Kurnool

News July 8, 2024

పాప ఆచూకీ తెలిసినవారు మాకు తెలియజేయండి : ఎస్ఐ జయశేఖర్

image

ఎనిమిదేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన ఆదివారం జరిగింది. ఎస్సై జయశేఖర్ వివరాలు..పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 8ఏళ్ల చిన్నారి వాసంతి ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటికి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ముచ్చుమర్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన కేసు నమోదు చేసుకొని పాప కోసం గాలిస్తున్నారు. పాప ఆచూకీ తెలిసినవారు పోలీసుస్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

News July 8, 2024

కర్నూలు: వెబ్సైట్‌లో ఇసుక నిల్వల వివరాలు

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ఇవాళ నుంచి ఉచిత ఇసుక విధానం అమలవుతోంది. వినియోగదారులు ఇసుక సమాచారం వివరాలు https://www.mines.ap.gov.in/permit/ అనే వెబ్సైట్‌లో చూసుకోవాలని జిల్లా గనులు, భూగర్భ శాఖ ఉప సంచాలకులు రాజశేఖర్ తెలిపారు. ఇసుక స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎంత నిల్వ ఉంది, తదితర వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయని పేర్కొన్నారు.

News July 8, 2024

నంద్యాల: భూ తగదా.. వేట కొడవలితో దాడి

image

డోన్ మండలం వెంకటనాయునిపల్లెలో భూ తగాదా హత్యాయత్నానికి దారి తీసింది. స్థానికుల వివరాలు.. మాదయ్యను అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు చెన్నయ్య, ఇంద్రప్ప ఆదివారం సాయంత్రం వేట కొడవలితో తలపై నరికారు. తీవ్ర గాయాలైన మాదయ్యను వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News July 8, 2024

క్రెడిట్ కార్డు మోసాలపై అప్రమత్తంగా ఉండండి: నంద్యాల ఎస్పీ

image

క్రెడిట్ కార్డు మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి సూచించారు. సైబర్ నేరగాళ్లు తాము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని మీకు ఇన్సూరెన్స్ యాడ్ చేస్తామని ఒక యాప్ లింక్ పంపి దాంట్లో మీ క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయాలని అడుగుతారని వివరాలు తెలపగానే క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు మాయం చేస్తారని తెలిపారు. ఎవరైనా ఫోన్ ద్వారా వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పవద్దని సూచించారు.

News July 8, 2024

నేడు కలెక్టరెట్‌లో ప్రజా ఫిర్యాదుల వేదిక: నంద్యాల కలెక్టర్ 

image

నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ఈ ప్రక్రియను పీజీఆర్‌ఎస్‌ ద్వారా చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ స్థాయిలో కూడ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 7, 2024

 మంత్రి ఫరూక్‌ను కలిసిన నంద్యాల కలెక్టర్

image

మంత్రి ఫరూక్‌ను ఆదివారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నంద్యాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ మంత్రిని కోరారు. నంద్యాల జిల్లా అభివృద్ధే తన ధ్యేయమని మంత్రి వెల్లడించారు. 

News July 7, 2024

ప్యాపిలి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ప్యాపిలి మండలంలో జరిగినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎర్రగుంట్లపల్లెకు చెందిన వైసీపీ నేత పోతురెడ్డి వెంకటేశ్వర రెడ్డి కుమారుడు ధీరజ్(23) స్నేహితుడు రమేశ్‌తో కలిసి ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి  వస్తుండగా పెద్దమ్మ డాబా వద్ద ఓ కారు వారిని ఢీకొంది. ధీరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన రమేశ్‌ను కర్నూలుకు తరలించారు. 

News July 7, 2024

నంద్యాల కలెక్టర్‌గా రాజకుమారి బాధ్యతలు

image

నంద్యాల కలెక్టరేట్‌లో ఈ రోజు ఉదయం 11.30 గంటలకు కలెక్టర్‌గా రాజకుమారి బాధ్యతలు స్వీకరించారు. మహానంది దేవస్థానం వేదపండితులు, అర్చకులు పూజలు నిర్వహించగా.. ముస్లిం, క్రైస్తవ మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వమత ప్రార్థనల అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ పద్మజ, వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

News July 7, 2024

నందికొట్కూరులో వేడేక్కిన రాజకీయం.. MLA vs బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

image

నందికొట్కూరులో TDP నేతలు పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడంతో రాజకీయం వేడెక్కింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి TDP కండువా కప్పుకోలేదని, YCPకి చెందిన వారికి పార్టీ కండువాలు ఎలా కప్పుతారని MLA జయసూర్య నిన్న వ్యాఖ్యానించారు. దీనిపై TDP రాష్ట్ర నేత చిన్న వెంకటస్వామి స్పందిస్తూ.. ‘YCP నుంచి వచ్చిన మీరా బైరెడ్డి గురించి మాట్లాడేది. MP శబరి, బైరెడ్డి దయతో గెలిచిన నువ్వు గాలి MLAవు’ అంటూ ఫైర్ అయ్యారు.

News July 7, 2024

తమ తల్లి హత్య కేసును సీఐడీకి అప్పగించాలని డీజీపీకి వినతి

image

ఆళ్లగడ్డలోని పాతూరు వీధిలో టీడీపీ మహిళా కార్యకర్త అట్లా శ్రీదేవి(54) ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును శ్రీదేవి కుమారుడు అట్లా హర్షవర్ధన్ రెడ్డి, కుమార్తె రమ్యశ్రీ కోరారు. ఈ మేరకు శనివారం విజయవాడలో డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగించి విచారణ చేయించాలని కోరారు.