Kurnool

News June 19, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

ఈ నెల 21న కర్నూలులోని సీ-క్యాంప్‌లో ఉన్న ఉపాధి కల్పనా కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి పీ.దీప్తి తెలిపారు. ఈ జాబ్ మేళాలో మూడు ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని పేర్కొన్నారు. ఎంపికైన వారికి జీతం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుందని తెలిపారు.

News June 19, 2024

జోనల్ స్థాయి స్కేటింగ్ పోటీలకు కర్నూలు జిల్లా క్రీడాకారుల ఎంపిక

image

ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న జోనల్ స్థాయి స్కేటింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు స్కేటింగ్ సంఘం ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ బుధవారం తెలిపారు. జోనల్ పోటీలకు.. జయంత్, శృతిక్, మాన్వి శ్రీ, సాహితీ, జశాంక్ ఆర్య, సాయి దతేశ్ ఎంపికయ్యారు. కోశాధికారి అబూబకర్, స్కేటింగ్ అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులను అభినందించారు.

News June 19, 2024

కర్నూలు: యువకుడి దారుణ హత్య

image

ఆత్మకూరు(M) కురుకుందకు చెందిన ఖాదర్‌వలి హత్యకు గురయ్యాడు. సీఐ లక్ష్మీనారాయణ వివరాలు.. ఈనెల 16న కురుకుందకు చెందిన ఫారుక్, కృష్ణాపురానికి చెందిన ముర్తుజావలి హైదరాబాద్ నుంచి ఆత్మకూరుకు బస్సుల్లో వస్తుండగా డ్రైవర్ పక్కన కూర్చొనే విషయంలో గొడవపడ్డారు. 17న ఫారుక్ కురుకుందలో ఉన్నాడని తెలుసుకుని ముర్తుజావలి తన మిత్రులతో(ఖాదర్)కలిసి వెళ్లి వాగ్వాదానికి దిగారు. గొడవలో ఖాదర్‌ని కత్తితో పొడవడంతో చనిపోయాడు.

News June 19, 2024

ఎమ్మిగనూరు: ఆటో బోల్తాపడి.. బాలిక మృతి

image

ఆటో బోల్తాపడి బాలిక మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలు..గోనెగండ్లకు చెందిన రహంతుల్లా కుటుంబంతో కలిసి తన సోదరి భానును చూసేందుకని ఎమ్మిగనూరు వచ్చారు. ఈ క్రమంలో రహంతుల్లా పెద్ద కూతురు ఆల్పీషా(12)ను తీసుకుని భాను మార్కెట్‌కి వెళ్లింది. పని ముగించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా ఎమ్మిగనూరు ఎద్దుల మార్కెట్ వద్ద ఆవులు అడ్డంగా వచ్చాయి.తప్పించబోయి ఆటో బోల్తా పడటంతో ఆల్పీషా మృతిచెందింది.

News June 19, 2024

కర్నూలు: టమాటా పంపిణీకి చర్యలు

image

కర్నూలు నగరంలోని సి.క్యాంప్ రైతుబజార్‌లో టమాటా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు నారాయణమూర్తి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో టమాట కిలో ధర రూ.70 నుంచి రూ.80 వరకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో మదనపల్లి నుంచి టమాట కొనుగోలు చేసి సి.క్యాంప్ రైతుబజార్‌లో వినియోగదారులకు నో లాస్ .. నో గెయిన్ కింద పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

News June 19, 2024

రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం: ఎమ్మెల్యే జయసూర్య

image

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. మంగళవారం అల్లూరు గ్రామం మాండ్ర శివానందరెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో రైతులకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. సబ్సిడీల ద్వారా రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

News June 18, 2024

కర్నూల్: 4.29 లక్షల మంది రైతులకు రూ.2 వేలు జమ

image

పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదలయ్యాయి. జిల్లాలోని రైతులకు రూ.2 వేలు చొప్పున అకౌంట్లలో జమకానుంది. కర్నూలు జిల్లాలోని 2.34 లక్షల మంది రైతులకు రూ.46.97 కోట్లు, నంద్యాల జిల్లాలోని 1.95 లక్షల మంది రైతులకు రూ.39.19 కోట్ల మేర సాయం అందనుంది. లబ్ధిదారుల లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఈ లింక్ <>క్లిక్<<>> చేసి చూసుకోవచ్చు.

News June 18, 2024

పంట నష్టాన్ని నివేదించండి: నంద్యాల జిల్లా కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో గత సంవత్సరం రబీ సీజన్‌లో పంట నష్టపోయిన వివరాలను ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీంకు స్పష్టంగా నివేదించాలని జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన చాంబర్లో కేంద్ర కరువు బృంద పర్యటనపై జెసి టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

News June 18, 2024

ప్రకృతి అందాల్లో మహానంది

image

దట్టమైన నల్లమల అడవుల్లో వెలిసిన మహానంది క్షేత్రం మహదానందానికి నిలయం. కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఆలయ పరిసరాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. భక్తులు నల్లమల అందాలు చూసి పరవశించిపోతున్నారు. ఆలయం వెనుకవైపు నల్లమల పచ్చగా కనిపిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తోంది. పక్షుల కిలకిలారావాలు, నల్లమల పచ్చటి అందాలకు పొగమంచు తోడవడంతో మహానంది ఊటీ అందాలను తలపిస్తోందంటూ భక్తులు కామెంట్ చేస్తున్నారు.

News June 18, 2024

కర్నూల్: ఎన్నికల వేళ రాజీనామా.. ఖాళీలు ఎన్నంటే?

image

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో వాలంటీర్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు వందల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తీరా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలంటూ రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 4806 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.