Kurnool

News July 13, 2024

15 సూత్రాల పథకం పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్

image

మైనార్టీ సంక్షేమంలో భాగంగా ప్రధాని 15 సూత్రాల పథకం సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మైనార్టీ సంక్షేమాధికారిని కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఆదోని ప్రాంతంలో ఐటీఐ కళాశాల భవనం పూర్తైనా టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖ స్వాధీనం చేసుకోలేదని, నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే దీనిపై డీవో లెటర్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

News July 13, 2024

కర్నూలు: డీఎస్సీ ఉచిత శిక్షణ

image

డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారిత అధికారిణి వెంకటలక్ష్మి తెలిపారు. DED, TTC, TETలో అర్హత సాధించిన BC, SC, ST, మైనార్టీ అభ్యర్థులు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కర్నూలులోని BC స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు. 60 రోజుల పాటు ఇచ్చే శిక్షణ కాలంలో ఉచిత మెటీరియల్, ఉపకార వేతనం సైతం ఇవ్వనున్నట్లు చెప్పారు.

News July 13, 2024

ఒడిశా సీఈఓగా నంద్యాల జిల్లావాసి

image

నంద్యాల జిల్లా అవుకు మండల పరిధిలోని మన్నేనాయక్ తండాకు చెందిన 2009 బ్యాచ్‌ IAS అధికారి డా.ఎన్.తిరుమల నాయక్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక భాద్యతలు అప్పగించింది. ఒడిశా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఆయనను ఈసీ నియమించింది. ఒడిశాలోని పలు జిల్లాల కలెక్టర్, డైరెక్టర్, కమిషనర్ వంటి హోదాల్లో ఆయన పని చేశారు. కాగా గతంలో సంజామల ప్రభుత్వ పశు వైద్యశాల పశువైద్యాధికారిగా తిరుమల నాయక్ సేవలందించారు.

News July 13, 2024

సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై నివేదిక ఇవ్వండి: కర్నూలు కలెక్టర్

image

జిల్లాలోని అన్ని సంక్షేమ శాఖల హాస్టళ్లలో అవసరమైన మరమ్మతులు, అదనపు గదులు, టాయ్లెట్లపై అంచనాలను రూపొందించి వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. హాస్టళ్లలో ఖాళీలు లేకుండా హేతుబద్ధతతో అడ్మిషన్స్ పూర్తి చేయాలన్నారు.

News July 13, 2024

విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలి: కర్నూలు కలెక్టర్

image

ప్రభుత్వ హాస్టళ్లలో చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా హాస్టల్ వార్డెన్లు చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో సమీక్షించారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకట లక్ష్మమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News July 12, 2024

తెలంగాణ సీఈవోగా కర్నూలు మాజీ కలెక్టర్‌

image

ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ కలెక్టర్‌ సీ.సుదర్శన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)గా ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కాగా 2012 నుంచి 2014 వరకు సుదర్శన్ రెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. ఇప్పటివరకు TG సీఈఓగా ఉన్న వికాస్ రాజ్ కూడా గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.

News July 12, 2024

జనసేన పార్టీ నాయకులు వర్గ విభేదాలు వీడండి: లక్ష్మన్న

image

జనసేన నాయకులు వర్గ విభేదాలు వీడాలని జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ లక్ష్మన్న కోరారు. మంత్రాలయంలోని పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు వర్గ విభేదాలు వీడి కలిసికట్టుగా పార్టీ అభ్యున్నతి కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. అధిష్ఠానం మేరకే 4 మండలాల అధ్యక్షులను నియమించామని పేర్కొన్నారు.

News July 12, 2024

నంద్యాల-ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై భారీ కంటైనర్ బోల్తా

image

నంద్యాల-ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై ఎర్రగుంట్ల సమీపంలో గురువారం తెల్లవారుజామున భారీ కంటైనర్ బోల్తా పడింది. కడప వైపు వెళ్తుండగా ఎర్రగుంట్ల వద్దకు రాగానే అదుపు తప్పి రహదారిపై పడింది. ఆ సమయంలో రహదారిపై ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

News July 12, 2024

కర్నూలు: ఉద్యోగ మేళాలో 37 మంది ఎంపిక

image

నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి పేర్కొన్నారు. గురువారం ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. అనంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్ చిట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. మేళాకు 74 మంది హాజరు కాగా.. అందులో 37 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.

News July 12, 2024

డిగ్రీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

కర్నూలు: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల హానర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు రిజిస్ట్రార్ బాయినేని శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. https:///oamdc-apsche.aptonline.in /OAMDC202425/Index ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఆగస్టు 1వ తేదీ లోపు రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు.