Kurnool

News November 3, 2024

4న కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమం: కలెక్టర్

image

ఈనెల 4వ తేదీన (సోమవారం) కర్నూలు కలెక్టరేట్లో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని రెవెన్యూ, మున్సిపల్, మండల కార్యాలయాల్లో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా కార్యాలయాల్లో అధికారులు తప్పక పాల్గొని ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు.

News November 3, 2024

కొలిమిగుండ్ల పరిధిలో క్రషర్‌లో పడి యువకుడి మృతి 

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల పరిధిలోని ఓ పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు క్రషర్‌లో పడి ఓ యువకుడు మరణించాడు. అందిన వివరాల మేరకు.. మృతుడు సురేశ్ ఆచారి (25) మెకానికల్ హెల్పర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 3, 2024

జగన్ హయాంలోనే యురేనియం పరిశీలనకు అనుమతులు: తిక్కారెడ్డి

image

కప్పట్రాళ్ల అడవుల్లో యురేనియం తవ్వకాలపై నిరసన వ్యక్తం అవుతుండటంపై జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారెడ్డి స్పందించారు. జగన్ హయాంలోనే యురేనియం పరిశీలనకు అనుమతులిచ్చారని తెలిపారు. నేడు ఆలూరు వైసీపీ నాయకులు రోడ్లెక్కి సీఎం చంద్రబాబుపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నేతల ప్రవర్తన మారలేదని ఆయన విమర్శించారు.

News November 3, 2024

మంత్రాలయంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య

image

మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల వాహనాలతో పోలీసులకు తల నొప్పిగా మారింది. సెలవు రోజులు వచ్చాయంటే భక్తుల సంఖ్యతో వాహనాల రద్దీ పెరిగి పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే తమ వాహనాలను నిలిపేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. శనివారం కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో సీఐ రామాంజులు తమ సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు.

News November 2, 2024

గండ్లేరు రిజర్వాయర్‌లో మృతదేహం లభ్యం

image

నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న గండ్లేరు రిజర్వాయర్‌లో ఆదయ్య(78) మృతదేహం లభ్యమైనట్లు ఏఎస్ఐ భూపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా ఎర్రగుంట్లకు చెందిన ఆదయ్యగా గుర్తించామన్నారు. ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడ్డాడని, మృతుని కుమారుడు వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

News November 2, 2024

చెంచుల జీవన ప్రమాణాల పెంపునకు సర్వే నిర్వహించండి: కలెక్టర్

image

నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని చెంచు గూడెల్లో మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు సర్వే నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. జిల్లాలో 14 మండలాల్లోని 48 చెంచుగూడెల్లో 2,095 కుటుంబాల్లో దాదాపు 8,000 మంది చెంచులు జీవనం సాగిస్తున్నారన్నారు.

News November 2, 2024

ప్ర‌జ‌ల ఆరోగ్యంపై అప్ర‌మ‌త్తంగా ఉండాలి: మంత్రి భ‌ర‌త్

image

ప్ర‌జారోగ్యం పట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మంత్రి టీజీ భ‌ర‌త్ వైద్యారోగ్య శాఖ అధికారుల‌ను ఆదేశించారు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆయ‌న అధికారుల‌తో స‌మీక్షించారు. జిల్లాలోని ఆస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ‌, ప్ర‌జ‌ల‌కు అందుతున్న వైద్య‌సేవ‌ల‌పై ఆరా తీశారు. ప్ర‌జ‌లు డెంగ్యూ, మ‌లేరియా, ఇత‌ర రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు.

News November 2, 2024

గుంతలు పూడ్చే కార్యక్రమంలో CMతో కలిసి పాల్గొన్న మంత్రి బీసీ

image

అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని వెన్నెల పాలెంలో రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి CM చంద్రబాబు ప్రారంభించారు. రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమం కోసం రూ.826 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు CM చంద్రబాబు, మంత్రి బీసీ పేర్కొన్నారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News November 2, 2024

ప్రథమ స్థానంలో కర్నూలు జిల్లా

image

ఎన్టీఆర్ భరోసా పథకం పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో రోజు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు 2,41,029 మంది లబ్ధిదారులకు గాను 2,39,111 మందికి పంపిణీ చేయడంతో 99.2% పూర్తయింది. నంద్యాల జిల్లా పదో స్థానానికి పరిమితమైంది. 2,17,375 మందికి గాను 98.83 శాతంతో 2,14,832 మందికి పంపిణీ చేశారు.

News November 2, 2024

కర్నూలు జిల్లాలోని శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ

image

కార్తీక మాసం సందర్భంగా ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, భోగేశ్వరాలయం, కాల్వబుగ్గ, సంగమేశ్వరం, రుద్రకోడూరులోని క్షేత్రాల్లో కార్తీకమాస మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. వీటితోపాటు అహోబిలం, మంత్రాలయం, ఉరుకుంద క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా శనివారం వేకువజామునే భక్తులు ఆయా ఆలయాలను సందర్శించి కార్తీకదీపాలను వెలిగించారు.