India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళావెంకట్రావు భవన్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో గురువారం జిల్లా అభ్యర్థుల సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి షర్మిల వివరించారని ఆ పార్టీ ఆదోని ఇన్ఛార్జ్ రమేశ్ యాదవ్ తెలిపారు. కర్నూలు ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్ ఉన్నారు.
విద్యతోనే గిరిజనల అభివృద్ధి సాధ్యమని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాముఖ్యం ఇస్తోందని ఎస్టీ కమిషన్ సభ్యుడు వాడిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు. గురువారం కర్నూలులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. జిల్లా పర్యటనలో గిరిజనుల నుంచి కొన్ని విజ్ఞాపనలు వచ్చాయని తెలిపారు.
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని సినీ నిర్మాత యుగంధర్ గౌడ్ తన సహచరులతో కలిసి దర్శించుకున్నారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మంగళ హారతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సుమన్ తేజ, గరీమ చౌహాన్ హీరో, హీరోయిన్లుగా నిర్మించిన ‘సీతా కళ్యాణ వైభోగమే’ చిత్రం శుక్రవారం విడుదల కానుందని, స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు.
చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామానికి చెందిన చంద్రమౌళి(45) గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కరణాలు తెలియాల్సి ఉంది.
వెల్దుర్తి మండలం చెరుకులపాడులో టీడీపీ కార్యకర్త కొమ్ము రామాంజనేయులు(62) చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. 8 రోజుల
కిందట చెరుకులపాడులో కుక్క కాటుకు గురయ్యాడని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని తెలిపారు. మృతుడి కుటుంబాన్ని రైతు సంఘం అధ్యక్షుడు ఈదుల వెంకటరాముడు పరామర్శించారు.
పోలీస్ స్టేషన్ SHOల ద్వారా తమ సమస్య పరిష్కారం కాకపోతే ఫిర్యాదుదారుడు నేరుగా తనకు ఫోన్ చేయొచ్చు అని నంద్యాల జిల్లా ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి తెలిపారు. 9154987020కు కాల్ లేదా వాట్సాప్ ద్వారా వివరాలు తెలిపి తమ సమస్యకు పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. కాగా మొదట SHO వద్దకు వెళ్లాలని, అక్కడ పరిష్కారం కాకపోతేనే తనకు ఫోన్ చేయాలని ఎస్పీ తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని స్థానిక దిన్నెదేవరపాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో పార్ట్ టైం టీచర్ల భర్తీకి గురువారం డెమో నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఈబ్ల్యూఆర్ఐఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీకి ఇప్పటికే అర్హులైన (టెట్, బీఎడ్, పీజీ/ సంబంధిత మెథడాలజీ ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు.
కర్నూలు జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఆదోని ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ సీఐ తేజోమూర్తి వైఎస్సార్ జిల్లా చిన్న చౌక్ స్టేషన్కు, ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్లోని కంబగిరి రాముడు కర్నూలు సీపీఎస్కు బదిలీ అయ్యారు. చచిన్న చౌక్ పీఎస్ సీఐ భాస్కర్ రెడ్డి, ఖాజీపేట అర్బన్ సీఐ రామాంజనేయులును కర్నూలు రేంజ్ వీఆర్కు పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు కర్ణాటక రాష్ట్రానికి అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మారుతి సాంబ్రాణి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి మఠం సహాయ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి స్వాగతం పలికారు. అనంతరం మంచాలమ్మ దేవికి విశేష కుంకుమార్చన నిర్వహించారు. గురురాయల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని ముక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం శ్రీమఠంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.7,476 పలికింది. మంగళవారంతో పోలిస్తే పత్తి ధర స్వల్పంగా రూ.20 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పత్తి కనిష్ఠ ధర రూ.4,002గా ఉంది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.6,246, కనిష్ఠ ధర రూ.4,169 పలికింది. ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,200, కనిష్ఠ ధర రూ.4,560 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.