట్ కానిస్టేబుళ్లతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 14న జరిగే లోక్ ఆదాలత్‌లో అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. న్యాయశాఖ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

News November 24, 2024

రేపు కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమం: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్, రెవెన్యూ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సునయన ఆడిటోరియంలో నేరుగా బాధితులు వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చు అన్నారు.

News November 24, 2024

ఆదోనిలో ఆటో బోల్తా పడి మహిళ మృతి

image

ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తా పడి బళ్లారికి చెందిన మహంకాళమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. తారపురం ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.

News November 24, 2024

కర్నూలు: కన్నీరు పెట్టిస్తున్న వెల్లుల్లి ధరలు

image

కర్నూలు జిల్లాలో వెల్లుల్లి ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. రకాన్ని బట్టి కిలో రూ.350 -.400పైనే ధర పలుకుతోందంటూ ప్రజలు వాపోయారు. ఇతర రాష్ట్రాలలో వెల్లుల్లి దిగుబడులు భారీగా తగ్గిపోవడంతోనే రేట్లు అమాంతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు కన్నీరు పెట్టించిన ఉల్లి.. కొంత ఉపశమనం కలిగించినా, వెల్లుల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి

News November 24, 2024

నంద్యాల: 143 మంది పోలీస్ సిబ్బంది బదిలీ

image

నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న 143 మంది పోలిస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత, బదిలీల కౌన్సెలింగ్‌లో సూచనలు చేశారు. జిల్లాలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News November 24, 2024

నంద్యాల: 143 మంది పోలీస్ సిబ్బంది బదిలీ

image

నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న 143 మంది పోలిస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత, బదిలీల కౌన్సెలింగ్‌లో సూచనలు చేశారు. జిల్లాలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News November 23, 2024

నంద్యాల: 143 మంది పోలీస్ సిబ్బంది బదిలీ

image

నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న 143 మంది పోలిస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత, బదిలీల కౌన్సెలింగ్‌లో సూచనలు చేశారు. జిల్లాలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.