India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జులై 1 నుంచే పింఛన్ పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ లెక్కన అవ్వతాతలకు జులై 1న ₹7 వేల పింఛన్ అందనుంది. ఈ పెంపుతో కర్నూలు జిల్లాలో సుమారు 2.45 లక్షలు, నంద్యాల జిల్లాలో 2.24 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 4.69 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
నంద్యాలలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఫొటోల గొడవ జరిగింది. నంద్యాలలోని 29వ సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఫొటోలు పెట్టడానికి వెళ్లిన టీడీపీ నాయకులకు మున్సిపల్ ఛైర్పర్సన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఛైర్పర్సన్ తనపై దుర్భాషలాడారని టీడీపీ నాయకుడు సుబ్బారాయుడు పేర్కొన్నారు. మరోవైపు సచివాలయానికి పనిపై వెళ్తే తనను అవమానించారని ఛైర్పర్సన్ మాబున్నిసా ఆవేదన వ్యక్తం చేశారు.
సభాపతి స్థానానికి ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి రోడ్డు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో అక్రమ కేసుల బాధను తాను అనుభవించానన్నారు. అరెస్ట్చేసి 32రోజులు జైలు పెట్టినప్పుడు జరిగిన అవమానాలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఎలా ఉంటాయో తెలుసనన్నారు. ఎన్ని కేసులు, ఇబ్బందులు పెట్టినా పోరాడిన అయ్యనపాత్రుడి రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు.
తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల(D) రాజోలి ప్రాంత వాసులు ఆంధ్రా సరిహద్దుల్లో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. మా ప్రాంతంలో చేస్తున్నామని రాజోలి వాసులు..ఏపీ సరిహద్దులో జరుగుతున్నాయని అధికారుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులు రాజోలి వద్ద రవాణా చేస్తున్న 51ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఫైన్ వసూలుచేసి ట్రాక్టర్లు విడుదల చేసినట్లు తెలిపారు.
తుగ్గలి మండలం జొన్నగిరిలో శుక్రవారం వజ్రం లభ్యమైంది. జొన్నగిరికి చెందిన ఒక రైతు తన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని గ్రామానికే చెందిన వ్యాపారస్థుడు రూ.2.8 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు మండలంలో ఈ సంవత్సరం 40వజ్రాలకు పైగా దొరికాయి. వర్షం పడితే వజ్రాల కోసం ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వస్తుంటారు.
మహానంది పుణ్యక్షేత్రంలోని పార్వతిపురం టోల్గేట్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. చిరుత సంచారంతో భక్తులు, గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోసారి చిరుత సంచారంతో ఆ మార్గంలో నడిచే భక్తులు, స్థానికులు భయపడుతున్నారు. వారం రోజులుగా చిరుత పులి మహానందిలో సంచరిస్తోందని, టోల్గేట్ సమీపంలో చిరుత పులి రోడ్డు దాటుతుండగా చూశామని అక్కడి స్థానికులు తెలిపారు.
మద్దికేర మండల కేంద్రానికి చెందిన పారా రాజేంద్ర కుమార్, సుమలత దంపతుల కుమార్తె పారా షారోన్ గత నెలలో నిర్వహించిన ఆల్ ఇండియా శ్రేష్ట పరీక్షలో 75వ ర్యాంకుతో మంచి ఫలితాలను సాధించింది. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. వీరి తండ్రి ప్రభుత్వ చౌక దుకాణం డీలర్గా ఉన్నారు. తల్లి మాజీ వాలంటీర్. కూతురి ఇష్టం మేరకే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయించామని తల్లిదండ్రులు తెలిపారు.
డోన్ ఎమ్మెల్యేగా కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డిగా ప్రమాణం స్వీకారం చేశారు. అసెంబ్లీలో ఆయన చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. కాగా ఆయన మెుదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇవాళ ఏడుగురి తొలసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.
☞డోన్ ఎమ్మెల్యేగా కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి
☞కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్
☞పత్తికొండ ఎమ్మెల్యేగా కేఈ శ్యాంబాబు
☞ కోడుమూరు ఎమ్మెల్యేగా బొగ్గుల దస్తగిరి
☞నందికొట్కూరు ఎమ్మెల్యేగా గిత్తా జయసూర్య
☞ఆదోని ఎమ్మెల్యేగా పీవీ పార్థసారథి
☞ఆలూరు ఎమ్మెల్యేగా విరుఫాక్షి
పగిడ్యాల మండలంలో పనిచేసిన ఎస్సై మారుతీ శంకర్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి దివ్య గురువారం తీర్పునిచ్చారు. ఘనపురంలో 2015లో నరేంద్రరెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించారు. కేసు విచారణ నిమిత్తం పోలీస్స్టేషన్కు రావాలని నరేంద్రరెడ్డిని ఎస్సై పిలవగా వారెంట్ ఉంటేనే వస్తానని చెప్పాడు. దీంతో ఎస్సై కోపంతో దాడిచేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు.
Sorry, no posts matched your criteria.