India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి.రూ. 80 లోపు ఉన్న టమోటా ధర ఆదివారం ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్లో సెంచరీ కొట్టింది. టమోటా కేజీ ధర రూ. 100కు చేరుకోవడంతో సామాన్యులు కొనలేక బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి సబ్సిడీ కింద ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్లో సరఫరా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి టీడీపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్గా ఎంపికయ్యారు. దీంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మొదటిసారి నంద్యాల నుంచి గెలిచిన ఆమెకు ఈ అవకాశం ఇవ్వడంతో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
సికింద్రాబాద్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన కే.వీరనాగులు (46) స్థానికంగా కూలీ పనులు చేస్తూ భార్యాపిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. సరైన ఉపాధి లేక మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఎంఎంటీఎస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం కుటుంబసభ్యులకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు.
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదోని ఆర్ఎస్ యార్డు వద్ద శనివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ గోపాల్ తెలిపిన వివరాల మేరకు రైల్వే ట్రాక్ 494/38 లైన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలిపారు.ఆచూకీ తెలిసిన వారు 9849157634 నంబరుకు కాల్ చేసి వివరాలు తెలపాలని కోరారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జీ.సృజన కర్నూలు జిల్లా తొలి మహిళా కలెక్టర్గా రికార్డు సృష్టించారు. కర్నూలు జిల్లా ఆవిర్భావం నుంచి ఇక్కడ మగవారే కలెక్టర్లగా నియమితులవుతూ వస్తున్నారు. ఇప్పటివరకు 54 మంది కలెక్టర్లుగా పని చేయగా, అందరూ పురుషులే. 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన గుమ్మళ్ల సృజన తొలి మహిళా కలెక్టర్గా సేవలందించారు.
తనపై చిరుత పులి దాడి చేసిందని శనివారం ఓ మహిళ ఆరోపించారు. నంద్యాలలోని పచ్చర్ల గ్రామంలో షేక్ బీబీ అనే మహిళ తన ఇంట్లో నిద్రిస్తుండగా, చిరుత పులి అకస్మాత్తుగా వచ్చి తల భాగంపై దాడి చేసిందని, ఆమె కేకలు వేయడంతో సమీపంలోని అడవి ప్రాంతంలోకి పారిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డయేరియా వ్యాధి ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కర్నూలు కలెక్టర్ డా.సృజన వైద్య, సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తరచూ RWS శాఖ అధికారులు నీటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డయేరియా నివారణలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వర్షాల వల్ల డయేరియా, డెంగ్యూ, మలేరియా, తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇప్పటి వరకు కర్నూలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన డా.సృజన తనదైన మార్క్ వేశారు. గత ఎడాది ఏప్రిల్ 11న బాధ్యతలు చేపట్టిన సృజన దాదాపు 15 నెలలపాటు కలెక్టర్గా సేవలందించారు. కాగా కలెక్టర్ హోదాలో సృజనకు కర్నూలు జిల్లా తొలి పోస్టింగ్. గతంలో ఆమె తండ్రి బలరామయ్య కూడా ఇదే జిల్లా కలెక్టర్గా సేవలందించారు. తండ్రికి తగ్గ కుమార్తెగా సృజన కర్నూలు జిల్లాను అభివృద్ధిలో తనదైన పరిపాలనతో పరుగులు పెట్టించారు.
కర్నూల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన బదిలీ అయ్యారు. ఆమెను ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా నియమించింది. జిల్లాకు కొత్త కలెక్టర్గా పి.రంజిత్ బాషాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ప్రస్తుతం బాపట్ల జిల్లా కలెక్టర్గా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. కర్నూలు, నంద్యాల ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, పలువురు ఎంపీలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎంపీలకు బాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశం సందర్భంగా ఎంపీలు మంత్రి నారా లోకేశ్ను సత్కరించారు.
Sorry, no posts matched your criteria.