Kurnool

News July 7, 2024

ఈ నెల 8న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కర్నూలు కలెక్టర్

image

జులై 8వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం)కార్యక్రమం ద్వారా  వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలను ఏర్పాటు చేశామన్నారు.

News July 6, 2024

నంద్యాల చేరుకున్న నూతన కలెక్టర్

image

నంద్యాల జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారిణి బీ.రాజకుమారి శనివారం రాత్రి నంద్యాల చేరుకున్నారు. ప్రస్తుతం గుంటూరు JCగా ఉన్న ఆమె పదోన్నతిపై నంద్యాల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నూతన జిల్లా కలెక్టర్‌ రాజకుమారికి డీఆర్వో పద్మజ, ఆర్డీవో మల్లికార్జున రెడ్డి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. కలెక్టర్‌గా రాజకుమారి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

News July 6, 2024

CMల భేటీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

image

ఏపీ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల CMలు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో భేటీలో రాష్ట్రం నుంచి నలుగురు మంత్రులకు అవకాశం దక్కగా.. అందులో బనగానపల్లె MLA, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా బీసీ జనార్దన్ రెడ్డి CM చంద్రబాబు వెంట పాల్గొన్నారు. దీంతో BCJRకి అరుదైన గౌరవం దక్కింది.

News July 6, 2024

గుడికంబాళి నుంచి ఇసుక రవాణా: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో ఈ నెల 8వ తేది నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. కౌతాళం మండలం గుడికంబాళి స్టాక్ పాయింట్ నుంచి ఇసుక రవాణాను ప్రారంభించాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఉచిత ఇసుక విధానాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News July 6, 2024

కర్నూలు: హెడ్ కానిస్టేబుల్ మృతి

image

మంత్రాలయం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేశ్ అనారోగ్యంతో మృతిచెందినట్లు ఎస్సై గోపీనాథ్ తెలిపారు. రమేశ్ 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారన్నారు. 1998 బ్యాచ్‌కు చెందిన రమేశ్.. గతంలో ఆదోని వన్ టౌన్ ట్రాఫిక్ స్టేషన్‌లో పనిచేసేవారని, ప్రస్తుతం మంత్రాలయంలో విధులు నిర్వహించారని తెలిపారు.

News July 6, 2024

కర్నూలు: రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

image

మంత్రాలయం రోడ్డు (తుంగభద్ర) రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పద్మ అనే మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే శాఖ ఎస్సై నరసింహ మూర్తి తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన పద్మకు కర్ణాటకలోని అడివి కానాపురానికి చెందిన వీరేశ్‌తో వివాహం జరిగింది. పద్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన కర్ణాటక ప్రాంతంలో జరిగడంతో అక్కడి పోలీసులే కేసు నమోదు చేశారన్నారు.

News July 6, 2024

నందికొట్కూరులో వైసీపీని వీడి టీడీపీలో చేరిక

image

నందికొట్కూరు మున్సిపాలిటీలోని 12వ వార్డుకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడు మారుతీ నగర్ బొల్లెద్దుల ఏసన్న ఆధ్వర్యంలో 20 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రసాద్, అశోక్, ప్రభాకర్, డేవిడ్, రాజేశ్, నాగులు, యేసేపు, తదితరులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని రాజశేఖర్ రెడ్డి భరోసా ఇచ్చారు.

News July 6, 2024

నంద్యాల: ‘నీలా’ పేరుతో రోబో ఆవిష్కరణ

image

పాణ్యం మండలంలోని ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్), బీఎస్ విభాగం ఆధ్వర్యంలో నీలా పేరుతో రోబోను ఆవిష్కరించారు. ఈ రోబో లైబ్రరీ నిర్వహణ, కార్యకలాపాలకు సహాయం చేయడం వంటి పనులు నిర్వహిస్తుందని యూనిఫాస్ట్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు సుబ్రమణ్యం తెలిపారు. ఈ రోబోపై విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు ఏఐ, ఎంఎల్ పద్ధతులను ఉపయోగించి పరిశోధనలు చేయవచ్చన్నారు.

News July 6, 2024

కర్నూలు: లా సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో లా కోర్సుకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. 3, 5వ సంవత్సరాల 2, 4, 6, 8, 10వ సెమిస్టర్లకు సంబంధించిన ఫలితాలను రెక్టార్ ఎన్టీకే నాయక్ శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను రాయలసీమ వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెల్లడించారు.

News July 6, 2024

6 అంశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

వెనుకబడిన ప్రాంతాల్లో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ద్వారా అమలు చేస్తున్న 6 అంశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పత్తికొండ నియోజకవర్గంలోని కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్యాంబాబు మాట్లాడుతూ.. పత్తికొండ నియోజకవర్గం నుంచి వెనకబడ్డ మండలంగా మద్దికేరను ఎంపిక చేశారన్నారు.