India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 23న ఉమ్మడి జిల్లాల హాకీ ఎంపిక పోటీలు నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి దాసరి సుధీర్ శనివారం తెలిపారు. 1.1.1995 తర్వాత జన్మించినవారు అర్హులన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన వారు ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు ధర్మవరంలో జరిగే 14వ సీనియర్ పురుషుల హాకీ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.
ఎమ్మిగనూరులో శనివారం సాయంత్రం NH167 హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు ఎమ్మిగనూరు మండలం గుడికల్కి చెందిన శివ, మరొకరు నందవరం మండలం హాలహర్వికి చెందిన గురుస్వామిగా గుర్తించారు. శివ చదువుకుంటూ ఉండగా, గురుస్వామి ఓ బేకరీ షాప్లో పనిచేస్తున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రమాదంలో యువకుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఉండటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈనెల 19, 20వ తేదీల్లో కేంద్ర కరువు బృందం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు తెలిపారు. అధికారులందరూ కరవు బృందానికి కరవు తీవ్రత విషయాలను వివరంగా తెలియజేయాలని సూచించారు . ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించే కరువు బృందానికి తీవ్రత తెలియజేసే ఫోటోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అధికారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా నీరు వచ్చి చేరుతోంది. శనివారం తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి 15,131 క్యూసెక్కులు చేరాయి. అదే సమయానికి జలాశయ నీటిమట్టం 810.90 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 34.8332 టీఎంసీలుగా ఉంది. ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిస్తే అనుకున్న మేరకు నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉంది.
చిప్పగిరి మండలంలో ఎంఈఓ-2 బాలనాయుడు శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. బాలనాయుడు బళ్లారి పట్టణంలో నివాసం ఉంటూ చిప్పగిరిలో ఎంఈఓ-2గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం రోజు మాదిరిగానే చిప్పగిరికి ఇంటి దగ్గర నుంచి వస్తుండగా గుండె నొప్పితో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన స్వస్థలం ఆళ్లగడ్డ కావడంతో మృతదేహాన్ని ఆళ్లగడ్డకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని శ్రీశైలం డ్యాం సమీపంలో శనివారం చిరుత పులి మృతిచెందింది. దోమలపెంట రేంజర్ గురుప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. నల్లమల అటవీ ప్రాంతంలో అడవి జంతువుల దాడిలో ఓ మగ చిరుత పులి మృతిచెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు పేర్కొన్నారు.
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పంట ఉత్పత్తుల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మార్కెట్కు 104 క్వింటాళ్ల వేరుశనక్కాయల దిగుబడులు రాగా.. క్వింటా కనిష్ఠ ధర రూ.4,929, మధ్యస్థ ధర రూ.6,371, గరిష్ఠ ధర రూ.7,200 పలికింది. 318 క్వింటాళ్ల వాము దిగుబడులు రాగా.. క్వింటా కనిష్ఠ ధర రూ.711, మధ్యస్థ ధర రూ.17,501, గరిష్ఠ ధర రూ.20,160 పలికినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు.
కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ సుధీర్ ప్రేమ్కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాన్వకేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు గమనించాలని కోరారు.
నిరుద్యోగులకు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి దీప్తి పేర్కొన్నారు. సీ.క్యాంపులోని కార్యాలయంలో వివిధ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించారు. ఇనోవిజన్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్రై. లిమిటెడ్, జియో టవర్స్, నవభారత్ ఫర్టిలైజర్స్, అమర్ రాజా కంపెనీల వారు హాజరయ్యారు. మొత్తం 197 మంది హాజరు కాగా.. 64 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు.
ముస్లింల బక్రీద్ పండగ పురస్కరించుకొని పొట్టేళ్లకు భలే గిరాకీ ఏర్పడింది. ధరలు ఒక్కసారిగా అధికమయ్యాయి. ఆదోని సంతలో శుక్రవారం జత పొట్టేళ్ల ధర ఏకంగా రూ.1.10 లక్షలు పలికింది. వీటిని ఆదోని పట్టణం మేతర్ మసీదు ప్రాంతానికి చెందిన ఖాజా, ఖురేషి ఇబ్రహీం కొనుగోలు చేశారు.
Sorry, no posts matched your criteria.