Kurnool

News June 17, 2024

టీడీపీలోకి వెళ్లడంపై స్పందించిన ఆలూరు ఎమ్మెల్యే

image

ఎమ్మెల్యేగా గెలిపించిన జగన్‌ను కాదని పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆలూరు ఎమ్మెల్యే విరూఫాక్షి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లడానికి తన ఆత్మసాక్షి ఒప్పుకోదని పేర్కొన్నారు. పార్టీ మారుతున్నట్లు పత్రికల్లో వస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వదంతులు నమ్మెుద్దని ప్రజలను కోరారు.

News June 17, 2024

కర్నూలు: పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి

image

పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తుగ్గలి మండలం రామలింగాయపల్లి సమీపంలో ఆ గ్రామానికి చెందిన నలుగురు కొండలో గొర్రెల మంద వద్ద కాపలాగా ఉండగా పిడుగు పడింది. ఈ ఘటనలో కామేశ్వరి(35), సుంకన్న(47) మృతిచెందగా.. మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. వారి మృతదేహాలను ఇతర కాపారులు గ్రామానికి తీసుకువచ్చారు.

News June 17, 2024

శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం

image

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతమైన తుంగభద్ర నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 6,560 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అదే సమయానికి జలాశయ నీటిమట్టం 812.20 అడుగులుగా ఉంది. నీటి నిలువ సామర్థ్యం 35.6294 టీఎంసీలు ఉంది.

News June 17, 2024

హాలహర్వి: విద్యుత్ తీగలు తగిలి వివాహిత మృతి

image

హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే ఆదివారం లక్ష్మీ అనే వివాహిత పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

News June 16, 2024

హాలహర్వి: విద్యుత్ తీగలు తగిలి వివాహిత మృతి

image

హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే ఆదివారం లక్ష్మీ అనే వివాహిత పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

News June 16, 2024

మద్దిలేటిస్వామి కోనేరులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

image

బేతంచెర్ల వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి ఆలయంలోని కోనేరులో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గద్వాల మండలం వడ్డేపల్లికి చెందిన కురువ మహేశ్ (34) అనే వ్యక్తి మద్దిలేటి స్వామి దర్శనం కోసం శనివారం మద్దిలేటి స్వామి ఆలయానికి వచ్చారు. ఈ రోజు10 గంటల సమయంలో కోనేరులో ఈతకు వెళ్లాడు. గుంత ఉండడంతో అందులో మునిగి కనిపించలేదు. ఆదివారం ఉదయం మృతదేహం బయటపడింది.

News June 16, 2024

ఆదోనిలో సినీ నటుడు సుమన్ సందడి

image

ఓ కాటన్ షాపు ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి సినీ నటుడు సుమన్ ఆదివారం ఆదోనిలో పర్యటించారు. పట్టణంలోని కేవీఆర్ కాలనీలో కాటన్ షాపును ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదోని భవిష్యత్తు పూర్తిగా మారుస్తానని, పెద్దల సహకారంతో పరిశ్రమలను తీసుకొస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

News June 16, 2024

18న యోగా పోటీలు: అవినాశ్ శెట్టి

image

పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 18న కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలోని యోగా హాలులో జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం కార్యదర్శి అవినాశ్ శెట్టి తెలిపారు. 8-10 ఏళ్ల వయసు, 10-12, 12-14, 14-16, 16-18 ఏళ్ల వయసు వారికి విభాగాల వారీగా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9247400100 ఫోన్ నంబర్‌కు సంప్రదించవచ్చు అన్నారు.

News June 16, 2024

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో క్షుద్ర పూజలు?

image

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డు సమీపాన నిమ్మకాయలు, రంగు దారాలు, పసుపు, కుంకుమ చల్లి క్షుద్ర పూజలు నిర్వహించారు. విషయం తెలిసి ఆసుపత్రి సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. రోగులకు నయం కావాలని పూజలు చేశారా?, వ్యాధి నయమై ఇంటికెళ్లే సమయంలో చేశారా? లేక నిజంగానే క్షుద్ర పూజలు చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

News June 16, 2024

కర్నూలు పెద్దాసుపత్రిలో మురుగు.. రోగుల అవస్థలు

image

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు విభాగం ఎదుట మురుగు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి మురుగు తిష్ట వేయడంతో దోమలు బెడదతో అల్లాడిపోతున్నట్లు రోగులు వాపోతున్నారు. దీని పక్కనే రోగులకు ఆహారం అందిస్తున్నా మురుగును అరికట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.