India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లా సెట్ పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు లా సెట్ కన్వీనర్ తెలిపారు. నంద్యాలలోని శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు.
డీసీసీ బ్యాంక్ ఛైర్ పర్సన్ పదవికి వైసీపీ నేత విజయ మనోహరి శనివారం రాజీనామా చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అతి తక్కువ సమయం ఛైర్మన్గా పనిచేశానని అన్నారు. విధి నిర్వహణలో తనకు సహాయ సహకారాలు అందించిన బ్యాంకు అధికారులకు, సిబ్బందికి, APCOB వారికి, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన 99 సహకార సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా రుణపడి ఉంటానని అన్నారు.
కర్నూలు జిల్లాలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలనే కాకుండా పోలీసులకు సైతం కుచ్చుటోపీ పెట్టి సవాల్ విసురుతున్నారు. తాజాగా కోడుమూరు సీఐ మన్సురుద్దీన్ అకౌంట్ నుంచి రూ.2.20 లక్షలు కొట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న తన ఖాతా నుంచి డబ్బులు మాయమైనట్లు సీఐ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
నంద్యాల జిల్లాలో 16 మండలాలలో వర్షపాతం నమోదైంది. జిల్లాలో బేతంచెర్ల మండలంలో అత్యధికంగా 65.8 మి.మీ వర్షపాతం నమోదైంది. గోస్పాడు 46.2మి.మీ పాణ్యం 44.6, బండి ఆత్మకూరు 42.6, ఉయ్యాలవాడ 42.4, దొర్నిపాడు 42.2 మిమీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యల్పంగా గడివేముల 3.4 మిమీ, డోన్ 0.8 వర్షపాతం నమోదైంది.
ఈనాడు గ్రూప్ అధినేత, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత డా.రామోజీరావు మృతిపై కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఓ శకం ముగిసింది. కానీ వారసత్వం జీవిస్తుంది. లెజెండరీ రామోజీరావు కన్నుమూశారు. ఆయనను కలవడం గొప్ప గౌరవం’ అని కలెక్టర్ రాసుకొచ్చారు. గతంలో రామోజీరావును తన భర్త రవితేజతో కలిసిన ఓ ఫోటోను కలెక్టర్ సృజన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
ఎమ్మిగనూరులో తండ్రీకొడుకులు ఆరుసార్లు గెలుపొందారు. మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వరుసగా 1985 నుంచి1999 వరకు వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. ఆయన వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన బీవీ జయనాగేశ్వరరెడ్డి 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకపై రెండోసారి గెలిచి టీడీపీ జెండా ఎగరవేశారు.
మద్దికేర పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరామిరెడ్డి ఎస్ఐగా పదోన్నతి పొంది ఒక్క రోజు మాత్రమే పని చేశాడు. 31వ తేదీన జిల్లా ఉన్నతాధికారులు ఎస్ఐగా పదోన్నతి ఇచ్చారు. అదే రోజు పదవి విరమణ చేశారు. అయితే ఎక్కడ కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో మద్దికెర స్టేషన్లోనే పదవి విరమణ పొందారు. డి. ఎస్. పి సీఐ ఎస్ఐలు తోపాటు, సిబ్బంది బంధుమిత్రులు ఆయనను సత్కరించడం జరిగింది.
సార్వత్రిక ఎన్నికల్లో ఆలూరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేగా చిప్పగిరి మండల కేంద్రానికి చెందిన విరూపాక్షి, ఆలూరు మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ IAS ఆఫీసర్ బర్ల రామాంజనేయులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామానికి చెందిన గుమ్మనూరు జయరాం గుంతకల్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు దాదాపు క్లీన్ స్వీప్ చేయడంతో మంత్రి పదువులకు పోటీ పెరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ సాగుతోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నేపథ్యంలో జిల్లాకు ఒకటి లేదా రెండు కంటే మించి మంత్రి పదవులు దక్కకపోవచ్చన్న చర్చ నడుస్తోంది. జిల్లాలో మంత్రి పదవి ఎవరికి వస్తుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
నంద్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ.. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను అందరి సమస్వయంతో దిగ్విజయంగా పూర్తి చేసిన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.